విద్యుత్తు మంత్రిత్వ శాఖ

జమ్మూ కాశ్మీర్ కిష్ట్వార్ లో కిరు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కోసం నిర్ణీత కాలానికి రూ.1, 869 కోట్ల రుణమిచ్చిన ఆర్ఈసి లిమిటెడ్

Posted On: 24 APR 2024 5:19PM by PIB Hyderabad

ఆర్ఈసి లిమిటెడ్ ఒక మహారత్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఇది కేంద్ర విద్యుత్ శాఖ ఆధ్వర్యంలోని ప్రముఖ ఎన్ బి ఎఫ్ సి. ఆర్ఈసి-  చీనాబ్ వ్యాలీ పవర్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ (సీవీపిపిఎల్)తో ఒప్పందం కుదుర్చుకుంది, దీని కింద  సీవీపిపిఎల్ కి ఆర్ఈసి రూ. 1,869.265 కోట్ల ఆర్థిక సహాయాన్ని టర్మ్ లోన్‌గా అందిస్తుంది. జమ్మూ, కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో చీనాబ్ నదిపై గ్రీన్‌ఫీల్డ్ 4 x156 మెగావాట్ల కిరు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అభివృద్ధి, నిర్మాణం, నిర్వహణ కోసం రుణం వినియోగించనున్నారు. 

624 మెగావాట్ల కిరు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ రన్-ఆఫ్ రివర్ స్కీమ్, ఇది 135 మీటర్ల ఎత్తులో డ్యామ్, ఒక్కొక్కటి 156 మెగావాట్ల 4 యూనిట్లతో భూగర్భ పవర్ హౌస్‌ను నిర్మిస్తుంది. ఈ ఒప్పందం మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రమేష్ ముఖియా సమక్షంలో జనరల్ మేనేజర్ (సి అండ్ పి) శ్రీ వసంత్ హుర్మేడ్సీవీపిపిఎల్ జనరల్ మేనేజర్ (ఫైనాన్స్) శ్రీ సంజయ్ కుమార్ గుప్తా, డిప్యూటీ జనరల్ మేనేజర్, శ్రీ ప్రమోద్ కుమార్ సోనీ;  ఆర్ఈసి డిప్యూటీ జనరల్ మేనేజర్, శ్రీ రిషబ్ జైన్  సంతకం చేశారు. 

 

 

సీవీపిపిఎల్ గురించి:

సీవీపిపిఎల్ అనేది ఎన్హెచ్పిసి (51%), జేకెఎస్పిడిసి (49%) మధ్య జాయింట్ వెంచర్ కంపెనీ. ఇది కేంద్ర ప్రభుత్వం, జమ్మూ కాశ్మీర్  ప్రభుత్వం ఉమ్మడి చొరవ. ఇది చీనాబ్ నది విస్తారమైన జల సంభావ్యతను ఉపయోగించుకోవడానికి ఏర్పడింది. కంపెనీ 2011లో విలీనం చేయబడింది. కిరు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ (624 మెగావాట్లు), పాకల్ దుల్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ (1000 మెగావాట్లు), క్వార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ (540 మెగావాట్లు),  కీర్తియా-II జల విద్యుత్తు ప్రాజెక్టు (930 మెగావాట్ల) ప్రోజెక్టుల నిర్మాణం సీవీపిపిఎల్ కి అప్పగించారు. మొత్తం 3094 మెగావాట్ల స్థాపిత సామర్థ్యంతో  బిల్డ్, ఓన్, ఆపరేట్ మరియు మెయింటెయిన్ (బిఓఓఎం) ప్రాతిపదికన వీటిని చేపడుతున్నారు. 

ఆర్ఈసి లిమిటెడ్ గురించి... 

ఆర్ఈసి అనేది విద్యుత్ మంత్రిత్వ శాఖ పరిధిలోని 'మహారత్న' సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజ్, అలాగే ఆర్బీఐ లో నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ (ఎన్బిఎఫ్ సి), మరియు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్సింగ్ కంపెనీ (ఐఎఫ్సి)గా నమోదు అయింది.  ఉత్పత్తి, ప్రసారం, పంపిణీ, పునరుత్పాదక శక్తి, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీ నిల్వ, పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్‌లు, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టులు వంటి కొత్త సాంకేతికతలతో కూడిన మొత్తం పవర్-ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్‌కు ఆర్ఈసి ఆర్థిక సహాయం చేస్తుంది. ఇటీవల, ఆర్ఈసి రోడ్లు, ఎక్స్‌ప్రెస్‌వేలు, మెట్రో రైలు, విమానాశ్రయాలు, ఐటి కమ్యూనికేషన్, సోషల్, కమర్షియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (విద్యా సంస్థ, ఆసుపత్రులు), పోర్ట్‌లు, వివిధ ఎలక్ట్రో-మెకానికల్ (ఈ అండ్ ఎం) పనులతో కూడిన స్టీల్ మరియు రిఫైనరీ వంటి ఇతర రంగాల నాన్-పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విభాగంలోకి కూడా విస్తరించింది.

ఆర్ఈసి లిమిటెడ్ దేశంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర, కేంద్ర, ప్రైవేట్ కంపెనీలకు వివిధ మెచ్యూరిటీల రుణాలను అందిస్తుంది. ఆర్ఈసి లిమిటెడ్ విద్యుత్ రంగానికి సంబంధించిన ప్రభుత్వ ప్రధాన పథకాలలో కీలకమైన వ్యూహాత్మక పాత్రను కొనసాగిస్తోంది. ప్రధాన మంత్రి సహజ్ బిజిలీ హర్ ఘర్ యోజన (సౌభాగయ), దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన (డిడియుజిజెజెవై), జాతీయానికి నోడల్ ఏజెన్సీగా ఉంది. ఎలక్ట్రిసిటీ ఫండ్ (ఎన్ఈఎఫ్) పథకం దేశంలో చివరి-మైలు పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయడం, 100 శాతం గ్రామ విద్యుదీకరణ,  గృహ విద్యుద్దీకరణకు దారితీసింది. రివాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్ డిఎస్ఎస్) కోసం కొన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆర్ఈసి నోడల్ ఏజెన్సీగా కూడా అయింది. ఆర్ఈసి రుణ పత్రంలో రుణ మొత్తం  రూ. 4.97 లక్షల కోట్లుగా పేర్కొంది. 31 డిసెంబర్ 2023 నాటికి దీని నికర విలువ రూ. 64,787 కోట్లు.

***



(Release ID: 2018842) Visitor Counter : 66