రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
జార్ఖండ్లో 114ఏ జాతీయ రహదారిపై టవర్ చౌక్ నుంచి బసుకినాథ్ వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణం కోసం రూ.292.65 కోట్లు మంజూరు చేసిన శ్రీ నితిన్ గడ్కరీ
Posted On:
12 MAR 2024 12:41PM by PIB Hyderabad
జార్ఖండ్లోని దుమ్కా జిల్లాలో ఉన్న 114ఏ జాతీయ రహదారిపై టవర్ చౌక్ నుంచి బసుకినాథ్ వరకు నాలుగు వరుసల రహదారి నిర్మాణం కోసం రూ.292.65 కోట్లు మంజూరైనట్లు కేంద్ర రహదారి రవాణా & జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు.
ఈ ప్రాజెక్టు వల్ల దేవఘర్, బసుకినాథ్ వంటి కీలక పుణ్యస్థలాలకు మరింత సులభంగా రాకపోకలు సాగించవచ్చని శ్రీ గడ్కరీ వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న రహదారి శ్రావణి మేళా సమయంలో రాకపోకలకు సరిపోదు. భక్తులు దేవఘర్, బసుకినాథ్ సందర్శించడానికి ఆ మార్గాన్ని ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఉన్న 2 వరుసల రహదార్లను నాలుగు వరుసలుగా మార్చాల్సిన అవసరం ఉంది. దీనివల్ల రద్దీ తగ్గడంతో పాటు ఆ ప్రాంత సామాజిక-ఆర్థిక అభివృద్ధికి ఈ ప్రాజెక్టు తోడ్పడుతుంది.
***
(Release ID: 2013958)