ప్రధాన మంత్రి కార్యాలయం
హర్యానాలోని నూహ్లో జరిగిన ప్రమాద మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధానమంత్రి
Posted On:
26 APR 2025 7:23PM by PIB Hyderabad
హర్యానాలోని నూహ్లో జరిగిన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. “రాష్ట్ర ప్రభుత్వం సహాయక, రక్షణ చర్యలు కొనసాగిస్తోంది” అని శ్రీ ప్రధానమంత్రి పేర్కొన్నారు.
‘ఎక్స్’ వేదికగా ప్రధానమంత్రి కార్యాలయం ఈ విధంగా పేర్కొన్నది:
"హర్యానాలోని నూహ్లో జరిగిన ప్రమాదం చాలా హృదయ విదారకమైనది. మృతుల కుటుంబాలకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ క్లిష్ట సమయంలో దేవుడు వారికి మనోబలాన్ని ప్రసాదించుగాక. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వం సహాయక, రక్షణ చర్యలు కొనసాగిస్తోంది: ప్రధానమంత్రి @narendramodi"
***
MJPS/VJ
(Release ID: 2124779)
Visitor Counter : 7
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam