మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
జాతీయ విద్యా విధానం 2020 నాలుగవ వార్షికోత్సవాన్ని అఖిల భారతీయ శిక్షా సమాగం 2024తో కలిపి నిర్వహించిన విద్యా మంత్రిత్వ శాఖ
అభ్యాస విధానంలో రూపురేఖల మార్పునకు ఒక ఆశా దీపం గా నిలవడం, అలాగే జనాభాలో కీలక భాగానికి ఉపయోగపడేలా, జనాభాను సాధికార పరచడానికి, సామాజిక-ఆర్థిక అభివృద్ధిని చక్కటి మార్గంగా నిలిచిన ఎన్ఈపి 2020 - శ్రీ ధర్మేంద్ర ప్రధాన్
రైతులు, శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు దేశ భవిష్యత్తును కల్పన చేసే సమాజానికి మూడు స్తంభాలు - శ్రీ జయంత్ చౌదరి
ఎన్ఈపి 2020లో భారతదేశ గొప్ప వారసత్వం, ఆధునిక పురోగతులతో సాంప్రదాయ జ్ఞానం సంశ్లేషణ, వాల్యూ ఎడ్యుకేషన్ ని దాని ప్రధాన అంశంగా దేశ-నిర్మాణంతో ఏకీకృతం చేయడం - డా. సుకాంత మజుందార్
Posted On:
29 JUL 2024 3:19PM by PIB Hyderabad
విద్యా మంత్రిత్వ శాఖ ఈరోజు న్యూఢిల్లీలోని మానేక్షా సెంటర్ ఆడిటోరియంలో అఖిల భారతీయ శిక్షా సమాగం 2024తో జాతీయ విద్యా విధానం 2020 అమలు 4వ వార్షికోత్సవాన్ని జరుపుకుంది. ఈ కార్యక్రమంలో విద్య, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత శాఖ సహాయ మంత్రి శ్రీ జయంత్ చౌదరి, ఈశాన్య ప్రాంత విద్య, అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ సుకాంత మజుందార్ పాల్గొన్నారు. ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి శ్రీ కె. సంజయ్ మూర్తి; పాఠశాల విద్య, అక్షరాస్యత శాఖ కార్యదర్శి శ్రీ సంజయ్ కుమార్; విద్యావేత్తలు, యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యా మంత్రిత్వ శాఖకి సంబంధించిన అనేక ముఖ్యమైన ఎన్ఈపి 2020 కార్యక్రమాలను మంత్రులు ప్రారంభించారు. వివిధ భారతీయ భాషలను నేర్చుకోవడానికి ఇందుకు ప్రత్యేకించిన టీవీ ఛానెల్లు, ఒక తమిళ ఛానెల్; 54కు అనుగుణంగా 25 భారతీయ భాషల్లో ప్రారంభ తరగతుల విద్యార్థులకు ప్రైమర్లు ఇప్పటికే పూర్తయ్యాయి; 10 బ్యాగ్లెస్ డేస్ గైడ్లైన్స్ పాఠశాలల్లో అభ్యాసాన్ని ఆహ్లాదకరమైన, ఒత్తిడి లేని అనుభవంగా మార్చే లక్ష్యంతో ఉన్నాయి; కెరీర్ గైడెన్స్ గైడ్లైన్స్, 500కి పైగా జాబ్ కార్డ్లతో కూడిన భారీ లైబ్రరీ; ఎన్ఎంఎం (నేషనల్ మిషన్ ఫర్ మెంటరింగ్), బ్రెయిలీ, ఆడియో పుస్తకాలలో ఉపాధ్యాయుల కోసం జాతీయ వృత్తి ప్రమాణాలు (ఎన్పిఎస్టీ); ఏఐసిటిఐ, నీతి ఆయోగ్, ఏఇఎం ద్వారా స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్; గ్రాడ్యుయేషన్ గుణాలు, వృత్తిపరమైన సామర్థ్యాలపై ఒక పుస్తకం. విద్యార్థులు, ఉపాధ్యాయులలో భారతీయ జ్ఞాన వ్యవస్థ (ఐకేఎస్)ని ప్రోత్సహించే లక్ష్యంతో నాలుగు పుస్తకాలు, ఉపన్యాస సూచనలను కూడా ఆవిష్కరించారు.
ఎన్ఈపి 2020నాలుగు సంవత్సరాల ప్రయాణం కొత్త తరం అభ్యాసకులను పెంపొందించడం కోసం దేశ విద్యా వ్యవస్థలో పరివర్తనాత్మక మార్పును తీసుకురావడం గురించి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, తన సందేశంలో తెలిపారు. ఎన్ఈపి 2020 అనేది అభ్యాస తీరు తెన్నులు మార్చడానికి, దేశంలో అధిక జనాభా ఉపయోగించుకోవడానికి, జనాభాను సాధికారపరచడానికి, సామాజిక-ఆర్థిక అభివృద్ధిని నడపడానికి చిహ్నంగా నిలుస్తుందని కూడా ఆయన పేర్కొన్నారు. ఎన్ఈపి అమలు వల్ల నేర్చుకోవడం అనేది మరింత శక్తివంతమైందని, దేశ విద్యను ప్రపంచ, ఫలితాల ఆధారితంగా మార్చడంలో మార్గనిర్దేశం చేసిందని ఆయన అన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి తన కృతజ్ఞతలు తెలియజేస్తూ, దేశాన్ని 21వ శతాబ్దపు విజ్ఞాన ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు అక్షరం, స్ఫూర్తితో ఎన్ఈపి ని అమలు చేయడానికి తన నిబద్ధతను పునరుద్ఘాటించారు.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికత స్ఫూర్తితో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్రీయ విద్యాలయ సంఘటన్ విద్యార్థులు 'పంచ ప్రాణ్' సంగీత ప్రదర్శనను ఆయన అభినందించారు.
శ్రీ జయంత్ చౌదరి మాట్లాడుతూ ఉపాధ్యాయుల అపారమైన ప్రభావాన్ని, వారి విద్యార్థుల జీవితాలను రూపుదిద్దడంలో కృషిని వివరించారు. దేశ భవిష్యత్ ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని ఆయన అన్నారు. రైతులు, శాస్త్రవేత్తలు, ఉపాధ్యాయులు దేశ భవిష్యత్తును తలపించే సమాజానికి మూడు స్తంభాలని ఆయన అన్నారు. విద్యా పర్యావరణ వ్యవస్థ వాటాదారుల సిఫార్సులను అనుసరించి, ఎన్ఈపి 2020లో ఫార్వర్డ్-లుకింగ్ విధానాన్ని ఎలా రూపొందించారో కూడా శ్రీ చౌదరి ప్రస్తావించారు. పాత వ్యవస్థ వారసత్వం నుండి వైదొలిగి, ఇది విద్యా రంగాన్ని విప్లవాత్మకంగా మార్చిందని తెలిపారు. దానిని 21వ శతాబ్దపు అవసరాలకు అనుగుణంగా మార్చింది అని అన్నారు.
****
(Release ID: 2039543)