ప్రధాన మంత్రి కార్యాలయం
కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ దేవేంద్ర ప్రధాన్ మృతికి ప్రధానమంత్రి సంతాపం
Posted On:
17 MAR 2025 3:15PM by PIB Hyderabad
కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ దేవేంద్ర ప్రధాన్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. పేదరికం నిర్మూలనతోపాటు సామాజిక సాధికారత కల్పనకు పార్లమెంట్ సభ్యునిగా, మంత్రిగా డాక్టర్ దేవేంద్ర ప్రధాన్ జీ అందించిన తోడ్పాటు గుర్తుంచుకోదగ్గదని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘డాక్టర్ దేవేంద్ర ప్రధాన్ గారు కష్టపడి పనిచేసే, నమ్రత కలిగిన నేతగా తనదైన ముద్ర వేశారు. ఒడిశాలో భాజపాను బలపరచడానికి ఆయన అనేక ప్రయత్నాలు చేశారు. పేదరికం నిర్మూలనతోపాటు సామాజిక సాధికారత కల్పనకు పార్లమెంట్ సభ్యునిగా, మంత్రిగా డాక్టర్ దేవేంద్ర ప్రధాన్ జీ అందించిన తోడ్పాటు గుర్తుంచుకోదగ్గది. ఆయన ఇక లేరని తెలిసి బాధపడ్డాను. ఆయనకు నివాళులు అర్పించడానికి వెళ్లాను, ఆయన కుటుంబ సభ్యులకు నా సంతాపాన్ని తెలియజేశాను. ఓం శాంతి.@dpradhanbjp”అని పేర్కొన్నారు.
"ଡକ୍ଟର ଦେବେନ୍ଦ୍ର ପ୍ରଧାନ ଜୀ ଜଣେ ପରିଶ୍ରମୀ ଏବଂ ନମ୍ର ନେତା ଭାବେ ନିଜର ସ୍ୱତନ୍ତ୍ର ପରିଚୟ ସୃଷ୍ଟି କରିଥିଲେ। ଓଡ଼ିଶାରେ ବିଜେପିକୁ ମଜବୁତ କରିବା ପାଇଁ ସେ ଅନେକ ପ୍ରୟାସ କରିଥିଲେ। ଦାରିଦ୍ର୍ୟ ଦୂରୀକରଣ ଏବଂ ସାମାଜିକ ସଶକ୍ତିକରଣ ଉପରେ ଗୁରୁତ୍ୱ ଦେଇ ଜଣେ ସାଂସଦ ଏବଂ ମନ୍ତ୍ରୀ ଭାବେ ତାଙ୍କର ଅବଦାନ ମଧ୍ୟ ଉଲ୍ଲେଖନୀୟ। ତାଙ୍କ ବିୟୋଗରେ ମୁଁ ଶୋକାଭିଭୂତ। ମୁଁ ତାଙ୍କର ଶେଷ ଦର୍ଶନ କରିବା ସହିତ ତାଙ୍କ ପରିବାର ପ୍ରତି ସମବେଦନା ଜଣାଇଲି। ଓଁ ଶାନ୍ତି।"
***
MJPS/ST
(Release ID: 2111846)
Visitor Counter : 18
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam