సాంస్కృతిక మంత్రిత్వ శాఖ
అభిలేఖ్ పటల్ నుంచి ప్రతులను తీసుకునేందుకు వినియోగ రుసుములను తగ్గించిన నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా (ఎన్ఏఐ)
Posted On:
11 MAR 2025 2:51PM by PIB Hyderabad
135వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిలేఖ్ పటల్ (https://www.abhilekh-patal.in/jspui/) నుంచి ప్రాచీన పత్రాలను తీసుకునేందుకు చెల్లించాల్సిన రుసుముల్ని నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా (ఎన్ఏఐ) తగ్గించింది. రికార్డులను సులభంగా ఉపయోగించుకోవడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకుంది. డిజిటల్ చిత్రాలను (డిజిటలైజ్ చేయడంతో సహా) అందించేందుకు విధించిన ఛార్జీలు దిగువ విధంగా ఉన్నాయి:
భారతీయ పరిశోధకులు మొదటి 20 పేజీలను వెబ్ సైటు నుంచి ఉచితంగా తీసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు:
-
0-20 చిత్రాలు - ఉచితం.
-
20-50 చిత్రాలు - చిత్రానికి రూ. రెండు.
-
50-100 చిత్రాలు - చిత్రానికి రూ. మూడు.
-
100 కంటే ఎక్కువ – చిత్రానికి రూ. అయిదు.
విదేశీ పరిశోధకులు మొదటి 20 పేజీలను ఉచితంగా తీసుకోవచ్చు. పూర్తి వివరాలు:
-
0-20 పేజీలు - ఉచితం.
-
20-50 పేజీలు -పేజీకి రూ. అయిదు.
-
50- 100 పేజీలు - పేజీకి రూ.10.
-
100కు పైగా - పేజీకి రూ. 15.
మొత్తం ఎంపిక చేసుకున్న చిత్రాల సంఖ్యకి అనుగుణంగా మొత్తం పేజీలకు ఛార్జీ వసూలు చేస్తారు. ఏ నుంచి 0 సైజు వరకు భారీ, దీర్ఘ పరిమాణంలోని మ్యాపులు, డాక్యుమెంట్లకు సంబంధించి స్కాన్ చిత్రాల ధరలను ఒక చిత్రానికి (300డీపీఐ) రూ. 20 నుంచి రూ. 15కు తగ్గించారు. భారతీయ, విదేశీ పరిశోధకులు ఇద్దరికీ ఇవే ధరలు వర్తిస్తాయి. వీటిపై కనీస ధరలను తొలగించారు.
భారతీయ విద్యార్థులకు రెప్రోగ్రఫీ సేవా రుసుము (అంటే ప్రింటవుట్లు)ను పేజీకి రూ. 5 నుంచి రూ. 2కు తగ్గించగా, విదేశీయులకు రూ. 10 నుంచి రూ. 4కు తగ్గించారు. అదే విధంగా కలర్ పేజీలను ఫొటోకాపీ తీసుకొనేందుకుగాను భారతీయ విద్యార్థులకు పేజీకి రూ. 20 నుంచి రూ. 8కు, విదేశీయులకు పేజీకి రూ. 40 నుంచి రూ. 16కు తగ్గించారు.
మన చారిత్రక వారసత్వాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఎన్ఏఐ నిబద్ధతతో పనిచేస్తోంది. అలాగే భవిష్యత్తులో ఫారాలను నింపే ప్రక్రియను పూర్తిగా తొలగించనుంది. అన్ని రికార్డులను డిజిటలైజ్ చేసే లక్ష్యంతో ప్రతిష్ఠాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఫలితంగా ఇప్పటి వరకు అభిలేఖ్ పటల్ లో 8.81 కోట్ల పేజీలు పొందుపరిచారు. రానున్న రెండేళ్లలో అన్ని రికార్డులను డిజిటలైజ్ చేయాలని ఎన్ఏఐ లక్ష్యంగా నిర్దేశించుకుంది. తద్వారా ఎక్కడి నుంచైనా, ఏ సమయంలోనైనా ఈ పత్రాలను సులభంగా ఉపయోగించుకొనే వీలు కల్పించేందుకు ప్రయత్నిస్తోంది.
ప్రస్తుతం భారత ప్రభుత్వం ఉపయోగించని రికార్డులకు నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా సంరక్షకురాలిగా వ్యవహరిస్తుంది. వాటిని రికార్డుల తయారీదారులు, వినియోగదారులు ఉపయోగించుకొనేలా ట్రస్టులో ఉంచుతుంది. తన ఆధీనంలో ఉన్న రికార్డులను సులభంగా ఉపయోగించుకొనేందుకు వీలుగా ఎన్ఏఐ నిరంతరం శ్రమిస్తోంది. అంతర్జాతీయంగా అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులను దృష్టిలో ఉంచుకొని రికార్డులను ఉపయోగించుకొనేందుకు వీలుగా ప్రస్తుత విధానాన్ని సరళీకరించేందుకు సమీక్ష చేపట్టింది. ప్రస్తుతం కొనసాగుతున్న రికార్డుల డిజిటలైజేషన్.. అంతర్జాతీయంగా ఉన్న ప్రధాన భాండాగారాల ఆధీనంలోని పురాతన ప్రతులను ప్రజలు పొందే విధానాన్ని మార్చిందని గమనించారు. ఎన్ఏఐ నిర్వహిస్తోన్న ఆన్ లైన్ పోర్టల్ - అభిలేక్ పటల్ను మార్చి 11, 2015న లాంఛనంగా ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రాచీన రాత ప్రతులను వినియోగించేవారిలో ఇది బాగా ప్రాచుర్యం పొందింది. ఇప్పటి వరకు 200 దేశాలకు చెందిన 30 వేల మంది వినియోగదారులు ఈ పోర్టల్లో నమోదు చేసుకున్నారు. ఇప్పటి వరకు 2 లక్షల మంది సందర్శించారు.
***
(Release ID: 2110341)
Visitor Counter : 10