గనుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

కీలక ఖనిజాలపై సదస్సును ప్రారంభించిన కేంద్రమంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి


భారత్ లోని క్లిష్టమైన ఖనిజాల వ్యవస్థను ముందుకు నడిపించడానికి ఎన్ సిఎంఎం అవుట్ రీచ్ ఫోరాన్ని ప్రారంభించిన కేంద్రమంత్రి

Posted On: 06 JUN 2025 7:22PM by PIB Hyderabad

కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ఈ రోజు కీలక ఖనిజాల సదస్సునునేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ (ఎన్ సిఎంఎంకింద ఎన్ సిఎంఎం ఔట్ రీచ్ ఫోరాన్ని ప్రారంభించారున్యూఢిల్లీలో క్రిటికల్ మినరల్ ప్రాసెసింగ్ పై జరిగిన జాతీయ సదస్సులో భాగంగా ఈ ఆవిష్కరణ జరిగింది.

ఈ సందర్భంగా శ్రీ కిషన్ రెడ్డి ప్రధానోపన్యాసం చేస్తూదేశంలో పరిశుభ్రమైన ఇంధన మార్పురక్షణ సంసిద్ధతడిజిటల్ ఆర్థిక వ్యవస్థఅధునాతన తయారీ రంగాల కోసం కీలకమైన ఖనిజాల వ్యూహాత్మక ప్రాముఖ్యతను వివరించారు

సుస్థిరస్వావలంబన కలిగిన కీలక ఖనిజాల వ్యవస్థను నిర్మించడానికి ప్రభుత్వ సంస్థలుపరిశ్రమలుపరిశోధనా సంస్థలుఅంకుర సంస్థల మధ్య సహకారాన్ని పెంపొందించాలని ఆయన పిలుపునిచ్చారు.

కీలక ఖనిజాల శుద్ధిసాంకేతిక పరిజ్ఞానానికి అంతర్జాతీయ కేంద్రంగా మారాలన్న భారతదేశ దార్శనికతకు అనుగుణంగా ఆవిష్కరణలను ప్రోత్సహించడానికిపెట్టుబడులను ఆకర్షించడానికిసుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఔట్ రీచ్ ఫోరం కీలక వేదికగా పనిచేస్తుందని కిషన్ రెడ్డి చెప్పారు.

ఇటీవల జరిగిన వేలంసెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్కీమ్ తదితర మిషన్ కార్యకలాపాల పురోగతిపై గనుల మంత్రిత్వ శాఖ ఒక అప్ డేట్ ను సమర్పించిందిప్రైవేటుప్రభుత్వ సంస్థలురాష్ట్ర ప్రభుత్వాలుఆర్ అండ్ డీ సెంటర్లువిద్యా సంస్థలుఏడీబీప్రపంచ బ్యాంకుభారత ప్రభుత్వ సంస్థల వంటి అంతర్జాతీయ ఫైనాన్సింగ్ ఏజెన్సీలు సహా సుమారు 200 మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.

ఈ సందర్భంగాగనుల మంత్రిత్వ శాఖ పరిపాలనా నియంత్రణలో ఉన్న సిపిఎస్ఇ -  హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ మంత్రిత్వ శాఖ కింద పనిచేసే రైట్స్ లిమిటెడ్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుందిభారతదేశంలోనూవిదేశాలలోనూ అన్వేషణవెలికితీతశుద్ధిఉత్పత్తి కార్యకలాపాలను చేపట్టడం ద్వారా కీలక ఖనిజాలతో సహా లోహాలుఖనిజాల వేగవంతమైనవిశ్వసనీయమైనస్థిరమైన సరఫరా వ్యవస్థ కోసం ఈ అవగాహన ఒప్పందాన్ని ఉద్దేశించారుఈ ఒప్పందం ప్రకారం కీలక ఖనిజాల కోసం నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించడానికి రెండు కంపెనీలు తమ అనుబంధ సాంకేతికఆర్థిక వనరులను ఉపయోగిస్తాయి.

సీనియర్ విధాన నిర్ణేతలుపారిశ్రామిక దిగ్గజాలునిపుణులువిద్యా సంస్థలుశాస్త్రీయ పరిశోధనా సంస్థలురాష్ట్ర ప్రభుత్వ అధికారులు పాల్గొన్న ఈ సదస్సులో పలు సాంకేతికవిధాన చర్చలు జరిగాయిపరిశోధనా సంస్థలకు స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంలో ఆవిష్కరణలుతక్కువ గ్రేడ్సంక్లిష్ట ధాతువుల ప్రాసెసింగ్ కోసం సమర్థవంతమైన పరిష్కారాలను సాధించడానికి అవకాశాలపై సాంకేతిక చర్చలు దృష్టి సారించాయిసమర్థవంతమైన,  స్థిరమైన ఖనిజశుద్ధి సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కొనసాగుతున్న కార్యక్రమాలపై ప్రముఖ ప్రైవేట్ రంగ నిపుణులు సమాచారాన్ని పంచుకున్నారుకీలక ఖనిజాల ప్రాసెసింగ్ ను సులభతరం చేయడానికి తీసుకున్న చర్యలను రాష్ట్ర ప్రభుత్వాలు పేర్కొన్నాయి.

ఖనిజశుద్ధి సాంకేతిక పరిజ్ఞానాల్లో సాధించిన పురోగతిమౌలిక సదుపాయాలు,  అనుమతులను మెరుగుపరచేందుకు రాష్ట్ర ప్రభుత్వాల చొరవలిథియంనికెల్గ్రాఫైట్ వంటి కీలక ఖనిజ పరిశ్రమల ఆధ్వర్యంలోని శుద్ధి చర్యలుపెట్టుబడులను హాని లేకుండా చేయడానికి వినూత్న ఆర్థిక నమూనాలురీసైక్లింగ్,  విస్తృత ఉత్పత్తిదారుల బాధ్యతా పద్ధతుల ద్వారా పునరుపయోగ ఆర్థిక వ్యవస్థ నిర్మాణం వంటి అంశాలపై చర్చలు జరిగాయి

రోజంతా జరిగిన ఈ సదస్సుభారతదేశంలోనూభారతదేశం కోసం మైనింగ్‌ప్రాసెసింగ్‌ పరిశ్రమలను బలోపేతం చేయడానికి ఆసక్తిదారులతో సంస్థల భాగస్వామ్యాన్ని మరింతగా పెంచేందుకు దోహదపడింది.

 

***


(Release ID: 2134749)
Read this release in: English , Urdu , Hindi