చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

స్వచ్ఛంద న్యాయ సేవకులకు శిక్షణకు తగిన అంశాలన్నిటితో విస్తృత ‘‘పారాలీగల్ వాలంటీర్స్ ట్రెయినింగ్ మాడ్యూల్’’ సిద్ధం చేసిన ‘నల్సా’

Posted On: 26 JUL 2024 1:24PM by PIB Hyderabad

   దేశవ్యాప్తంగా స్వచ్ఛంద న్యాయ సేవకుల పథకాన్ని (పారాలీగల్ వాలంటీర్స్ స్కీమ్- పిఎల్‌వి) జాతీయ న్యాయసేవా ప్రాధికార సంస్థ (నల్సా) 2009లో ప్రవేశపెట్టింది. వివిధ రంగాల నుంచి ఎంపిక చేసిన స్వచ్ఛంద సేవకులకు న్యాయశాస్త్ర శిక్షణ ఇవ్వడం ఈ పథకం ధ్యేయం. సమాజంలోని అన్ని వర్గాలకూ న్యాయ సౌలభ్యం లక్ష్యంగా వీరు సేవలందిస్తారు. ప్రభుత్వం 2017లో ఈ పథకాన్ని సవరించి, ‘స్కీమ్ ఫర్ పారాలీగల్ వాలంటీర్స్ (రివైజ్డ్)’గా పేరు మార్చింది. దీనికింద శిక్షణ పొందిన ‘పిఎల్‌వి’లు న్యాయసేవా సంస్థలకు-సామాన్య పౌరులకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ న్యాయ సౌలభ్యంలో అంతరం తగ్గించడానికి తోడ్పడగలరన్నది ప్రభుత్వ యోచన.

   ఈ నేపథ్యంలో ప్రత్యేకించి... నైపుణ్యం, ప్రాతినిధ్యాల పరంగా ‘పిఎల్‌వి’ల సామర్థ్యం పెంచాలని ‘నల్సా’ నిర్ణయించింది. తదనుగుణంగా శిక్షణార్థం అవసరమైన అంశాలన్నిటితో విస్తృత ‘‘పారాలీగల్ వాలంటీర్ల శిక్షణ మాడ్యూల్’’ను రూపొందించింది. రాజ్యాంగ దృక్కోణంలో న్యాయం, నేర విచారణ చట్టాల్లోని ప్రాథమికాంశాలు, కార్మిక చట్టాలు, బాలల చట్టం, మహిళలు-వృద్ధుల రక్షణ చట్టాలపై ‘పిఎల్‌వి’లకు బోధన, అవగాహన కల్పించడానికి ఈ మాడ్యూల్ ఉపయోగపడుతుంది. సమాజంలోని భిన్నవర్గాల ప్రజానీకంతో వ్యవహరించడానికి అవసరమైన ప్రక్రియా పరిజ్ఞానం, సామాజిక చైతన్యం, ప్రవర్తనాపరమైన మృదు నైపుణ్యం, వ్యవహార నైపుణ్య తదితరాల కల్పనపై శిక్షణలో దృష్టి సారిస్తారు.

   జిల్లా న్యాయసేవా ప్రాధికార సంస్థ (డిఎస్ఎస్ఎ) చైర్మన్ పర్యవేక్షణ కింద ఒక్కొక్క బృందంలో 50 మంది వంతున ‘పిఎల్‌వి’లకు ఒకే ప్రదేశంలో శిక్షణ ఇస్తారు. అటుపైన పునశ్చరణ, సేవల్లో ప్రవేశం సహా కాలానుగుణ నైపుణ్యాభివృద్ధి కోసం నిర్దిష్ట వ్యవధుల్లో పునరధ్యయన (రిఫ్రెషర్) శిక్షణ కూడా ఉంటుంది. అనంతరం ‘పిఎల్‌వి’ల పనితీరును ‘డిఎస్ఎస్ఎ’లు కాలానుగుణంగా అంచనా వేస్తూ, లోటుపాట్లను ఎరుకపరచి, క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి చేయూతనిస్తాయి. అలాగే సందేహ నివృత్తి చేయడంతోపాటు మాడ్యూల్ ప్రకారం వారి నైపుణ్యాల మెరుగుకు, పరిజ్ఞాన సముపార్జనకు వీలు కల్పిస్తాయి. విశిష్ట ప్రతిభ ప్రదర్శించిన, లబ్ధిదారులకు అత్యుత్తమ సేవలందించిన ‘పిఎల్‌వి’లకు తగిన గుర్తింపు, పురస్కారం కూడా లభిస్తాయి.

   న్యాయసేవా ప్రాధికార సంస్థలు 2023-24... 2024-25 ఆర్థిక సంవత్సరాల్లో (2024 మే వరకు) రాజస్థాన్ సహా దేశవ్యాప్తంగా నిర్వహించిన పారాలీగల్ వాలంటీర్ల శిక్షణ కార్యక్రమాల వివరాలను అనుబంధం-‘ఎ’లో చూడవచ్చు.

అనుబంధం-ఎ

న్యాయసేవా ప్రాధికార సంస్థలు 2023-24... 2024-25 సంవత్సరాల్లో (2024 మే వరకు) ‘పిఎల్‌వి’ల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన పారాలీగల్ వాలంటీర్ల శిక్షణ కార్యక్రమాల నివేదిక

వ.సం.

  న్యాయసేవా ప్రాధికార సంస్థ పేరు

 ‘పిఎల్‌వి’ శిక్షణ కార్యక్రమాల సంఖ్య

2023-24

2024-25 (2024 మే వరకు)

1

అండమాన్-నికోబార్ దీవులు

0

0

2

ఆంధ్రప్రదేశ్

37

0

3

అరుణాచల్ ప్రదేశ్

7

0

4

అస్సాం

38

3

5

బీహార్

95

6

6

చండీగఢ్

7

1

7

ఛత్తీస్‌గఢ్

253

38

8

దాద్రా, నాగర్ హవేలీ

0

0

9

దమన్-డియ్యూ

0

0

10

ఢిల్లీ

39

6

11

గోవా

2

1

12

గుజరాత్

22

9

13

హర్యానా

268

45

14

హిమాచల్ ప్రదేశ్

74

16

15

జమ్ముకశ్మీర్

19

0

16

జార్ఖండ్

182

33

17

కర్ణాటక

58

3

18

కేరళ

9

3

19

లద్దాఖ్

2

0

20

లక్షద్వీప్

0

0

21

మధ్యప్రదేశ్

145

0

22

మహారాష్ట్ర

126

38

23

మణిపూర్

18

1

24

మేఘాలయ

4

6

25

మిజోరం

9

0

26

నాగాలాండ్

1

0

27

ఒడిషా

53

23

28

పుదుచ్చేరి

3

1

29

పంజాబ్

226

37

30

రాజస్థాన్

47

14

31

సిక్కిం

18

2

32

తమిళనాడు

63

14

33

తెలంగాణ

19

3

34

త్రిపుర

10

1

35

ఉత్తర ప్రదేశ్

8

6

36

ఉత్తరాఖండ్

42

3

37

పశ్చిమ బెంగాల్

79

19

మొత్తం

1983

332

 

కేంద్ర చట్ట-న్యాయ వ్యవహారాల శాఖ (స్వతంత్ర బాధ్యతగల), సభా వ్యవహారాల శాఖల సహాయమంత్రి శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్‌స‌భ‌లో ఇవాళ ఒక ప్రశ్న‌కు లిఖిత‌పూర్వ‌కంగా ఇచ్చిన స‌మాధానంలో ఈ సమాచారం వెల్లడించారు.

*****


(Release ID: 2038104)