వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

దేశీయ ఉత్పత్తి మరియు వాణిజ్యంలో మెరుగైన సామర్థ్యం కోసం సరఫరా వ్యవస్థ మరియు సమర్థవంతమైన రవాణా యొక్క ప్రాముఖ్యతను ప్రభుత్వం గుర్తించింది


ప్రభుత్వం రవాణావరణ వ్యవస్థతో సహా సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటుంది

Posted On: 07 FEB 2024 5:05PM by PIB Hyderabad

దేశీయ ఉత్పత్తి మరియు వాణిజ్యంలో మెరుగైన సామర్థ్యం కోసం సరఫరా వ్యవస్థ మరియు సమర్థవంతమైన రవాణా యొక్క ప్రాముఖ్యత గురించి ప్రభుత్వానికి తెలుసు.

 

ఈ విషయంలో, రవాణా పర్యావరణ వ్యవస్థతో సహా సరఫరా వ్యవస్థలను బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది.  13 అక్టోబర్ 2021న మల్టీమోడల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ కోసం 'మొత్తం ప్రభుత్వ విధానం'తో పీ ఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ (ఎన్ ఎం పీ) ప్రారంభించబడింది. పీ ఎం గతి శక్తి ఎన్ ఎం పీ అనేది జీఐఎస్- ఆధారిత ప్లాట్‌ఫారమ్, ఇది రోడ్లు, రైల్వే లైన్‌లు, పోర్ట్‌లు, అంతర్గత జలమార్గాలు, టెలికాం లైన్లు, పవర్ లైన్‌లు మొదలైన వాటికి చెందిన మౌలిక సదుపాయాల యొక్క సమాచారాన్ని ఒకే ప్లాట్‌ఫారమ్‌లో ఏకీకృతం చేస్తుంది మరియు మల్టీమోడల్ రవాణా కోసం సమగ్ర ప్రణాళికను అనుమతిస్తుంది.

 

పీ ఎం గతి శక్తి ఎన్ ఎం పీ కి అనుబంధంగా, మానవ వనరుల అభివృద్ధి, డిజిటల్ టెక్నాలజీల స్వీకరణతో సహా సమగ్ర లాజిస్టిక్స్ యాక్షన్ ప్లాన్స్ (క్లాప్) యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్‌ఫేస్ ప్లాట్‌ఫారమ్ (యూలిప్) మరియు లాజిస్టిక్స్ డేటా బ్యాంక్ (ఎల్ డీ బీ) ద్వారా రవాణా రంగంలో ప్రక్రియలను క్రమబద్ధీకరించడం ద్వారా సేవలలో సమర్థత కోసం  నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ (ఎన్ ఎల్ పీ) 17 సెప్టెంబర్ 2022న ప్రారంభించబడింది.  యూలిప్ మంత్రిత్వ శాఖలలో 33 రవాణా సంబంధిత డిజిటల్ సిస్టమ్‌లను అనుసంధానిస్తూ, ఎల్ డీ బీ ఎక్సిం కంటైనర్‌లను ట్రాక్ చేయడానికి మరియు ట్రేస్ చేయడానికి పనిచేస్తుంది .

 

అదనంగా, దేశంలో పెట్టుబడులు మరియు తయారీని ప్రోత్సహించడానికి సరళీకృత ఎఫ్‌డిఐ విధానం, కీలక రంగాలలో పిఎల్‌ఐ పథకాలను ప్రవేశపెట్టడం, కార్పొరేట్ పన్ను తగ్గింపు,  వ్యాపార నిబంధనల అమలు భారం తగ్గింపు చర్యల ద్వారా వ్యాపారం, మేక్ ఇన్ ఇండియా, ఒక జిల్లా ఒక ఉత్పత్తి చొరవ, ఇతర వ్యాపార సంస్కరణలతో పాటు జిల్లాగా ఎగుమతి కేంద్రంగా చొరవ విదేశీ వాణిజ్య విధానం 2023 వంటి అనేక సంస్కరణలు చేపట్టబడ్డాయి. ఇంకా, ప్రస్తుతం ఉన్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్ టీ ఏ లు) ప్రిఫరెన్షియల్ నిబంధనలపై తయారీ రంగానికి సరఫరాలు మరియు మార్కెట్ యాక్సెస్‌ను నిర్ధారిస్తాయి.

 

భారతమాల మరియు సాగరమాల, ఎగుమతుల కోసం వాణిజ్య మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక పార్కుల ఏర్పాటు మరియు పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధి మొదలైన కార్యక్రమాలు కూడా సమగ్ర మౌలిక సదుపాయాల ప్రణాళికను సులభతరం చేయడానికి మరియు దేశ ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడానికి చేపట్టబడ్డాయి.

 

అంతర్జాతీయ స్థాయిలో, ఇతర వాటితో పాటు, జివిసిలలో సుదృఢత్వాన్ని  పెంపొందించడానికి కీలకమైన రంగాలు మరియు ఉత్పత్తులకు అవకాశాలను గుర్తించడంలో సహాయపడే భారత ప్రభుత్వం కూడా సంతకం చేసిన 'జి20 జెనరిక్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ మ్యాపింగ్ జివిసి' వంటి కార్యక్రమాలను చేపట్టడమే కాకుండా, ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ ఫర్ ప్రాస్పిరిటీ అగ్రిమెంట్ ఫర్ సప్లై చైన్ (14 సభ్య దేశాల చొరవ) మరియు అంతర్జాతీయ భాగస్వామ్యాల ఆధారంగా సామూహిక, దీర్ఘకాలిక సుదృడ సరఫరా వ్యవస్థలను నిర్మించడానికి జపాన్ మరియు ఆస్ట్రేలియాతో సప్లై చైన్ రెసిలెన్స్ ఇనిషియేటివ్ లో భాగం కావడం వంటి కార్యక్రమాలను చేపట్టింది.

 

కేంద్ర వాణిజ్యం మరియు పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియా పటేల్ ఈ సమాచారాన్ని  ఈరోజు లోక్‌సభలో  లిఖితపూర్వక సమాధానం లో అందించారు.

 

***



(Release ID: 2003753) Visitor Counter : 52


Read this release in: English , Urdu , Hindi