హోం మంత్రిత్వ శాఖ

గౌహతిలో 2551 మంది అస్సాం పోలీసు కమాండోల పాసింగ్ అవుట్ పరేడ్‌కు ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర హోమ్ మరియు సహకార మంత్రి శ్రీ అమిత్ షా


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో 2014 నుండి 2024 వరకు దేశంలోని అంతర్గత భద్రత విషయంలో సానుకూల మార్పు

2,551 మంది అస్సాం పోలీసు కమాండోలు ఈరోజు అసోం శాంతి భద్రతలు మరియు భద్రతను మరింత పటిష్టం చేస్తారు

మునుపటి ప్రభుత్వాల హయాంలో అస్సాం సుదీర్ఘ కాలం అశాంతికి సాక్ష్యమిచ్చింది, కానీ నేడు అది అభివృద్ధి మరియు శాంతి యొక్క కొత్త శకానికి సాక్షిగా ఉంది

భారత్-మయన్మార్ సరిహద్దుకు కూడా ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దు తరహాలో కంచె వేయనున్నారు

మోదీ ప్రభుత్వ హయాంలో ఈశాన్య రాష్ట్రాలు డ్రగ్స్ ఫ్రీగా మారుతున్నాయి

అస్సాం ప్రభుత్వం లక్ష మంది యువతకు అవినీతిరహితంగా ఉద్యోగాలు ఇచ్చింది

Posted On: 20 JAN 2024 8:29PM by PIB Hyderabad

ఈ రోజు అస్సాంలోని గౌహతిలో జరిగిన అస్సాం పోలీసుల 2,551 మంది కమాండోల పాసింగ్ అవుట్ పరేడ్‌కు కేంద్ర హోమ్ మరియు సహకారశాఖ మంత్రి శ్రీ అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

image.png


శ్రీ అమిత్ షా తన ప్రసంగంలో ఈ రోజు 2,551 మంది పోలీసు కమాండోలు అసోం శాంతి భద్రతలను మరింత బలోపేతం చేస్తారని అన్నారు. ఐదు కొత్త కమాండో బెటాలియన్‌లకు ఆర్మీ ద్వారా శిక్షణ ఇచ్చామని, ఈ దృఢ సంకల్పంతో కూడిన జవాన్లు అస్సాం ఎదుర్కొనే ప్రతి సవాళ్లను కచ్చితంగా ఎదుర్కొంటారని తాను విశ్వసిస్తున్నాననీ హోంమంత్రి చెప్పారు.

అస్సాం పోలీసులు భారతదేశంలోనే అత్యంత సవాళ్లను ఎదుర్కొన్నారని హోంమంత్రి అన్నారు. విభజన సమయంలో జరిగిన మత అల్లర్లు, శరణార్థుల సమస్య, ఏడు దశాబ్దాలుగా కొనసాగుతున్న చొరబాటు సమస్య, 1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం, అనేక తిరుగుబాటుదారుల సమూహాల హింస మరియు మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి అంశాలతో అస్సాం ఎల్లప్పుడూ ప్రభావితమైంది. అయితే వాటిని ఎదుర్కొని పోరాడిన ఘనమైన చరిత్ర అస్సాం పోలీసులకు ఉందన్నారు. 2,551 మంది కొత్త యువత అసోం పోలీస్ ఫ్లీట్‌లో చేరడం వల్ల అసోం పోలీసులకు కొత్త శక్తిని ఇస్తారని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

 

image.png


ఈ సందర్భంగా అత్యున్నత త్యాగం చేసిన దాదాపు 900 మంది అస్సాం పోలీసు సిబ్బందికి శ్రీ అమిత్ షా నివాళులర్పించారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో 2014 నుంచి 2024 మధ్య కాలంలో దేశ అంతర్గత భద్రత విషయంలో సానుకూల మార్పు వచ్చిందని ఆయన అన్నారు. దశాబ్దాల విపక్ష రాజకీయాల కారణంగా జమ్మూ కాశ్మీర్, మొత్తం ఈశాన్య మరియు నక్సల్స్ హింసాకాండ ప్రభావిత ప్రాంతాలు చెదిరిపోయాయి. కానీ నేడు నక్సల్ ప్రభావిత ప్రాంతాలు, ఈశాన్య మరియు కాశ్మీర్‌లో హింసలో 73 శాతానికి పైగా తగ్గిందని చెప్పారు.

 

image.png


గత ప్రభుత్వాల హయాంలో అసోం సుదీర్ఘకాలం అశాంతికి గురైందని, అయితే నేడు అది అభివృద్ధి మరియు శాంతి యుగానికి సాక్ష్యమిస్తోందని కేంద్ర హోమ్ మంత్రి మరియు సహకార మంత్రి అన్నారు. గత ఐదేళ్లలో అస్సాంలో శాంతిభద్రతల పరిస్థితిలో భారీ మార్పు వచ్చింది. దాదాపు ప్రతి సాయుధ సమూహంతో శాంతి ఒప్పందాలు సంతకం చేయబడ్డాయి, యువత ప్రధాన స్రవంతిలో చేరారు మరియు సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్‌పిఏ)  పరిధి కూడా గణనీయంగా తగ్గించబడింది. సరిహద్దు జిల్లాల్లో గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సెంట్రల్ పారామిలిటరీ ఫోర్సెస్ (సిఏపిఎఫ్‌) మరియు పోలీసుల మధ్య మంచి సమన్వయం ఏర్పడింది. అక్రమ రవాణాను అరికట్టేందుకు సరిహద్దులో దుర్భేద్యమైన గోడను నిర్మించే పని కూడా జరిగిందని వివరించారు.

 

image.png


ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దు తరహాలో భారత్-మయన్మార్ సరిహద్దుకు కూడా కంచె వేయాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించిందని శ్రీ అమిత్ షా తెలిపారు. మయన్మార్‌-భారత్‌ల మధ్య స్వేచ్ఛాయుత సంచారం కోసం ఇప్పటికే ఉన్న ఒప్పందాన్ని భారత ప్రభుత్వం పునరాలోచిస్తున్నదని చెప్పారు.

మోదీ ప్రభుత్వ హయాంలో ఈశాన్య రాష్ట్రాలు మాదకద్రవ్యాల రహితంగా మారుతున్నాయని కేంద్ర హోంమంత్రి, సహకార మంత్రి అన్నారు. మే 2021 నుండి ఇప్పటివరకు, అస్సాం పోలీసులు దాదాపు 13560 మంది డ్రగ్స్ స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఎన్‌డిపిఎస్ చట్టం కింద 8100కి పైగా కేసులు నమోదు చేసి పెద్ద సంఖ్యలో మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అసోంలోని లక్ష మంది యువతకు ఎలాంటి అవినీతి లేకుండా ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చామన్నారు. అస్సాం ప్రభుత్వం లక్ష మంది యువతకు అవినీతి రహిత ఉద్యోగాలు కల్పించింది.

 

image.png


శ్రీ హిమంత బిస్వ శర్మ ప్రభుత్వం గతంలో కూడా 89000 మంది యువతకు ఏకకాలంలో అపాయింట్‌మెంట్ లెటర్లు ఇచ్చిందని శ్రీ అమిత్ షా తెలిపారు. ప్రతిపక్ష పార్టీ ప్రభుత్వ హయాంలో అసోం యువత డబ్బులు చెల్లించి ఉద్యోగం పొందేవారని, కానీ తమహయాంలో ఉద్యోగాలు కల్పించడంలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదన్నారు.

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అయోధ్య‌లో జ‌న‌వ‌రి 22న రామ్‌ల‌ల్లాకు శంకుస్థాప‌న చేయ‌బోతున్నార‌ని కేంద్ర హోం మంత్రి, స‌హ‌కార శాఖ మంత్రి తెలిపారు. దాదాపు 550 ఏళ్లపాటు అవమానకరమైన స్థితిలో తన ఇంటి నుంచి బయటపడ్డ శ్రీరాముడిని 550 ఏళ్ల తర్వాత నరేంద్రమోదీ ప్రతిష్ఠాపన చేసి మహా మందిరంలో ప్రతిష్ఠించనున్నారు. శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలోనే శక్తిగా ఎదుగుతుండటం యావత్ దేశానికి గర్వకారణమని చెప్పారు.

 

image.png


2047 నాటికి భారతదేశం పూర్తిగా అభివృద్ధి చెందిన మరియు స్వావలంబన కలిగిన దేశంగా మారుతుందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆకాంక్షిస్తున్నారని  అమిత్ షా తెలిపారు. ఈ కార్యక్రమం ఆలయంలో రామ్ లల్లా ప్రతిష్టాపన కార్యక్రమంతో ప్రారంభమవుతుంది. ఇది యావత్ దేశానికి శుభదాయకం మరియు సంతోషకరమైన విషయం. ప్రతిపక్ష పార్టీ నాయకుడు భారత్ జోడో న్యాయ యాత్రను ప్రారంభించారని ఆయన అన్నారు. ఆయన పార్టీ హయాంలో అస్సాంలో జరిగిన అన్యాయం, వేలాది మంది యువకులు మృత్యువును చవిచూడాల్సి వచ్చింది, అస్సాం తిరుగుబాటు బారిన పడింది, ఈ కాలంలో మరణించిన వారి కుటుంబ సభ్యులు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ న్యాయ యాత్రను వ్యతిరేకించారు.

 

image.png


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వంలో మ‌నం ముందుకు సాగుతున్నామ‌ని కేంద్ర హోం మంత్రి, స‌హ‌కార మంత్రి అన్నారు. నేడు భారతదేశం ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. నరేంద్ర మోదీ  సెక్షన్ 370 కళంకాన్ని తొలగించారు. శ్రీరాముడు తన ఆలయంలో ఉండబోతున్నారు. మొత్తం ఈశాన్యంలో శాంతి మరియు అభివృద్ధి యొక్క కొత్త శకం ప్రారంభమైందని చెప్పారు.
 

***



(Release ID: 1998279) Visitor Counter : 86


Read this release in: English , Urdu , Assamese