గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

సీ & డీ వ్యర్థాలను సమర్థవంతంగా పారవేసేందుకు ప్రభుత్వం సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేసింది: హర్దీప్ ఎస్ పూరి


"నిర్మాణ రంగంలో సీ & డీ వ్యర్థాల పునర్వినియోగం మరియు వినియోగంతో ఇటీవలి అభివృద్ధి"పై జాతీయ వర్క్‌షాప్ ప్రారంభించబడింది

Posted On: 19 FEB 2024 3:43PM by PIB Hyderabad

భారత ఆర్థిక వ్యవస్థకు నిర్మాణ పరిశ్రమ యొక్క శక్తిని హైలైట్ చేస్తూ,  భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలలో నిర్మాణ పరిశ్రమ ఒకటి అని గృహ & పట్టణ వ్యవహారాలు మరియు పెట్రోలియం & సహజ వాయువు శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి అన్నారు. ఇది దేశంలో రెండవ అతిపెద్ద ఉపాధి రంగం మరియు ఆర్థిక వ్యవస్థలోని 250 రంగాలతో ముందు మరియు వెనుక అనుసంధానాలను కలిగి ఉంది. 2025 నాటికి భారతదేశం ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద నిర్మాణ మార్కెట్‌ను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు.

 

 “నిర్మాణ రంగంలో సి అండ్ డి వ్యర్థాల రీసైక్లింగ్ మరియు వినియోగంతో ఇటీవలి అభివృద్ధి” అనే జాతీయ వర్క్‌షాప్ ప్రారంభోత్సవంలో మంత్రి ప్రసంగించారు. శ్రీమతి మే-ఎలిన్ స్టెనర్, భారతదేశంలోని నార్వేజియన్ రాయబారి; శ్రీ మనోజ్ జోషి, సెక్రటరీ, హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్; మరియు శ్రీ రాజేష్ కుమార్ కౌశల్, డీ జీ, సీ పీ డబ్ల్యూ డీ ఈ లో ఈరోజు జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

ఎస్ ఐ ఎన్ టీ ఈ ఎఫ్ నార్వే సహకారంతో సీ పీ డబ్ల్యూ డీ నిర్వహించిన వర్క్‌షాప్, నిర్మాణ పరిశ్రమలో సీ & డీ రీసైకిల్ వస్తువుల వినియోగాన్ని ప్రోత్సహించే వివిధ అంశాలపై చర్చించడానికి అవకాశం కల్పించింది. సీ & డీ పునర్వినియోగ ఉత్పత్తులు/వస్తువుల రంగంలోని నిపుణులు తమ అభిప్రాయాలను వ్యాప్తి చేయడం కోసం వర్క్‌షాప్‌లో పాల్గొంటున్నారు. సుస్థిరమైన అభివృద్ధిలో పై ఉత్పత్తుల వినియోగం యొక్క ప్రయోజనాలను తెలియజేస్తున్నారు.

 

ఈ సందర్భంగా శ్రీ పూరి మాట్లాడుతూ, శరవేగంగా నిర్మాణాత్మక వాతావరణాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు.  2030 నాటికి భారతదేశం ప్రతి సంవత్సరం 700-900 మిలియన్ చదరపు మీటర్ల వాణిజ్య మరియు నివాస స్థలాన్ని జోడించాల్సిన అవసరం ఉందని దేశం యొక్క పట్టణీకరణ డిమాండ్ల గురించి గణాంకాలను ఉటంకిస్తూ  అన్నారు. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే, మౌలిక సదుపాయాలు చాలా ముఖ్యమైనవనీ అవి మా ఆశయంలో భాగం అని ఆయన జోడించారు.

 

పర్యావరణ పరిగణనలను ముఖ్యంగా నిర్మాణ రంగానికి సంబంధించిన నిర్మాణ మరియు కూల్చివేత (సీ & డీ) వ్యర్థాలను గుర్తించిన మంత్రి, పెరుగుతున్న నిర్మాణ కార్యకలాపాలతో, ఉత్పన్నమయ్యే సీ & డీ వ్యర్థాలను నిర్వహించడానికి మరింత సమర్థవంతమైన పరిష్కారాలను కనుగొనడం అత్యవసరం అన్నారు.

 

భారతదేశంలో సీ & డీ వ్యర్థాల సవాళ్లు మరియు అవకాశాల గురించి శ్రీ పూరి మాట్లాడుతూ, నిర్మాణం మరియు కూల్చివేత వ్యర్థాలు ప్రపంచంలోని అతిపెద్ద ఘన వ్యర్ధాల్లో ఒకటి. అంచనాల ప్రకారం భారతదేశంలోని నిర్మాణ పరిశ్రమ ప్రతి సంవత్సరం 150-500 మిలియన్ టన్నుల సి అండ్ డి వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుందని ఆయన అన్నారు. ఇది అనధికార డంపింగ్, పారవేయడానికి స్థలం లేకపోవడం మరియు బయోడిగ్రేడబుల్ వ్యర్థాలతో సరిగ్గా వెరుచేయకపోవడం వంటి అనేక సవాళ్లను తెరపైకి తెస్తుంది. ఈ నేపథ్యంలో వ్యర్థ పదార్థాలను రీసైక్లింగ్ చేయడంతోపాటు వ్యర్థాలను తగ్గించేందుకు తోడ్పడే సాంకేతికతలకు విపరీతమైన డిమాండ్ ఉందన్నారు.

 

వ్యర్థాల సుస్థిరనిర్వహణకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఎత్తిచూపిన మంత్రి, 2015లో ప్రారంభించిన అర్బన్ మిషన్‌లు మౌలిక సదుపాయాల కల్పన మరియు సేవలను అందించడంలో సుస్థిరమైన పద్ధతులను అవలంబించాలనే ప్రభుత్వ హరిత దృష్టికి మంచి ఉదాహరణలు అని పేర్కొన్నారు.

 

ఘన వ్యర్థాల నిర్వహణకు సంబంధించి, ఘన వ్యర్థాల ప్రాసెసింగ్ 2014లో కేవలం 17% నుండి 2024లో 77% కంటే ఎక్కువగా పెరిగిందని శ్రీ పూరి చెప్పారు. “ఇప్పుడు, మేము ఈ సామర్థ్యాలను సీ & డీ వ్యర్థాలతో సహా ప్లాస్టిక్ వ్యర్థాలు, ఇ-వ్యర్థాలు మరియు జీవ-ప్రమాదకర వ్యర్థాలు వంటి ఇతర రకాల వ్యర్థాల నిర్వహణకు బదిలీ చేస్తున్నాము.  ఈ సమస్యలపై ప్రభుత్వం విస్తృతమైన మార్గదర్శకాలను విడుదల చేసింది.'' అని మంత్రి తెలిపారు.

 

"సీ & డీ వ్యర్థాలను సమర్థవంతంగా పారవేయడంపై మా ప్రభుత్వం విలువ ఆవరణం అంతటా సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేసింది" అని ఆయన చెప్పారు.

 

సీ & డీ వ్యర్థాల నిర్వహణ పట్ల  వాటాదారుల ఆలోచనలను మార్చడంలో గృహనిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎం ఓ హెచ్ యూ ఏ) సాధించిన పురోగతిపై మంత్రి మాట్లాడుతూ, సీ & డీ వ్యర్థాలపై డేటాను సేకరించాలని ఎం ఓ హెచ్ యూ ఏ అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు మరియు పట్టణ స్థానిక సంస్థలకు సూచించిందని హైలైట్ చేశారు. ప్రతి ప్రధాన నగరం/పట్టణం ఉత్పత్తి మరియు మూలం వద్ద సీ & డీ వ్యర్థాలను వేరు చేయడాన్ని ప్రోత్సహిస్తుంది మరియు సీ & డీ వ్యర్థాల సేకరణ కోసం సంస్థాగత విధానాలను ఏర్పాటు చేస్తుందని అన్నారు.

 

సీ & డీ వ్యర్థాల ప్రాసెసింగ్‌లో ప్రభుత్వ పాత్ర పై తన ఆలోచనలను పంచుకున్న శ్రీ పూరి, కేవలం ఎన్ సీ ఆర్ ప్రాంతం ఒక్కటే రోజుకు 6,303 టీ పీ డీ సీ & డీ వ్యర్థాలను ఉత్పత్తి చేస్తుందని అలాగే ఇందులో రోజుకు దాదాపు 78% వ్యర్థాలు  ప్రాసెస్ చేయబడతాయని పేర్కొన్నారు.

 

తన ముగింపు వ్యాఖ్యలలో, సి అండ్ డి వ్యర్థాలను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి  మెరుగైన వ్యూహాలను రూపొందించడంలో ప్రభుత్వానికి సహాయం చేయాలని మంత్రి వాటాదారులను కోరారు.

 

****



(Release ID: 2007444) Visitor Counter : 59