ప్రధాన మంత్రి కార్యాలయం
అహ్మదాబాద్ ప్రమాదంపై ప్రధాని దిగ్భ్రాంతి, సత్వర సహాయం అందిస్తామని హామీ
Posted On:
12 JUN 2025 4:15PM by PIB Hyderabad
ఈ రోజు అహ్మదాబాద్ లో జరిగిన ప్రమాదం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారం, దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటన దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందని, ఇది మాటల్లో చెప్పలేని హృదయ విదారక ఘటన అని అన్నారు.
ఈ ప్రమాదంలో బాధితులకు సత్వరమే తగిన సాయం అందించేందుకు మంత్రులు, సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నానని శ్రీ మోదీ అన్నారు.
ఎక్స్లో ప్రధాని పోస్టు:
అహ్మదాబాద్లో జరిగిన ఈ విషాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ హృదయ విదారక ఘటన మాటలకందని విషాదం. ఈ విపత్కర సమయంలో బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. సహాయక చర్యలపై మంత్రులు, సంబంధిత అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాను’’.
***
MJPS/SR
(Release ID: 2135944)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam