కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బీఎస్ఎన్ఎల్ స్వదేశీ 4జి సేవల ప్రారంభంతో దేశంలోని

మారుమూల ప్రాంతాలకు కూడా అందుబాటులోకి వచ్చిన హై-స్పీడ్ సేవలు

‘ఆత్మ నిర్భర్ భారత్’ కింద దేశవ్యాప్తంగా 50,000 ప్రాంతాలకు అనుసంధానత

Posted On: 30 OCT 2024 5:34PM by PIB Hyderabad

 దేశంలో డిజిటల్ అనుసంధానాన్ని మెరుగుపరచాలన్న లక్ష్యానికి అనుగుణంగా భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్దేశవ్యాప్తంగా 50,000కు పైగా ప్రాంతాలకు స్వదేశీ 4జి సేవలను విస్తరించిందిప్రభుత్వ ‘ఆత్మ నిర్భర్ పథకం’ ద్వారా ఈ ఘనత సాధ్యమయ్యిందిదేశీయ సాంకేతికత దేశ అనుసంధాన అవసరాలను తీర్చగలదని నిరూపించిన ఈ విజయంలో బీఎస్ఎన్ఎల్ కు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), తేజస్ నెట్వర్క్స్సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలీమాటిక్స్ (సీ-డాట్), ఐటీఐ వంటి ప్రముఖ సంస్థలు సహకారం అందించాయిసాంకేతికతపరంగాసంపూర్ణ దేశీయ రూపకల్పనఅభివృద్ధికార్యాచరణ వల్ల,  బీఎస్ఎన్ఎల్ 4జి సేవలు “పూర్ణ స్వదేశీ” ఆశయాన్ని ప్రతిబింబిస్తూభారత్ టెలికాం రంగంలో నూతన అధ్యాయానికి తెర తీశాయి.

అక్టోబర్ 29 నాటికిబీఎస్ఎన్ఎల్ సుమారు 50,000 ప్రాంతాల్లో సేవల్ని అందించాలని భావించగా, ఇప్పటికే 41,000 ప్రాంతాల్లో సేవలు ప్రారంభమయ్యాయివీటిల్లో, IX.2 దశ కింద 36,747 కేంద్రాలను నెలకొల్పగాడిజిటల్ భారత్ నిధి ఫండ్ (ఒకప్పటి యూఎస్ఓఎఫ్సహకారంతో 5,000 ప్రాంతాల్లో 4జి సాచ్యురేషన్ ప్రాజెక్టులను నెలకొల్పారుమొత్తం 1,00,000 4జి సైట్లు నెలకొల్పాలన్న బీఎస్ఎన్ఎల్ లక్ష్యానికిసేవల శీఘ్రతర ప్రారంభం బలాన్నిస్తోందివేగంగా విస్తరిస్తున్న బీఎస్ఎన్ఎల్ సేవా వ్యవస్థకు తాజా పరిణామాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి.

బీఎస్ఎన్ఎల్ సంస్థ ఈ ఏడాది జూలై నాటికి 15,000 ప్రాంతాలకు తన సేవలను విస్తరించిందిగత మూడు మాసాల్లోమరో 25,000 ప్రాంతాలకు 4జి సేవల్ని విస్తరించిందియావత్తు దేశాన్నీ అనుసంధించాలన్న బీఎస్ఎన్ఎల్ నిబద్ధతకూస్వదేశీ సాంకేతికత ప్రభావానికీ ఈ విస్తరణ తార్కాణంగా నిలుస్తోంది.


(Release ID: 2069805) Visitor Counter : 77
Read this release in: English , Urdu , Hindi , Tamil