ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానితో శ్రీలంకకు చెందిన భారత సంతతి తమిళ నేతల భేటీ
Posted On:
05 APR 2025 9:53PM by PIB Hyderabad
శ్రీలంక లోని భారత సంతతికి చెందిన తమిళ (ఐఓటీ) నాయకులు ఈ రోజు కొలంబోలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు. శ్రీలంక ప్రభుత్వ సహకారంతో ఐఓటీల కోసం 10,000 గృహాలు, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, పవిత్ర సీతా ఎలియా ఆలయ ప్రదేశం, ఇతర కమ్యూనిటీ అభివృద్ధి ప్రాజెక్టులకు భారతదేశం మద్దతు ఇస్తుందని శ్రీ మోదీ ప్రకటించారు.
“భారత సంతతికి చెందిన తమిళ (ఐఓటీ) నాయకులతో సమావేశం ఫలప్రదమైంది. ఈ సమాజం 200 సంవత్సరాలకు పైగా రెండు దేశాల మధ్య సజీవ వారధిగా ఉంది. శ్రీలంక ప్రభుత్వ సహకారంతో ఐఓటీల కోసం 10,000 ఇళ్లు, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు, పవిత్ర స్థలం సీతా ఎలియా ఆలయం, ఇతర కమ్యూనిటీ అభివృద్ధి ప్రాజెక్టులకు భారతదేశం మద్దతు ఇస్తుంది” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పోస్ట్ చేశారు.
“இந்தியாவை பூர்வீகமாக கொண்ட தமிழ் மக்களுடன் சுமூகமான சந்திப்பு இடம்பெற்றிருந்தது. இச்சமூகத்தினர் 200 ஆண்டுகளுக்கும் மேலாக இரு நாடுகளுக்குமான ஒரு வாழும் உறவுப் பாலமாக திகழ்கின்றனர். இலங்கை அரசாங்கத்துடனான ஒத்துழைப்புடன் இந்தியாவை பூர்வீகமாக கொண்ட தமிழ் மக்களுக்காக 10000 வீடுகள், சுகாதார வசதிகள், புனித சீதை அம்மன் ஆலயம் ஆகியவற்றின் நிர்மாணம் மற்றும் ஏனைய சமூக அபிவிருத்தி திட்டங்களுக்காக இந்தியா ஆதரவு வழங்கும்.”
***
MJPS/SR
(Release ID: 2119729)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam