బొగ్గు మంత్రిత్వ శాఖ
2023-24 తో పోలిస్తే 2024-25 ఆర్థిక సంవత్సరంలో 7.9 శాతం మేర తగ్గిన బొగ్గు దిగుమతులు
Posted On:
27 MAY 2025 4:24PM by PIB Hyderabad
గడచిన ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2024-25 ఆర్థిక సంవత్సరంలో 7.9 శాతం అంటే మొత్తం రూ. 243.62 మిలియన్ టన్నులు (ఎంటీ) మేర బొగ్గు దిగుమతులు తగ్గాయి. గతేడాది ఈ విలువ 264.53 ఎంటీలుగా ఉంది. ఈ తగ్గుదల కారణంగా సుమారు 7.93 బిలియన్ డాలర్లు (రూ.60681.67 కోట్లు) మేర విదేశీ మారకద్రవ్యం ఆదా అయింది. విద్యుత్ రంగాన్ని మినహాయిస్తే.. ముఖ్యంగా అనియంత్రిత రంగంలో ఈ తగ్గుదల ఎక్కువగా కనిపించింది. గతేడాదితో పోలిస్తే 8.95 శాతం మేర ఈ దిగుమతులు తగ్గాయి. అలాగే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2024-25 ఆర్థిక సంవత్సరానికి బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి 3.04 శాతం మేర పెరిగినప్పటికీ విద్యుత్ ఉత్పత్తి కోసం బొగ్గు మిశ్రమాన్ని తయారు చేయడం కోసం థర్మల్ విద్యుత్ కేంద్రాల చేసుకునే దిగుమతులు 41.4 శాతం మేర తగ్గాయి. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి బొగ్గు ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని మెరుగుపరచడంలో భారత్ చేస్తున్న నిరంతర ప్రయత్నాలను ఇది తెలియజేస్తుంది.
దేశీయంగా బొగ్గు ఉత్పత్తిని పెంచడానికి, దిగుమతులను తగ్గించడానికి వాణిజ్య బొగ్గు తవ్వకం, మిషన్ కోకింగ్ కోల్తో సహా వివిధ కార్యక్రమాలను భారత ప్రభుత్వం చేపడుతోంది. ఈ ప్రయత్నాలే గడచిన ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2024-25 ఆర్థిక సంవత్సరంలో బొగ్గు ఉత్పత్తిలో 5 శాతం వృద్ధికి కారణమయ్యాయి.
వేగంగా వృద్ధి చెందుతున్న భారత ఆర్థిక వ్యవస్థకు మద్దతు అందించడంలో బొగ్గు రంగం కీలకపాత్రను పోషిస్తోంది. విద్యుత్, ఉక్కు, సిమెంట్, తదితర ప్రధాన పరిశ్రమలకు బొగ్గు ప్రాథమిక ఇంధన వనరుగా పనిచేస్తోంది. అయితే దేశీయంగా బొగ్గు డిమాండ్ను తీర్చడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా దేశంలో కోకింగ్ కోల్, హై గ్రేడ్ థర్మల్ కోల్ నిల్వల్లో కొరత ఉంది. కాబట్టి ఉక్కుతో సహా ప్రాధాన్య రంగాల అవసరాలను తీర్చడంలో బొగ్గు దిగుమతులు కీలకంగా మారాయి.
బొగ్గు దిగుమతులు తగ్గించి, ఇంధన భద్రతను పెంపొందించాలనే భారత్ లక్ష్యానికి అనుగుణంగా దేశీయంగా ఉత్పత్తిని బలోపేతం చేసి, సరఫరాను సురక్షితంగా చేపట్టేందుకు బొగ్గు మంత్రిత్వ శాఖ వ్యూహాత్మక చర్యలను అమలు చేస్తోంది. దేశీయంగా బొగ్గు ఉత్పత్తికి ప్రాధాన్యమివ్వడం ద్వారా దీర్ఘకాలంలో ఆర్థిక వృద్ధికి తోడ్పడే స్వావలంబన సాధించిన, సుస్థిరమైన ఇంధన వ్యవస్థను నిర్మించడం ద్వారా వికసిత భారత్ దిశగా ముందుకు సాగాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
***
(Release ID: 2131763)