జల శక్తి మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

గంగా పునరుజ్జీవనానికి ఉద్దేశించిన కీలక ప్రాజెక్టులకు ఎన్ఎంసీజీ కార్యనిర్వాహక సంఘ 62వ సమావేశంలో ఆమోదం.. జీవావరణ వ్యవస్థ పునరుద్ధరణ మాధ్యమం అండదండలు..


• ఎన్ఎంసీజీ డైరెక్టర్-జనరల్ శ్రీ రాజీవ్ కుమార్ మిత్తల్ అధ్యక్షత.. నది పునరుజ్జీవనంలో స్థిర ప్రాతిపదికపై ప్రత్యేక దృష్టి

• ప్రపంచంలో అగ్రగామి పది పునరుద్ధరణ ప్రధాన కార్యక్రమాల్లో నమామి గంగే కార్యక్రమానికీ స్థానాన్నిచ్చిన యూఎన్ డెకేడ్ (యూఎన్ఈపీ అండ్ ఎఫ్ఏఓ)

Posted On: 06 MAY 2025 3:48PM by PIB Hyderabad

నదులు, పర్యావరణం సంపూర్ణ పునరుజ్జీవన దిశగా చేపట్టిన ఒక చొరవా అన్నట్లు,  స్థిర ప్రాతిపదికన నదుల పునరుజ్జీవన అంశంపై క్లీన్ గంగా నేషనల్ మిషన్ (ఎన్ఎంసీజీ) కార్యనిర్వాహక కమిటీ (ఎగ్జిక్యూటివ్ కమిటీ.. ఈసీ) 62వ సమావేశం తన దృష్టిని కేంద్రీకరించింది. ఈ సమావేశానికి ఎన్ఎంసీజీ డైరెక్టర్-జనరల్ శ్రీ రాజీవ్ కుమార్ మిత్తల్ అధ్యక్షత వహించారు. ముఖ్య  చిత్తడి నేలల సంరక్షణతోపాటు శుద్ధిపరచిన వ్యర్థజలాలను నిర్దిష్ట పునర్వినియోగ ప్రణాళికల మాధ్యమం ద్వారా నగరాల్లో తిరిగి ఉపయోగించడాన్ని ప్రోత్సహించడం.. ఈ రెండు అంశాలపై సమావేశంలో చర్చించారు. గంగా నది పరీవాహక ప్రాంతంలో జీవావరణ వ్యవస్థ పునరుద్ధరణకు పాటుపడాలన్న మిషన్ ఉద్దేశాలతో సరిపోలిన పథకాలకు కమిటీ ఆమోదాన్ని తెలిపింది. ‘నమామి గంగే’కు ప్రపంచంలోని అగ్రగామి పునరుద్ధరణ ప్రధాన కార్యక్రమాలు పదింటిలో ఒక స్థానాన్ని యూఎన్ డెకేడ్ (యూఎన్ఈపీ అండ్ ఎఫ్ఏఓ) ఇచ్చిన విషయం తెలిసిందే.
రూ.3.51 కోట్ల అంచనా వ్యయంతో బీహార్‌లోని భోజ్‌పూర్ జిల్లాలో నథ్‌మల్‌పుర్ భగద్  (చిత్తడి నేల)ను దీర్ఘకాల ప్రాతిపదికన సంరక్షించే’’ ప్రాజెక్టుకు కూడా ఈసీ ఆమోదాన్ని తెలిపింది.  ఎన్‌జీపీలో భాగంగా చేపడుతున్న అయిదో చిత్తడినేల సంబంధిత ప్రాజెక్టు ఇది. నాథ్‌మల్‌పుర్‌భగద్‌ను దృష్టిలో పెట్టుకొని ఒక ప్రభావవంతమైన నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నదే దీని ఉద్దేశం.
ఇప్పటి వరకు, నమామి గంగే కింద మంజూరు దశ దాటిన 4 చిత్తడి నేలలు ఏవేవంటే, వాటిలో:
1. కాలేవాడ పెద్దచెరువు, ముజఫర్‌నగర్, ఉత్తరప్రదేశ్
2. నామియా దాహ్ పెద్దచెరువు, ప్రయాగ్‌రాజ్, ఉత్తరప్రదేశ్
3. రేవతీ దాహ్ చిత్తడినేల, బలియా, ఉత్తరప్రదేశ్‌తోపాటు,
4. ఉధ్‌వా సరస్సు (రాంసర్ స్థలం), సాహిబ్‌గంజ్, ఝార్ఖండ్.. ఉన్నాయి.
ఇది జీవవైవిధ్యాన్ని, ఇకోసిస్టమ్ సంరక్షణనూ నదీ పరీవాహక ప్రాంత సంరక్షణ, అభివృద్ధి ప్రధాన ప్రణాళిక రూపకల్పన ప్రక్రియల్లో చేర్చడంపై శ్రద్ధ తీసుకొంటుంది. ఈ ప్రాజెక్టు రెండు విధాలైన కార్యక్రమాన్ని అమలుపరచనుంది.  చిత్తడినేలల సంరక్షణ దీర్ఘకాల ప్రాతిపదికన కొనసాగేటట్టు చూడడానికి సబ్-బేసిన్ (ఘఘ్‌రా, గోమతి, సోన్ ల సంగమం)తోపాటు నిర్దిష్ట ప్రాంతం (నాథ్‌మల్‌పుర్ భగద్)లో  నీటిప్రవాహ మట్టాల పర్యవేక్షణ-తదనుగుణంగా చర్య తీసుకోవడం దీనిలో భాగంగా ఉంటాయి. చిత్తడి నేల పరిధిని పేర్కొనడం, జల విజ్ఞాన వ్యవస్థలో పెంపు, ప్రజాతి- ఆవాస సంరక్షణ,  జీవావరణ మదింపు, నష్టభయ నిర్ధారణ, సామర్థ్యాల పెంపు, కమ్యూనికేషన్-ప్రజాసంబంధాలు (అవుట్‌రీచ్) వంటి కార్యకలాపాలు కూడా చేపడతారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా, ప్రయాగ్‌రాజ్ జిల్లాల కోసం పట్టణ ప్రణాళికలను రూపొందించడం, వ్యర్థజలాల పునర్వినియోగంలో శిక్షణను ఇవ్వడానికి ‘గంగా బేసిన్‌లో జల ప్రవాహాలు ముంచెత్తే అపాయం పొంచి ఉన్న పట్టణాలను దృష్టిలో పెట్టుకొని సామర్థ్యాలను పెంచే కార్యక్రమాల’’ ప్రాజెక్టును అమలు చేయడానికి రూ.34.50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించడానికి కూడా ఈసీ ఆమోదాన్ని తెలిపింది. ఎన్ఎంసీజీ ద్వారా అభివృద్ధిపరిచిన శుద్ధ జల పునరుపయోగానికి ఉద్దేశించిన జాతీయ ఫ్రేంవర్క్ (సేఫ్ రీయూజ్ ఆఫ్ ట్రీటెడ్ వాటర్..ఎస్‌ఆర్‌టీడబ్ల్యూ) కు అనుగుణంగా నగర స్థాయిలో పునర్వినియోగ ప్రణాళికను రూపొందించాలన్నదే ఈ ప్రాజెక్టు ఉద్దేశం.
ఈ ప్రాజెక్టుకు ఇచ్చిన ఆమోదం సమీకృత జల నిర్వహణ, పర్యావరణ పునరుద్ధరణల కోసం ఎన్ఎంసీజీ ఎంత నిబద్ధతతో ఉందో పునరుద్ఘాటిస్తోంది. మిషన్ ముందుకు పోతున్న కొద్దీ, ఈ తరహా వ్యూహాత్మక నిర్ణయాలను తీసుకోవడమనేది స్వచ్ఛమైన, ఆరోగ్యవంతమైన, దీర్ఘకాలం పాటు మనుగడలో ఉండే నదీ జీవావరణ వ్యవస్థను భావి తరాల వారికి అందించాలన్న లక్ష్యాన్ని సాధించడంలో కీలక పాత్రను పోషించనుంది.
ఈ సమావేశంలో పాల్గొన్న వారిలో శ్రీ మహాబీర్ ప్రసాద్, విద్యుత్తు శాఖలో సంయుక్త కార్యదర్శి, ఆర్థిక సలహాదారు, (అదనపు బాధ్యత) జల శక్తి మంత్రిత్వ శాఖకు చెందిన నదీ అభివృద్ధి, గంగా పునరుజ్జీవన విభాగం; శ్రీ నళిన్ శ్రీవాస్తవ, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ - ఎన్ఎంసీజీ; శ్రీ అనూప్ కుమార్ శ్రీవాస్తవ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు (టెక్నికల్); శ్రీ బ్రిజేంద్ర స్వరూప్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు (ప్రాజెక్టులు); శ్రీ ఎస్.పి. వశిష్ఠ,  ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు (పరిపాలన); శ్రీ భాస్కర్ గుప్త,  ఎగ్జిక్యూటివ్ డైరెక్టరు (ఫైనాన్స్); శ్రీ ప్రభాస్ కుమార్, అడిషనల్ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఉత్తరప్రదేశ్ ఎస్ఎంసీజీలతో పాటు శ్రీ ఎస్. చంద్రశేఖర్, ఐ.ఎఫ్.ఎస్, చీఫ్ కన్సర్వేటర్-ఫారెస్ట్ కమ్ స్టేట్ నోడల్ ఆఫీసర్, ఎన్విరాన్‌మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్, బీహార్.. ఉన్నారు.‌

 

****


(Release ID: 2127360)