బొగ్గు మంత్రిత్వ శాఖ

'పీఎం గతి శక్తి- బొగ్గు రంగంలో జాతీయ మాస్టర్ ప్లాన్’ను కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి విడుదల చేశారు.


మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్లాన్ చేయడం మరియు అమలు చేయడంలో ఒక ముఖ్యమైన మార్పును ఈ ప్రణాళిక సూచిస్తుంది: ప్రహ్లాద్ జోషి

Posted On: 13 MAR 2024 3:12PM by PIB Hyderabad

ఈరోజు బొగ్గు మంత్రిత్వ శాఖలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనులు మరియు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి "బొగ్గు రంగంలో ప్రధాన మంత్రి గతి శక్తి జాతీయ మాస్టర్ ప్లాన్" ను విడుదల చేశారు. పీఎం గతి శక్తి--నేషనల్ మాస్టర్ ప్లాన్ పీ ఎం జి ఎస్ -  ఎన్ ఎం పీ  పోర్టల్ యొక్క బొగ్గు మంత్రిత్వ శాఖ పేజీలో అందుబాటులో ఉన్న జియోస్పేషియల్  ద్వారా బొగ్గు రంగానికి సంబంధించిన లోతైన అంతర్దృష్టులను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు సమీకృత ప్రణాళికపై ప్రభుత్వ నిబద్ధతను ఇది హైలైట్ చేస్తుంది.

 

శ్రీ ప్రహ్లాద్ జోషి తన ప్రసంగంలో పీఎం--గతి శక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు.  ఇది మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రణాళిక మరియు అమలులో మా విధానంలో గణనీయమైన మార్పును సూచిస్తుందని ఆయన అన్నారు. పీఎం గతి శక్తి జాతీయ మాస్టర్ ప్లాన్, సమగ్ర జీఐఎస్-ఆధారిత ప్లాట్‌ఫారమ్, ప్రజలు, వస్తువులు మరియు సేవల రవాణా కోసం సమకాలీకరించబడిన ప్రణాళికను సులభతరం చేయడానికి వివిధ మంత్రిత్వ శాఖలను ఒకచోట చేర్చిందని, ఆర్థిక అభివృద్ధి కోసం విజ్ఞానం, సాంకేతికత మరియు ఆవిష్కరణలను ఉపయోగించుకోవాలని ఆయన అన్నారు.

 

ప్రధానమంత్రి గతి శక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ యొక్క ప్రాముఖ్యతను ఎత్తిచూపుతూ, బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అమృత్ లాల్ మీనా తన ప్రధాన ప్రసంగంలో ప్రణాళిక విడుదల బొగ్గు రంగంలో కార్యకలాపాలను ప్రణాళిక చేయడం మరియు అమలు చేయడం కోసం కీలకమైన సమాచారంతో లబ్దిదారులందరికీ అధికారం ఇస్తుందని తద్వారా బొగ్గు రంగం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. వ్యాపారం చేయడం మరియు సకాలంలో ప్రాజెక్ట్ అమలును నిర్ధారించడం సులభం చేస్తుందని ఆయన అన్నారు. వ్యయ సామర్థ్యాలను ప్రోత్సహించడం, అంతరాయాలను తగ్గించడం మరియు సమ్మిళిత వృద్ధిని ప్రోత్సహించడం ద్వారా ఈ చొరవ 'ఆత్మనిర్భర్ భారత్' యొక్క దృష్టితో సమలేఖనం చేయబడిందని ఆయన తెలిపారు.

 

బొగ్గు మంత్రిత్వ శాఖ సలహాదారు (ప్రాజెక్టులు) శ్రీ ఆనంద్‌జీ ప్రసాద్ తన స్వాగత ప్రసంగంలో, తగిన మౌలిక సదుపాయాల లభ్యతను నిర్ధారించడానికి, రవాణా ఖర్చులను తగ్గించడానికి  మరియు సమాచారం స్మార్ట్ మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీని స్వీకరించడం ద్వారా ఆధునికీకరణను ప్రోత్సహించడం, సమీకృత మరియు సుస్థిరమైన బొగ్గు రవాణా పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేసే లక్ష్యంతో పీఎం గతి శక్తి జాతీయ మాస్టర్ ప్లాన్‌ను విడుదల చేసినట్లు చెప్పారు.

 

పీఎం-గతి శక్తి ప్రాజెక్ట్ జాతీయ మాస్టర్ ప్లాన్, మౌలిక సదుపాయాలు అనుసంధాన ప్రాజెక్ట్‌ల కోసం సమకాలీకరించబడిన మరియు సంపూర్ణమైన ప్రణాళికను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన మార్గదర్శక ప్రయత్నం. వివిధ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల క్రింద ఇప్పటికే ఉన్న, కొనసాగుతున్న మరియు భవిష్యత్తు ప్రాజెక్ట్‌ల యొక్క సమగ్ర డేటాబేస్ అందించడం ద్వారా బహువిధ  అనుసంధానతను మెరుగుపరచడం, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం మరియు విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ఈ ప్రాజెక్ట్ లక్ష్యం.

 

పీఎం-గతి శక్తి పోర్టల్‌లో వివిధ అంశాలు మరియు విశ్లేషణాత్మక సాధనాలను ఏకీకృతం చేయడంలో బొగ్గు మంత్రిత్వ శాఖ ప్రముఖ పాత్ర పోషించింది. పోర్టల్ బొగ్గు క్షేత్ర సరిహద్దులు, బొగ్గు తరలింపు వ్యవస్థలు, రైల్వే సైడింగ్‌ల స్థానం మరియు భూమి ఆస్తుల డేటా వంటి కీలకమైన జీ ఐ ఎస్ పొరలను కలిగి ఉంది. ఇది భారతీయ బొగ్గు పరిశ్రమపై వాటాదారులకు సమగ్ర అవగాహనను అందిస్తుంది.

 

బొగ్గు రంగంలో పీఎం-గతి శక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ విడుదల, బొగ్గు రంగాన్ని మార్చేందుకు మరియు మౌలిక సదుపాయాల ప్రణాళిక మరియు అమలును క్రమబద్ధీకరించే ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన ముందడుగును సూచిస్తుంది. సుస్థిరమైన వృద్ధిని పెంపొందించడం, ప్రపంచ పోటీతత్వాన్ని పెంపొందించడం మరియు మన దేశ పౌరులకు పుష్కలంగా ఉపాధి అవకాశాలను కల్పించడంలో బొగ్గు మంత్రిత్వ శాఖ యొక్క నిబద్ధతను ఇది నొక్కి చెబుతుంది.

 

***



(Release ID: 2014373) Visitor Counter : 77