ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భారతరత్న నానాజీ దేశ్ ముఖ్ జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి నివాళి

प्रविष्टि तिथि: 11 OCT 2024 8:47AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు భారత రత్న నానాజీ దేశ్ ముఖ్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళి అర్పించారు. దేశంలోని గ్రామీణ ప్రజల సాధికారత విషయంలో ఆయన అంకితభావం, సేవలను మోదీ స్మరించుకొని ప్రశంసించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పోస్ట్ చేశారు:

“భారతరత్న నానాజీ దేశ్ ముఖ్ జయంతి సందర్భంగా దేశ ప్రజల తరఫున ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. గ్రామీణ ప్రజల సాధికారత కోసం, ముఖ్యంగా దేశంలోని అణగారిన వర్గాల సాధికారత కోసం ఆయన చూపిన అంకితభావం, సేవా స్ఫూర్తి ఎప్పటికీ గుర్తుండిపోతాయి.”

 

 

***

MJPS/SR


(रिलीज़ आईडी: 2064091) आगंतुक पटल : 86
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Tamil , Kannada , Malayalam