శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

"వికసిత్ భారత్" యొక్క టార్చ్ బేరర్ల లో జమ్మూ మరియు కాశ్మీర్ కి చెందిన "అరోమా మిషన్" ఉందని కేంద్ర సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) సైన్స్ & టెక్నాలజీ; ఎం ఓ ఎస్ పీ ఎం ఓ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ అండ్ స్పేస్, డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు జమ్మూలో అన్నారు.

Posted On: 03 FEB 2024 6:33PM by PIB Hyderabad

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధానిలోని కర్తవ్య పథ్ లో డోడా జిల్లాలోని భదర్వా పట్టణంలోని లావెండర్ పొలాలను  టాబ్ల్యూ ప్రదర్శన ద్వారా జే & కే భారతదేశానికి కూడా ఒక రోల్ మోడల్‌గా మారింది.  సుగంధ స్టార్టప్‌ల పర్యావరణ వ్యవస్థతో అనుబంధం ఉన్న జే & కే యువత దేశవ్యాప్తంగా ఊదా విప్లవానికి బ్రాండ్ అంబాసిడర్‌లుగా ఎదిగారని ఆయన అన్నారు.

 

డిడిసిల సభ్యులతో సహా పిఆర్‌ఐలతో తొలిసారిగా నిర్వహించిన సమావేశానికి అధ్యక్షత వహించిన అనంతరం కేంద్ర మంత్రి మాట్లాడారు. ఈ ప్రాంతంలో స్టార్టప్ ప్రమోషన్ కోసం సొసైటీతో అనుసంధానాన్ని పెంపొందించే లక్ష్యంతో  జమ్మూలోని సిఎస్ఐఆర్-ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్‌లో ఈ సమావేశం జరిగింది.

 

జే & కే యొక్క సుగంధ మిషన్‌ను విజయగాథగా అభివర్ణిస్తూ, డాక్టర్ జితేంద్ర సింగ్, భారతదేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లడంలో ఈ ప్రాంతాలు కీలకంగా ఉన్నాయని, ఇప్పటివరకు అన్వేషించని ప్రాంతాలను సుగంధ సాగు కు ఉపయోగించుకోవడానికి సమయాన్ని మరియు ప్రయత్నాలను పెట్టుబడి పెట్టాలని పిలుపునిచ్చారు. డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, అగ్రి స్టార్టప్‌లు కేంద్ర పాలిత ప్రాంత యువతకు స్వయం ఉపాధికి మార్గాలుగా మారుతున్నాయని అన్నారు.

 

అగ్రి స్టార్టప్‌లలో మరింత ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం కోసం డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ,   రెండు రంగాల మధ్య సహకారాన్ని పెంపొందించాలని అన్నారు. లావెండర్ వంటి హిమాలయ సుగంధ వనరుల పెంపకంపై అవగాహన పెంపొందించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెప్పిన ఆయన, ఈ ప్రయత్నంలో తమ వంతు పాత్ర పోషించాలని డీ డీ సీ  సభ్యులకు పిలుపునిచ్చారు, తద్వారా వారి ప్రాంతాల్లోని యువత పెద్ద సంఖ్యలో అగ్రి స్టార్టప్‌లలో చేరి, స్థిరమైన జీవనోపాధిని పొందగలరు ఇది భారతదేశ జి డీ పీ కి దోహదపడుతుంది.

 

జమ్మూ మరియు కాశ్మీర్‌లోని వివిధ ప్రాంతాల భౌగోళిక స్వరూపం ఆధారంగా ఏ కొత్త పంటలు సాగు చేయడానికి అనువైనవి అని పరిశోధనలు చేసి కనుగొనవలసిందిగా సీ ఎస్ ఐ ఆర్ - ఐ ఐ ఐ ఎం కి మంత్రి పిలుపునిచ్చారు.

 

అగ్రి-స్టార్టప్ ఆవరణ లో ఎక్కువ మంది నిమగ్నమవ్వాల్సిన అవసరం ఉందని డాక్టర్ జితేంద్ర సింగ్ నొక్కి చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో గత పదేళ్లలో దేశంలో స్టార్టప్‌ల సంఖ్య లక్షన్నర దాటిందని మంత్రి వివరించారు. భారతదేశం యొక్క జీవ ఆర్థిక రంగం ఒక దశాబ్దం క్రితం 10 బిలియన్ల నుండి ప్రస్తుతం 140 బిలియన్లకు పైకి పెరిగిందని  ఆయన తెలియజేశారు. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలను రక్షించడంలో సహాయపడిన  వ్యాక్సిన్ ప్రోగ్రామ్‌కు ధన్యవాదాలు, ప్రపంచంలోనే నివారణ ఆరోగ్య సంరక్షణలో భారతదేశం అగ్రగామిగా పేరుపొందడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.

 

అంతరిక్ష రంగంలో గత ఏడాది కేవలం ఎనిమిది నెలల్లోనే వెయ్యి కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చాయని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. అంతరిక్షంలో 2040 నాటికి 40 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని ఆయన చెప్పారు.  భారతదేశం లక్ష్యాన్ని అధిగమించగలదని అంచనా. ఇటీవలి ఏ డీ ఎల్ (ఆర్థర్ డి లిటిల్) నివేదిక ప్రకారం దేశం 2040 నాటికి 100 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా.

 

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ ఈ రంగంలో సంస్కరణలు చేపట్టినప్పటి నుండి భారతదేశం అంతరిక్ష రంగ స్టార్టప్‌ల సంఖ్య పెరిగింది.

***



(Release ID: 2002451) Visitor Counter : 105


Read this release in: Hindi , English , Urdu