గనుల మంత్రిత్వ శాఖ
ప్రముఖ భౌగోళిక-వారసత్వ ప్రదేశాల్లో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా
Posted On:
21 JUN 2025 10:29AM by PIB Hyderabad
గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా దేశవ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించింది. ఈ సారి ఇతివృత్తమైన "ఒకే ధరిత్రి, ఒకే ఆరోగ్యం కోసం యోగా"కు అనుగుణంగా యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యం, పర్యావరణ అవగాహన, భౌగోళిక శాస్త్ర వ్యాప్తికి సంబంధించి జీఎస్ఐ తన నిబద్ధతను ప్రధానంగా వ్యక్తపరుస్తోంది.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చొరవ తీసుకోవటంతో ప్రారంభమైన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని భారతదేశం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నేతృత్వంలో దేశవ్యాప్తంగా జరిగిన సామూహిక యోగా కార్యక్రమమైన 'యోగ సంగమం'లో జీఎస్ఐ చురుగ్గా పాల్గొంది. ఈ సంవత్సరం వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా ఉన్న ఈ కార్యక్రమం.. ఐక్యత, శ్రేయస్సును తెలియజేస్తోంది.
కోల్కతాలోని జీఎస్ఐ కేంద్ర ప్రధాన కార్యాలయంలో యోగా నిపుణుల నేతృత్వంలో చేపట్టిన యోగా సాధన కార్యక్రమాన్ని డైరెక్టర్ జనరల్ శ్రీ అసిత్ సాహా ప్రారంభించడంతో యోగా దినోత్సవ వేడుకలు మొదలయ్యాయి. ఈ సందర్భంగా సాహా మాట్లాడుతూ. శాస్త్రీయ నైపుణ్యం, వ్యక్తిగత వృద్ధికి అవసరమైన కీలక లక్షణాలైన స్పష్టత, దృష్టి కేంద్రీకరణ, తట్టుకొని నిలబడే శక్తిపై యోగా చూపించే ప్రభావాన్ని ప్రధానంగా తెలియజేశారు.
ఈ వేడుకల్లో భాగంగా జీఎస్ఐ దేశంలోని ప్రాంతీయ, రాష్ట్ర స్థాయి కార్యాలయాలు.. శిక్షణ కేంద్రాలు, పనిచేస్తోన్న క్షేత్ర స్థాయి కార్యాలయాలతో సహా 46 ప్రదేశాలలో 50 యోగా సాధన కార్యక్రమాలను నిర్వహించింది. భారత భౌగోళిక వారసత్వాన్ని భౌతిక శ్రేయస్సుతో అనుసంధానించే 12 భౌగోళిక- వారసత్వ కేంద్రాల్లో జరిగిన బహిరంగ యోగా సాధనలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. వారసత్వ ప్రదేశాలలో జీఎస్ఐ అధికారులు, స్థానికులు, విద్యార్థులు, సాధారణ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
యోగా నిర్వహించిన12 భౌగోళిక-వారసత్వ కేంద్రాలు:
1. జవార్ పురాతన గనుల నగరం, రాజస్థాన్ - క్రీ.పూ. 800 నాటి పురాతన జింక్ కరిగించే పద్ధతులకు ప్రసిద్ధి.
2. రహియోలి డైనోసార్ శిలాజ ఉద్యానవనం, గుజరాత్- వివిధ డైనోసార్ జాతుల శిలాజ అవశేషాలు, గుడ్లకు నిలయం.
3. భీమ్బెట్కా రాతి గుహాలు, మధ్యప్రదేశ్ - చరిత్రపూర్వ శిలాజ కళను కలిగి ఉన్న యునెస్కో ప్రపంచ వారసత్వ కేంద్రం.
4. నిఘోజ్ సహజ గుంతలు, మహారాష్ట్ర - కుకాడి నదిపై నీటితో చెక్కిన రాతి నిర్మాణాలకు ప్రసిద్ధి.
5. దుధినాల, జార్ఖండ్ - హిమానీనద సముద్ర ముద్రలు, అవక్షేప లక్షణాలకు ప్రసిద్ధి.
6. గంగా నది గార్జ్, పశ్చిమ బెంగాల్ - శక్తిమంతమైన లాటరిటిక్ ప్రాకృతిక రూపురేఖలకు ప్రసిద్ధి. "బెంగాల్ గ్రాండ్ కాన్యన్"గా సుపరిచితం.
7. సివాలిక్ శిలాజ ఉద్యానవనం, హిమాచల్ ప్రదేశ్ - పురాతన క్షీరదాల శిలాజ అవశేషాలకు ప్రసిద్ధి.
8. సల్ఖాన్ శిలాజ ఉద్యానవనం, ఉత్తర ప్రదేశ్ - ప్రొటెరోజోయిక్ యుగానికి చెందిన స్ట్రోమాటోలైట్ శిలాజాలకు ప్రసిద్ధి.
9. ఆర్వా-లుమ్షిన్నా గుహ, మేఘాలయ - అద్భుతమైన స్టాలక్టైట్ , స్టాలగ్మైట్ ఆకృతులకు నిలయం.
10. సెయింట్ థామస్ మౌంట్ చార్నోకైట్, తమిళనాడు - 2500 మిలియన్ సంవత్సరాల పురాతన చార్నోకైట్కు ప్రసిద్ధి చెందిన ఒక ముఖ్యమైన రూపాంతర శిల.
11. పెనిన్సులార్ శిల, లాల్బాగ్, కర్ణాటక - గొప్ప భౌగోళిక ప్రాముఖ్యత కలిగిన 3000 మిలియన్ సంవత్సరాల పురాతన రాయి.
12. మంగంపేట బైరైట్ నిక్షేపం, ఆంధ్రప్రదేశ్ - ప్రపంచంలోని అతిపెద్ద బైరైట్ నిక్షేపాలలో ఒకటి.
పలు ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల ద్వారా జీఎస్ఐ యోగా సాధనను దానికున్న శాస్త్రీయ లక్ష్యంతో విజయవంతంగా మిళతం చేసింది. అంతేకాకుండా ఆరోగ్యం, పర్యావరణం, సాంస్కృతిక వారసత్వం మధ్య ఉన్న సంబంధాన్ని బలోపేతం చేసింది.
యోగా దినోత్సవ వేడుకల చిత్రాలు
కోల్కతాలోని జీఎస్ఐ, సీహెచ్క్యూలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం-2025 కార్యక్రమాలను ప్రారంభిస్తోన్న జీఎస్ఐ డీజీ శ్రీ అసిత్ సాహా
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తూ ఇతరులతో కలిసి యోగా సాధన చేస్తోన్న జీఎస్ఐ డీజీ శ్రీ అసిత్ సాహా
కోల్కతాలోని సీహెచ్క్యూలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రసంగిస్తోన్న జీఎస్ఐ డీజీ శ్రీ అసిత్ సాహా
పశ్చిమ బెంగాల్లోని గంగాని నది లోయలోని భౌగోళిక సాంస్కృతిక క్షేత్రంలో 2025 అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
గుజరాత్లోని రాహియోలి రహియోలి డైనోసార్ శిలాజ ఉద్యానవనంలో భౌగోళిక వారసత్వ క్షేత్రంలో 2025 అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
ఎస్యూలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్న జీఎస్ఐ అధికారులు, సిబ్బంది: ఇటానగర్, అరుణాచల్ ప్రదేశ్
(Release ID: 2138291)