బొగ్గు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి

Posted On: 05 JUN 2025 2:46PM by PIB Hyderabad

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి అశోకా రోడ్, 6 లోని తన అధికారిక నివాసం వద్ద మొక్కలు నాటారుతెలంగాణలోని వివిధ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారువీరంతా ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ఉత్తమ ర్యాంకులు సాధించారువారి కృషిని గుర్తించిన శ్రీ జికిషన్ రెడ్డి ఆధునిక పర్యావరణ యోధులుగా మారాలన్నారు.

పర్యావరణాన్ని మరింత పచ్చగామెరుగ్గా తయారు చేసేందుకు క్షేత్ర స్థాయిలో కృషి చేస్తున్న వారిని మంత్రి అభినందించారుప్లాస్టిక్ కాలుష్య ప్రభావంపై పెరుగుతున్న శాస్త్రీయ ఆధారాలను తెలియజేయడమే ఈ ఏడాది ప్రపంచ పర్యావరణ దినోత్సవ లక్ష్యంఅలాగే స్వచ్ఛమైనసుస్థిరమైన భవిష్యత్తును నిర్మించేందుకు ప్లాస్టిక్ వినియోగాన్ని తిరస్కరించడంతగ్గించడంపునర్వినియోగంరీసైకిల్ చేయడం వంటి చర్యలను ప్రోత్సహిస్తుందిప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు బొగ్గుగనుల మంత్రిత్వ శాఖలు సమష్టి ప్రయత్నాలు చేయాలని మంత్రి సూచించారు.

 

***


(Release ID: 2134422)