రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav g20-india-2023

జీవావరణ సంరక్షణ- సముద్ర కాలుష్య నివారణ కోసం పర్యావరణ సంస్థలతో ఇండియన్ కోస్ట్ గార్డ్ అవగాహన ఒప్పందం

Posted On: 19 SEP 2024 8:42PM by PIB Hyderabad

భారత తీర రక్షదళం (ఇండియన్ కోస్ట్ గార్డ్)- ది హాబిటాట్స్ ట్రస్టుహెచ్‌సీఎల్ ఫౌండేషన్లతో సెప్టెంబరు 19 న న్యూఢిల్లీలోని నావికాదళ ప్రధాన కార్యాలయంలో అవగాహన ఒప్పందం (ఎంఓయుకుదుర్చుకుందిసముద్ర జీవావరణ సంరక్షణ కార్యక్రమాలను ముమ్మరం చేసే దిశగా ఈ అవగాహన ఒప్పందం జరిగింది.

అవగాహన ఒప్పందంలోని కీలక అంశాలు:

వదిలేసిన వలల తొలగింపు: సముద్రంలో వదిలేసిన వలల సమస్యను తక్షణం పరిష్కరించాలి. వీటి వల్ల సముద్ర జీవావరణకు హాని ఎక్కువగా జరుగుతుంది.

చెత్త పేరుకునే ప్రాంతాల గుర్తింపువర్గీకరణ: సముద్ర జలాల్లోని పారేసిన వస్తువుల వల్ల ఎక్కువ ప్రభావితమైన ప్రాంతాలలో ప్రక్షాళన చెయ్యాలి. దీనిని సమర్థవంతంగా నిర్వహించేందుకు సంరక్షణ పరిజ్ఞానాన్ని పెంపొందించడం.

ముఖ్యమైన జీవావరణ ప్రాంతాల్లో సర్వే: ఈ ప్రాంతాల్లో జీవ వైవిధ్యాన్ని పర్యవేక్షించడంసంరక్షించడంకీలకమైన సముద్ర జీవుల ఆవాసాలను గుర్తించడం.

స్థానిక భాగస్వామ్యంసముద్ర జీవావరణ వ్యవస్థల నిర్వహణను ప్రోత్సహించడానికి తీరప్రాంత ప్రజలను సంరక్షణ కార్యకలాపాల్లో భాగస్వాములుగా చేయడం.

 

ఈ అవగాహన ఒప్పందంపైడిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఆపరేషన్స్కోస్టల్ సెక్యూరిటీ), ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీకూడా అయిన శ్రీ అనుపమ్ రాయ్హెచ్‌సీఎల్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ నిధి పుంధీర్హాబిటాట్స్ ట్రస్ట్ అధిపతి రుషికేశ్ చవాన్

సంతకాలు చేశారుఈ నిర్ణయ ప్రాముఖ్యతపై శ్రీ అనుపమ్ రాయ్ మాట్లాడుతూ, 'జీవవైవిధ్యంతీరప్రాంత ప్రజల జీవనోపాధి రెండింటికీ కీలకమైన తీరప్రాంత పర్యావరణ వ్యవస్థలను సంరక్షించే దిశగా ఈ భాగస్వామ్యం కీలకమైన ముందడుగుఅని పేర్కొన్నారు.



(Release ID: 2056964) Visitor Counter : 40


Read this release in: English , Urdu , Hindi