ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav g20-india-2023

జాతీయ ఎల‌క్ట్రానిక్స్‌, స‌మాచార సాంకేతిక‌ సంస్థ ఆధ్వ‌ర్యంలో ‘యువ రోజ‌గార్ మేళా’


వేయికి పైగా ఉద్యోగాలకు అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేసుకున్న 16 కంపెనీలు

Posted On: 29 SEP 2024 7:03PM by PIB Hyderabad

ఎల‌క్ట్రానిక్స్స‌మాచార సాంకేతికరంగ‌ జాతీయ సంస్థ ఎన్ఐఈఎల్ఐటీఆధ్వ‌ర్యంలో ఢిల్లీలో జాబ్ మేళాను నిర్వ‌హించారుఈ సంస్థ‌ కేంద్ర ఎల‌క్ట్రానిక్స్‌స‌మాచార సాంకేతిక‌ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన స్వ‌తంత్ర శాస్త్ర విజ్ఞాన సంస్థయువ రోజ్ గార్ మేళా పేరుతో ఈ కార్య‌క్ర‌మాన్ని సెప్టెంబ‌ర్ 29న‌ నిర్వ‌హించారుఎన్ఐఈఎల్ఐటీకి చెందిన పూర్వ విద్యార్థులుప్ర‌స్తుత విద్యార్థుల‌కు ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించ‌డం కోసం ఆ సంస్థ డిల్లీ కార్యాల‌యంలో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. 16 కంపెనీలు వేయికి పైగా ఉద్యోగాల‌ కోసం అభ్యర్థుల‌ను ప్రాధ‌మికంగా ఎంపిక చేసుకున్నాయిఈ జాబ్ మేళాలో 1300 మందికిపైగా అభ్య‌ర్థులు పేర్ల‌ను న‌మోదు చేసుకున్నారు

 

 

నైపుణ్య అంత‌రాల తొల‌గింపు

ఎన్ఐఈఎల్‌ఐటీ డైరెక్టర్ జనరల్ఎన్ఐఈఎల్‌ఐటీ డీమ్డ్ టుబి యూనివ‌ర్సిటీ గౌరవ వైస్ ఛాన్సలర్  డాక్టర్ మదన్ మోహన్ త్రిపాఠి ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా హాజర‌య్యారుఆయ‌న‌కు ఢిల్లీ ఎన్ఐఈఎల్‌ఐటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ శ్రీ సుభాన్షు తివారీ స్వాగ‌తం ప‌లికారు.  శ్రీ త్రిపాఠి జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి కార్య‌క్ర‌మాన్ని ప్రారంభించారుఅనంత‌రం ఆహుతుల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు

 

 

ప్రతి సంవత్సరం దేశ‌మంత‌టా ఎన్ఐఈఎల్‌ఐటీ నిర్వహించే జాబ్ మేళాల ప్రాముఖ్యతను డాక్ట‌ర్ త్రిపాఠి త‌న ప్రారంభ ఉప‌న్యాసంలో ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు.  గత ఏడాది ఎన్ఐఈఎల్‌ఐటీ భారతదేశ వ్యాప్తంగా నిర్వహించిన జాబ్ మేళాల్లో కనీసం 6000 ఆఫర్ లెటర్లను అభ్య‌ర్థుల‌కు ఇచ్చినట్లు తెలిపారుఈ ఏడాది ఆ సంఖ్యను పెంచబోతున్నట్లు చెప్పారుజాబ్ మేళాలునైపుణ్యం కలిగిన విద్యార్థులు ఉద్యోగాల‌ను పొందేందుకుసంస్థల వృద్ధికీ దోహదపడతాయనిఆర్థిక పురోగతిని బలోపేతం చేస్తాయ‌ని అన్నారుఢిల్లీలో ఈ కార్య‌క్ర‌మాల‌ను విజయవంతంగా నిర్వహిస్తున్నందుకు ఎన్ఐఈఎల్‌ఐటీ ఢిల్లీ బృందం చేస్తున్న కృషిని ఆయన అభినందించారుజాబ్ మేళాలో పాల్గొన్న కంపెనీలను కూడా ఆయన అభినందించారు.

 

ఈ సంద‌ర్భంగా జాబ్ మేళాలో పాల్గొన్న‌ వారికి సాప్ట్ స్కిల్స్సీవీ త‌యారీ అనే అంశంపై సమాచారపూర్వ‌క సాంకేతిక స‌మావేశాన్ని నిర్వ‌హించారుదీన్ని కేంద ఎల‌క్ట్రానిక్స్‌స‌మాచార సాంకేతిక‌ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన డిజిట‌ల్ ఇండియా కార్పొరేష‌న్ అసిస్టెంట్ మేనేజ‌ర్ శ్రీ మొహ‌మ్మ‌ద్ జునెయిద్ నిర్వ‌హించారు

 

ఈ సందర్భంగా టెక్ మహీంద్రాపేటీఎంఫ్రాంక్‌ఫిన్ (షావ్సీ గ్లోబల్ సర్వీసెస్), యాక్సిస్ బ్యాంక్హిందూజా హౌసింగ్ ఫైనాన్స్యాక్సెస్ హెల్త్ కేర్కార్డ్ ఎక్స్‌పర్టైజ్ ఇండియాఎబిక్స్ క్యాష్ఐ ప్రాసెస్,  పిఎన్ బి మెట్‌లైఫ్సిద్ధి ఇన్ఫోనెట్+సోనీది ఖుష్బూ కన్సల్టింగ్ పార్ట్‌నర్స్ (ప్రొఫెషనల్ రిక్రూట్‌మెంట్ అండ్ కన్సల్టెంట్), వీ కాస్మోస్కైడోకోశ్రీజీ ఎంటర్‌టైన్‌మెంట్రిట్రాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ సైన్సెస్ వంటి కంపెనీల కోసం ప్లేస్‌మెంట్ డెస్క్‌లను ఏర్పాటు చేశారు

ఎల‌క్ట్రానిక్స్స‌మాచార సాంకేతికరంగ జాతీయ సంస్థ (ఎన్ఐఈఎల్ఐటీ

గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా స‌మాచార‌ఎల‌క్ట్రానిక్స్‌క‌మ్యూనికేష‌న్ టెక్నాల‌జీ (ఐఈసీటీరంగంలోనుఅభివృద్ధి చెందుతున్న సాంకేతిక‌త‌ల విష‌యంలోనూ ఎన్ఐఈఎల్ఐటీ ఒక ప్ర‌ధాన సంస్థ‌గా గుర్తింపు పొందిందిఈ సంస్థ‌కు దేశవ్యాప్తంగా సంబంధాలు ఉన్నాయిఇందులో 52 కు పైగా సొంతవిస్త‌ర‌ణ కేంద్రాలున్నాయివీటితోపాటు మ‌రెన్నో ఔత్సాహిక కేంద్రాలు, 8 వేల‌కు పైగా శిక్ష‌ణ కేంద్రాలు ఉన్నాయి.

 

ఐజ్వాల్అగర్తలఔరంగాబాద్కాలికట్గోరఖ్‌పూర్ఇంఫాల్ఇటానగర్కేక్రీకోహిమాపాట్నాశ్రీనగర్‌లలో ఉన్న 11 భాగస్వామ్య విభాగాలతో క‌లిపి పంజాబ్ లోని రోప‌ర్ ఎన్ఐఈఎల్ఐటీకి  ప్రత్యేకమైన కేటగిరీ కింద డీమ్డ్ టు బి యూనివర్సిటీ హోదా మంజూరు చేశారు

జాబ్ ఫెయిర్యువ రోజ్‌గార్ మేళా

ఎన్ఐఈఎల్ఐటీ నిర్వ‌హిస్తున్న జాబ్ ఫెయిర్ - ”యువ రోజ్‌గర్ మేళా” అనేది  ఆ సంస్థ  విద్యార్థులకు స‌మ‌గ్ర‌మైన స‌హాయాన్ని అందించ‌డంలో సంస్థకున్న‌ అచంచ‌ల‌మైన నిబ‌ద్ధ‌త‌ను సూచిస్తోందివిద్యార్థుల్లో సామ‌ర్థ్య పెంపుద‌ల‌కునైపుణ్యాభివృద్ధికిఉద్యోగాల సాధ‌న‌కు దోహదం చేస్తోంది

రాబోయే సంవత్సరాల్లో ఇటువంటి మరిన్ని ఉద్యోగ మేళాలను నిర్వహించడానికి క‌ట్టుబ‌డి ఉన్నట్లు ఎన్ఐఈఎల్‌ఐటీ ప్ర‌క‌టించింది

 

***



(Release ID: 2060189) Visitor Counter : 21