రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

హరిత కార్యక్రమాలను ప్రోత్సహించడానికి మరియు సులభతరం చేయడానికి భారతీయ రైల్వే మరియు సిఐఐ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం


2030 నాటికి "నికర జీరో కార్బన్ ఉద్గార" లక్ష్యాన్ని నిర్దేశించుకున్న భారతీయ రైల్వే

Posted On: 05 JAN 2024 3:24PM by PIB Hyderabad

జీహెచ్‌జీ ఉద్గారాలను తగ్గించే ఇంధనం మరియు నీటి వినియోగాన్ని తగ్గించేందుకు భారతీయ రైల్వేలు భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఐఆర్‌ మరియు సిఐఐ వరుసగా మూడవసారి తమ ఎమ్ఒయుని పునరుద్ధరించాయి.

 

image.png


2024 జనవరి 4న జరిగిన ఈ ఎంఓయూ కార్యక్రమంలో  శ్రీ. శైలేంద్ర సింగ్, ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్/ఎంఈ(ఈఎన్‌హెచ్‌ఎమ్‌ & ప్రాజెక్ట్), రైల్వే. బోర్డు మరియు శ్రీమతి. సీమా అరోరా, డిప్యూటీ డైరెక్టర్ జనరల్, సిఐఐ  శ్రీమతి జయ వర్మ సిన్హా, ఛైర్మన్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, రైల్వే బోర్డు మరియు బోర్డు సభ్యులు మరియు ఇతర సీనియర్ అధికారులు పాల్గొన్నారు.

భారతదేశంలో రవాణా రంగంలో ప్రధాన వాటాదారుగా ఉన్న భారతీయ రైల్వే పర్యావరణ పరిరక్షణ బాధ్యతను కూడా తీసుకుంది. ఇందులో భాగంగా 2030 సంవత్సరం నాటికి "నికర శూన్య కార్బన్ ఉద్గార" లక్ష్యాన్ని రైల్వే నిర్దేశించుకుంది. భారతీయ రైల్వేలు గణనీయమైన సంఖ్యలో రైల్వే స్టేషన్లు, ఉత్పత్తి యూనిట్లు, ప్రధాన వర్క్‌షాప్‌లు మరియు ఇతర సంస్థలను కలిగి ఉన్నాయి. వీటి కోసం పర్యావరణ పరిరక్షణ లక్ష్యంతో వివిధ హరిత కార్యక్రమాలు చేపట్టబడ్డాయి మరియు కార్బన్ పాదముద్రలను తగ్గించడం వీటి లక్ష్యం.

భారతీయ రైల్వేలో హరిత కార్యక్రమాలను ప్రోత్సహించడానికి మరియు సులభతరం చేయడానికి సిఐఐ జూలై 2016 నుండి ఐఆర్‌తో చురుకైన భాగస్వామిగా ఉంది. మొదటి అవగాహన ఒప్పంద పత్రం 2016 సంవత్సరంలో 03 సంవత్సరాలకు సంతకం చేయబడింది మరియు దాని గడువు ముగిసిన తర్వాత మరో 03 సంవత్సరాలకు 2019 సంవత్సరంలో మరొక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

పైన పేర్కొన్న 02 అవగాహన ఒప్పందాల క్రింద ఇప్పటివరకు గణనీయమైన పురోగతి సాధించబడింది:

 

  • ఉత్పాదక సౌకర్యాలు మరియు రైల్వే వర్క్‌షాప్‌లలో శక్తి సామర్థ్యం: ఈ చొరవ ఫలితంగా 210 లక్షల కెడబ్ల్యుహెచ్‌ శక్తి ఆదా కాగా మరియు రూ. 16 కోట్ల నగదు ఆదా అయింది. ఫలితంగా జీహెచ్‌జి ఉద్గారాలను 18000 టన్నుల సిఓ2 గణనీయంగా తగ్గించింది.
  • గ్రీన్‌కో రేటింగ్: ఈ కార్యక్రమం 75 రైల్వే యూనిట్లలో (వర్క్‌షాప్‌లు & తయారీ సౌకర్యాలు) అమలు చేయబడింది మరియు వాటి పర్యావరణ పనితీరును గణనీయంగా మెరుగుపరిచింది.
  • గ్రీన్ రైల్వే స్టేషన్లు: దాదాపు 40 స్టేషన్లు గ్రీన్ సర్టిఫికేట్ సాధించాయి మరియు సంవత్సరానికి 22 మిలియన్ కెడబ్ల్యూహెచ్‌ శక్తిని మరియు 3 బిలియన్ లీటర్ల నీటిని ఆదా చేయడం ద్వారా గణనీయమైన మెరుగుదలలను ప్రదర్శించాయి.
  • హరిత భవనాలు, ఆసుపత్రులు, పాఠశాలలు మరియు కాలనీలు: పరిపాలనా భవనాలు, ఆసుపత్రులు, పాఠశాలలు మరియు కాలనీలతో సహా 40 భవన సౌకర్యాలు గ్రీన్ సర్టిఫికేషన్ సాధించడానికి సులభతరం చేయబడ్డాయి.
  • కెపాసిటీ బిల్డింగ్ మరియు స్కిల్ డెవలప్‌మెంట్: 20కి పైగా కొత్త టెక్నాలజీ సప్లయర్‌లు పరిచయం చేయబడ్డాయి, దాదాపు 150 మంది ఐఆర్‌ అధికారులు భారతదేశంలోని 06 అత్యుత్తమ ఇంధన సామర్థ్య ప్రైవేట్ రంగ ప్లాంట్‌లను బహిర్గతం చేశారు. అలాగే, దాదాపు 900 మంది ఐఆర్‌ అధికారులు ఇంధన సామర్థ్యానికి సంబంధించిన వివిధ అంశాలపై శిక్షణ పొందారు.

రైల్వే బోర్డు ఛైర్మన్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీమతి  జయ వర్మ సిన్హా పునరుద్ధరించబడిన సహకారం గురించి ఆశావాదాన్ని వ్యక్తం చేస్తూ "భారతీయ రైల్వే స్థిరమైన పద్ధతుల పట్ల తన నిబద్ధతను నిలకడగా ప్రదర్శిస్తోందన్నారు.సిఐఐ-జిబిసితో ఈ పునరుద్ధరణ ఎమ్ఒయు  సమిష్టి లక్ష్యాన్ని సాధించే దిశగా ఒక ముఖ్యమైన దశను సూచిస్తుంది. భారతీయ రైల్వే యొక్క 'ప్లానింగ్, డిజైన్, డెవలప్‌మెంట్ మరియు ఆపరేషన్స్'లో ప్రాథమికంగా చేర్చబడిన గ్రీన్ అత్యంత అవసరమైన ఎంపిక అని ఆమె స్పష్టం చేశారు.

సిఐఐ  డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీమతి సీమా అరోరా మాట్లాడుతూ హరిత చర్యలను అమలు చేయడం, ఇంధనం మరియు నీటి వినియోగాన్ని తగ్గించడం మరియు నిర్మిత వాతావరణంలో స్థిరమైన పద్ధతులను ప్రోత్సహించడంలో భారతీయ రైల్వే ప్రయత్నాలను ప్రశంసించారు. సుస్థిర అభివృద్ధిని నడిపించడంలో ఈ భాగస్వామ్య యొక్క ప్రాముఖ్యతను ఆమె నొక్కిచెప్పారు. "భారతీయ రైల్వేలతో మా పునరుద్ధరించబడిన భాగస్వామ్యం నికర జీరో ఫ్రేమ్‌వర్క్ వైపు వ్యూహాత్మక మార్పును సూచిస్తుంది. ఈ ప్రపంచ సుస్థిరత లక్ష్యాలతో కూడిన ఈ కార్యక్రమం పచ్చని, పరిశుభ్రమైన మరియు మరింత స్థిరమైన భవిష్యత్తును సృష్టించేందుకు మా అంకితభావాన్ని నొక్కి చెబుతుంది. రాబోయే తరాలకు మరింత పర్యావరణ బాధ్యతాయుతమైన రైల్వే నెట్‌వర్క్‌కు మార్గం సుగమం చేసే అత్యాధునిక పరిష్కారాలను అమలు చేయడానికి మేము ఎదురుచూస్తున్నాము" అని చెప్పారు.

ఈ ఎమ్ఒయు కింద ఇప్పటికే చేపట్టిన కార్యక్రమాలతో పాటు, కొత్త/సంబంధిత సాంకేతికతలను తీసుకురావడం మరియు దాని అమలు, వర్క్‌షాప్‌లు/ఉత్పత్తి యూనిట్ల ఐఎస్‌ఓ 50001 సర్టిఫికేషన్‌ను సాధించడంలో సహాయం, నెట్-జీరో ఎనర్జీ రైల్వే స్టేషన్ ఫ్రేమ్‌వర్క్ అభివృద్ధి మరియు సమాచార డ్యాష్‌బోర్డ్‌కు సిఐఐ సహకరిస్తుంది. ఐఆర్‌ మరియు సిఐఐ  సంయుక్తంగా తీసుకున్న  హరిత కార్యక్రమాల పురోగతిని హైలైట్ చేయడానికి కూడా రూపొందించబడింది.

 

****


(Release ID: 1993877) Visitor Counter : 110


Read this release in: English , Urdu , Hindi , Tamil