నౌకారవాణా మంత్రిత్వ శాఖ
రేపు గువాహతిలోని పాండు రేవులో రూ. 254 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించనున్న శ్రీ సర్బానంద సోనోవాల్
ప్రయాణీకులు, సరుకు రవాణాకు సౌలభ్యతను కల్పిస్తూ ఈశాన్య అంతర్గత జలరవాణాను పరివర్తనకు లోను చేయనున్న రేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఐడబ్ల్యుఎఐ చొరవలు
Posted On:
19 FEB 2024 6:11PM by PIB Hyderabad
అంతర్గత జలరవాణా (ఐడబ్ల్యుటి) రంగాన్ని పునరుద్ధరించడం, ఈశాన్య ప్రాంతంలో అనుసంధానతను పెంపొందించడం కోసం కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ బుధవారం గౌహతిలోని పాండు రేవులో రూ. 254 కోట్ల విలువైన కీలక ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.
బొగిబీల్లో దాదాపు రూ.46.60 కోట్ల విలువైన ప్యాసెంజర్-కమ్- కార్గో టెర్మినల్ను, రూ. 6.91 కోట్ల విలువైన అంతర్గత జలరవాణా టర్మినల్లను సోనామురాలోనూ, రూ. 6.40 కోట్లతో ఆధునీకరించిన కరీంగంజ్, బందార్పూర్ టెర్మినళ్ళను శ్రీ సోనోవాల్ ప్రారంభిస్తారు.
ఈ కార్యక్రమం సందర్భంగా ఆయన బ్రహమ్మపుత్ర నదిపై వివిధ ప్రాంతాలలో రూ.8.45 కోట్లు విలువైన ఆరు జెట్టీలను, జాతీయ జలమార్గం -2, జాతీయ జలమార్గం -16కు రూ. 25 కోట్ల విలువైన 19 ప్యాసెంజర్ వాహనాలను, రూ. 30 కోట్లు విలువైన జెట్టీ విస్తరణ, సమగ్ర కార్యాలయం, బ్యాంక్ రక్షణను ప్రకటించనున్నారు. ఈ మౌలికసదుపాయాల అభివృద్ధి అన్నది ఈశాన్య ప్రాంత అనుసంధానతను ప్రముఖంగా పెంచడమే కాకుండా, ప్రయాణీకులు, సరుకు కూడా ఆటంకాలు లేకుండా రవాణా అయ్యే సౌలభ్యాన్ని కల్పిస్తుంది.
ఈ ప్రారంభోత్సవాలకు అదనంగా, రూ. 7.50 కోట్లతో ఇమ్మిగ్రేషన్ & కస్టమ్స్ కోసం ఐడబ్ల్యుఎఐ దుబ్రి భవన సముదాయానికి శంకుస్థాపన చేసి, ఈ ప్రాంతంలో పరిపాలనా ప్రక్రియలు, మౌలిక సదుపాయాల అభివృద్ధిని క్రమబద్ధీకరించడంలో ప్రభుత్వ నిబద్ధతను నొక్కి చెబుతుంది.
ఈ కార్యక్రమానికి గువాహతి పార్లమెంటు సభ్యులు శ్రీమతి క్వీన్ ఓజా, అస్సాం రవాణా, మత్స్య& ఎక్సైజ్ మంత్రి శ్రీ పరిమళ్ శుక్లబైద్య, గౌహతి తూర్పు ఎమ్మెల్యే శ్రీ సిద్ధార్థ భట్టాచార్య, గౌహతి పశ్చిమ ఎమ్మెల్యే శ్రీ రమేంద్ర నారాయణ్ కలిత, దిస్పూర్ ఎమ్మెల్యే శ్రీ అతుల్ బోరా హాజరవుతారు. ఇతర గౌరవ అతిథులు ఈ ప్రారంభ కార్యక్రమానికి దృశ్యమాధ్యమం ద్వారా హాజరై వీక్షిస్తారు. పెట్రోలియం & సహజవాయువుల, కార్మిక & ఉపాధి శాఖ సహాయమంత్రి శ్రీ రామేశ్వర్ తెలి, దిబ్రూగఢ్ ఎమ్మెల్యే శ్రీ ప్రశాంత్ పుకాన్, మొరాన్ ఎమ్మెల్యే శ్రీ చక్రధర్ గోగోయ్, చబువా ఎమ్మెల్యే శ్రీ పోనకన్ బారువాలు దిబ్రూగఢ్ నుంచి దృశ్యమాధ్యమం ద్వారా హాజరవుతారు.
***
(Release ID: 2007448)