ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
బికనీర్ ఎన్ఐఈఎల్ఐటీ ఎక్సటెన్షన్ కేంద్రాన్ని రేపు ప్రారంభించనున్న కేంద్ర న్యాయ శాఖ (ఇంచార్జి), పార్లమెంటరీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మెగ్వాల్
Posted On:
20 FEB 2024 6:58PM by PIB Hyderabad
రాజస్థాన్ బికనీర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్ఐఈఎల్ఐటీ) ఏర్పాటు చేసిన ఎక్సటెన్షన్ కేంద్రాన్ని రేపు (2024 ఫిబ్రవరి 21) కేంద్ర న్యాయ శాఖ (ఇంచార్జి), పార్లమెంటరీ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి శ్రీ అర్జున్ రామ్ మెగ్వాల్ ప్రారంభిస్తారు. డిజిటల్ భారతదెశ అభివృద్ధికి ప్రధానమంత్రి శ్రీ మోదీ చేస్తున్న కృషి సాకారం అయ్యేలా చూసేందుకు ఎన్ఐఈఎల్ఐటీ ఎక్సటెన్షన్ కేంద్రం ద్వారా కృషి జరుగుతుంది.
ఎన్ఐఈఎల్ఐటీ ఎక్సటెన్షన్ కేంద్రం ఏఐ,ఎంఎల్, సైబర్ టెక్నాలజీ, క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా,సోషల్ మొబైల్,ఐఓటీ ఇండస్ట్రీ 4.0, ఆర్పీఏ, 3డి ప్రింటింగ్,ఏఆర్/విఆర్ లాంటి ఇంజనీరింగ్ కోర్సులు అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు ఎన్ఐఈఎల్ఐటీ 0 లెవెల్ కోర్సును వేసవి శిక్షణ కేంద్రాలు, అధ్యాపకుల కోసం శిక్షణ శిబిరాలను కేంద్రంలో నిర్వహిస్తారు.
బికనీర్ ఎన్ఐఈఎల్ఐటీ ఎక్సటెన్షన్ కేంద్రం ఏర్పాటు చేయడానికి కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ 7.05 కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ నిధులతో బికనీర్ లో రెండు ప్రాంతాలలో ఎక్సటెన్షన్ కేంద్రాలు ఏర్పాటు అయ్యాయి.
i. బికనీర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒక కేంద్రం పనిచేస్తుంది. 3240 చదరపు అడుగుల విస్తీర్ణంలో కళాశాల మొదటి అంతస్తులో ఏర్పాటు అయిన కేంద్రలో 3 కంప్యూటర్ ల్యాబ్ లు అందుబాటులో ఉంటాయి. 62 మంది విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించారు.
ii. బికనీర్ మహారాజా గంగా సింగ్ విశ్వవిద్యాలయంలో ఇన్నోవేషన్ కేంద్రంలో మరో ఎక్సటెన్షన్ కేంద్రం ఏర్పాటు అయింది. 2360 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో 120 మంది విద్యార్థుల కోసం ఆర్ తరగతి గదులు, ట్రెండు కంప్యూటర్ ల్యాబ్ లు ఏర్పాటు అయ్యాయి. ఒకేసారి 100 మంది విద్యార్థులు కంప్యూటర్ ల్యాబ్ లో అత్యాధునిక శిక్షణ పొందడానికి సౌకర్యాలు కల్పించారు.
కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలో స్వయంప్రతిపత్తి కలిగిన శాస్త్రేయ సంస్థగా పని చేస్తున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్ఐఈఎల్ఐటీ) ఐఈసిటీ రంగంలో నైపుణ్యాభివృద్ధి, మానవ వనరుల అభివృద్ధి కోసం బి.టెక్, ఎంటెక్, ఎంసిఏ, బీసీఏ, పీజీ డిప్లొమా ఇన్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ క్లౌడ్, కంప్యూటింగ్ డేటా లాంటి వివిధ డిగ్రీ/డిప్లొమా కోర్సులు అందిస్తోంది. నైపుణ్యాభివృద్ధి కోసం సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడానికి సంస్థ రెండు స్వల్ప కాలిక సర్టిఫికెట్ కోర్సులు అందిస్తోంది. నైపుణ్యాభివృద్ధి ద్వారా విద్యార్థులకు నూతన ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి.
దేశవ్యాప్తంగా 50 ఎన్ఐఈఎల్ఐటీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. శిక్షణ అందించడానికి 700 కి పైగా సంస్థలు, 9000 కి పైగా సౌకర్య కల్పన కేంద్రాలను ఎన్ఐఈఎల్ఐటీ గుర్తించింది. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో పరీక్షలను ఎన్ఐఈఎల్ఐటీ నిర్వహిస్తోంది. బికనీర్ కేంద్రంతో ఎన్ఐఈఎల్ఐటీ స్వయంగా నిర్వహిస్తున్న కేంద్రాల సంఖ్య 51 కి చేరుతుంది. రాజస్థాన్ కేకరి లో పనిచేస్తున్న ఎన్ఐఈఎల్ఐటీ కేంద్రం బి.టెక్ ( కంప్యూటర్ సైన్స్)ను,ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు అందిస్తోంది.
***
(Release ID: 2007669)