మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పశువులు, గొర్రెలు, మేకల రైతులు, పశు సంవర్ధక శాఖ మధ్య కీలకమైన అనుసంధానతను ఏ హెచ్ ఈ ఎల్ పి ( ఎ-హెల్ప్) కార్యక్రమం ఏర్పరుస్తుంది: శ్రీ పురాన్ కేఆర్ గూరుంగ్


రైతులకు సరైన మద్దతు అందించడం ద్వారా పశురంగ అభివృద్ధి కి ఎ-హెల్ప్ కార్మికులు అంకితమయ్యారు : శ్రీమతి అల్క ఉపాధ్యాయ

Posted On: 31 JUL 2024 1:07PM by PIB Hyderabad

పశుసంవర్థక, పశు వైద్య సేవల శాఖ మంత్రి, శ్రీ పురాన్ కేఆర్ గూరుంగ్ గాంగ్టక్ లోని చింతన్ భవన్ ఎ-హెల్ప్  కార్యక్రమాన్ని నిన్న ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా గ్రామీణాభివృద్ధి శాఖ సలహాదారు శ్రీమతి కలా రాయ్ హాజరయ్యారు.

 

ఈ సందర్భంగా శ్రీ గూరుంగ్ ఎ-హెల్ప్  కార్యక్రమం గురించి మాట్లాడుతూ  పశువులు, గొర్రెలు, మేకల రైతులు, పశుసంవర్థక, డైరీ శాఖ (డీ ఏ హెచ్ డి) శాఖ మధ్య కీలకమైన అనుసంధానతను ఏ హెచ్ ఈ ఎల్ పి ( ఎ-హెల్ప్) కార్యక్రమం ఏర్పరుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం పశు ఆరోగ్యం, విస్తరణ సేవలు,  మహిళా సాధికారతలను ప్రోత్సహించడానికి ఒక ముఖ్యమైన ముందడుగు అని, ఇది పశుసంపద ఉత్పాదకతను పెంచడం తో గ్రామీణాభివృద్ధికి దోహదం చేస్తుందని తెలిపారు.

 

పశుసంవర్థక, డైరీ శాఖ (డీ ఏ హెచ్ డి)  కార్యదర్శి శ్రీమతి అల్కా ఉపాధ్యాయ వీడియో సందేశం  లో  ఏజెంట్స్ కార్మికులు రైతులకు సరైన మద్దతు అందించడం, అలాగే సేవల మధ్య అంతరాన్ని పూరించడం ద్వారా పశురంగ అభివృద్ధికి కొత్త పుంతలు తొక్కాలని ప్రోత్సహించారు.

 

డా. శర్మన్ రాయ్, పశుసంవర్థక, వెటర్నరీ సేవల కార్యదర్శి, సిక్కిం స్వాగత ప్రసంగంతో కార్యక్రమం ప్రారంభమైంది.  ఏజెంట్స్ ప్రాథమికంగా వ్యాధి నియంత్రణం, జంతువులను ట్యాగింగ్ చేయడం, పశు భీమా కార్యక్రమాలలో మద్దతు అందిస్తారని ఆయన తెలిపారు.

 

ఎ-హెల్ప్ అనేది భారత ప్రభుత్వశాఖ డీ ఏ హెచ్ డి ఆధ్వర్యంలోని నూతన ఎక్స్ టెన్షన్ కార్యక్రమం. ఇది  ఎన్ ఆర్ ఎల్ ఎం  స్వయం సహాయక బృందాల ప్లాట్‌ఫారమ్ సేవలను వినియోగించి పశుసంవర్థక కార్యకలాపాలను నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమం ఇప్పటికే బీహార్, గుజరాత్, జమ్మూ, కాశ్మీర్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, మిజోరం, మహారాష్ట్ర, రాజస్థాన్, కేరళ  అస్సాంలో విజయవంతంగా అమలు చేయబడింది.

 

ఈ కార్యక్రమంలో ఎ-హెల్ప్ ప్రత్యేక  కిట్లను పశు సఖులకు పంపిణీ చేశారు. వీరికి శిక్షణ ఇచ్చిన తర్వాత వారు ఎ-హెల్ప్ గా  గుర్తింపు పొందుతారు.  ఆదర్శ రైతులు, పశు సఖులతో సహా 500 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

***


(Release ID: 2039678)