ఉక్కు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆర్ఐఎన్ఎల్ లో రెండు రోజుల పాటు సాగే హిందీ జాతీయ చర్చాగోష్టి ప్రారంభం

Posted On: 20 AUG 2024 2:56PM by PIB Hyderabad

‘‘హిందీ పార్లమెంటరీ కమిటీ అత్యంత తాజా ప్రశ్నావళి, మూడు నెలల పురోగతి నివేదిక’’ విషయంపై రెండు రోజుల పాటు సాగే జాతీయ స్థాయి హిందీ చర్చాగోష్టి ఆర్ఐఎన్ఎల్ లో ప్రారంభమైంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంటుకు కార్పొరేట్ రూపం- ఆర్ఐఎన్ఎల్. హెచ్ పిసిఎల్ కూడా ఈ చర్చాగోష్టి నిర్వహణలో పాలుపంచుకొంటోంది. విశాఖపట్నం లోని నగర్ రాజభాషా కార్యాన్వయన్ సమితి (అండర్ టేకింగ్- టిఒఎల్ఐసి) ఈ కార్యక్రమాన్ని  నిర్వహిస్తున్నది.

ఈ రెండు రోజుల హిందీ జాతీయ స్థాయి చర్చాగోష్టిని ఆర్ఐఎన్ఎల్ డైరెక్టర్ (పర్సనెల్) డాక్టర్ సురేశ్ చంద్ర పాండే ఈ రోజు విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలోని సెంటర్ ఫర్ హెచ్ఆర్ డీ -నాగార్జున లో ప్రారంభించారు.

ప్రారంభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన  ఆర్ఐఎన్ఎల్ డైరెక్టర్ (సిబ్బంది వ్యవహారాలు) డాక్టర్ సురేశ్ చంద్ర పాండే మాట్లాడుతూ, హిందీ భాషను ప్రభావవంతంగా అమలుపరచడాన్ని సమర్ధించడానికి ఆర్ఐఎన్ఎల్ ఎప్పుడూ ముందువరుసలో నిలబడుతుందన్నారు. స్థానికంగా టిఒఎల్ఐసి సభ్యత్వ కార్యాలయాల అండతో అనేక కార్యక్రమాలను నిర్వహించిందని ఆయన అన్నారు.

 

 

ఆర్ఐఎన్ఎల్, టిఒఎల్ఐసిలు నిర్వహిస్తున్నటువంటి ఉపయోగకరమైన కార్యక్రమాల గురించి డాక్టర్ సురేశ్ చంద్ర పాండే మరిన్ని వివరాలు తెలియజేస్తూ,  ఆర్ఐఎన్ఎల్ యాజమాన్యం వైపు నుంచి పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సెమినార్ కు ఆర్ఐఎన్ఎల్, హెచ్ పిసిఎల్ ల  సహకరించాయి.  

కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హెచ్ పిసిఎల్ జిఎమ్ (ప్రాజెక్టులు) శ్రీ ధర్మ్ వీర్ హాజరయ్యారు. ఈ తరహాలో ఉపయోగపడే కార్యక్రమాలను ఏర్పాటు చేయడంలో ఆర్ఐఎన్ఎల్ చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు.  ఈ విధమైన కార్యక్రమాలను నిర్వహించడానికి హెచ్ పిసిఎల్ ఎల్లవేళల మద్దతిస్తుందని కూడా ఆయన అన్నారు.

 ఈ చర్చాగోష్ఠిలో టిఒఎల్ఐసి సభ్యత్వ కార్యాలయాలకు చెందిన ప్రతినిధులతో పాటు ఉక్కు మంత్రిత్వ శాఖ (ఎమ్ఒఎస్) అధీనంలోని ఎస్ఎఐఎల్, ఎమ్ఒఐఎల్, కెఐఒసిఎల్, ఎమ్ఎస్ టిసిల వంటి వివిధ సంస్థలకు చెందిన, ఇతర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, ‘ఫిషరీస్ సర్వే ఆఫ్ ఇండియా’కు చెందిన హిందీ అధికారులు పాల్గొంటున్నారు.

ప్రతినిధులకు ఆర్ఐఎన్ఎల్ జిఎమ్ (రాజ్ భాష, ఆతిథ్యం) డాక్టర్ లలన్ కుమార్ స్నేహపూర్వక స్వాగత వచనాలు పలికారు. ఆర్ఐఎన్ఎల్ ఎజిఎమ్ (రాజ్ భాష) డాక్టర్ టి. హైమవతి కార్యక్రమ సమన్వయ బాధ్యతను నిర్వర్తించారు. హెచ్ పిసిఎల్ హిందీ నోడల్ ఆఫీసరు శ్రీ జె.వి.వి.ఆర్. సురేశ్ వందన సమర్పణ చేశారు.  

***


(Release ID: 2047108)