మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

అంగన్ వాడీ కమ్ శిశు గృహాల (పల్నా) పై జాతీయ కార్యక్రమం


అసంఘటిత రంగంలో పనిచేసే మహిళలు ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి వారిని కేంద్ర ప్రభుత్వ అంగన్ వాడీ కమ్ శిశుగృహ

(క్రెచ్) పథకానికి అనుసంధానం చేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరిన కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ

పల్నా కింద అంగన్ వాడీ కమ్ క్రెచ్ పై సమగ్ర స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ విడుదల

ప్రభుత్వం 17000 క్రెచ్ లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటి వరకు 5222కు ఆమోదం

పల్నా పథకం కింద ప్రస్తుతం ఉన్న అంగన్ వాడీ వర్కర్లు, అంగన్ వాడీ హెల్పర్లతో పాటు మరో ఇద్దరు క్రెచ్ వర్కర్లు, హెల్పర్ల నియామకం

Posted On: 22 DEC 2023 9:07AM by PIB Hyderabad

పల్నా కింద అంగన్వాడీ కమ్ క్రెచ్ పై పథకానికి సంబంధించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ)ను విడుదల చేయడానికి జాతీయ స్థాయి కార్యక్రమం ఈ రోజు (డిసెంబర్ 21, 2023) న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగింది. పల్నా పథకం కింద అంగన్ వాడీ కమ్ క్రెచ్ కార్యక్రమం సవరణలకు లోనైంది.   ఏప్రిల్ 2022 నుండి ప్రారంభమయ్యే మిషన్ శక్తి  సహ-అమర్త్య సబ్ కాంపోనెంట్ లో భాగంగా చేర్చబడింది. నాణ్యమైన శిశు సంరక్షణ సౌకర్యాల డిమాండ్ ను తీర్చడం, మహిళలు శ్రామిక శక్తిలో చురుకుగా పాల్గొనేలా చేయడం అంగన్ వాడీ-కమ్-క్రెచ్ ల ప్రధాన లక్ష్యం.

కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి, మైనారిటీ వ్యవహారాల మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ అధ్యక్షతన భారత ప్రభుత్వ మహిళా శిశు అభివృద్ధి, ఆయుష్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ముంజ్పారా మహేంద్రభాయ్ సమక్షంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో భారత ప్రభుత్వ మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ ఇందేవర్ పాండే, భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి ఆర్తి అహుజా; భారత ప్రభుత్వ కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ఇందర్ దీప్ సింగ్ ధరివాల్, భారత ప్రభుత్వ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగం సంయుక్త కార్యదర్శి శ్రీమతి రాజుల్ భట్ తదితరులు క పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో ఎంఓడబ్ల్యూసీడీకి చెందిన సీనియర్ అధికారులు, రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, సీడీపీవోలు, మహిళా సూపర్ వైజర్లు, అంగన్ వాడీ వర్కర్లు, పౌర సమాజ సంస్థల నిపుణులు కూడా పాల్గొన్నారు.

ఎండబ్ల్యుసిడి కార్యదర్శి ఇందేవర్ పాండే తన పరిచయ ప్రసంగంలో,  శఅంగన్ వాడీ కమ్ క్రెచ్ (పల్నా) పథకం ముఖ్యంగా కుటుంబ సభ్యుల నుండి పిల్లల సంరక్షణకు మద్దతు లభించని పట్టణ ప్రాంతాల్లో ఉన్న అంతరాన్ని పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకుందని, ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యాన్ని సులభతరం చేయడానికి సంస్థాగత మద్దతు అవసరమని పేర్కొన్నారు. పల్నా పథకం కింద ప్రస్తుతం ఉన్న అంగన్ వాడీ కార్యకర్తలు, అంగన్ వాడీ హెల్పర్లతో పాటు అదనంగా ఇద్దరు క్రెచ్ వర్కర్లు, హెల్పర్లను నియమించనున్నట్లు తెలిపారు.

2022 నాటికి శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం 37 శాతానికి పెరిగిందని భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి ఆర్తి అహుజా చెప్పారు. మహిళల భాగస్వామ్యం గ్రాఫ్ ఇప్పుడు పెరుగుతోందని, శ్రామిక శక్తిలో మహిళలకు భాగస్వామ్యాన్ని కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్, 2017లో చేర్చి, సవరించిన వివిధ నిబంధనల్లో మహిళా శ్రామిక భాగస్వామ్యానికి తోడ్పడాలనే ప్రభుత్వ సంకల్పం స్పష్టంగా కనిపిస్తోంది.

శ్కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి ఇందర్ దీప్ సింగ్ ధరివాల్ మాట్లాడుతూ,  సామాజిక రంగంలో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ( సిఎస్ఆర్) ప్రాముఖ్యతను వివరించారు. సానుకూల సామాజిక మార్పును నడిపించడంలో వ్యాపారాల సామర్థ్యాన్ని గుర్తించడం నుండి ఈ దృష్టి ఉద్భవిస్తుంది. కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ సంయుక్త కార్యదర్శి రాజుల్ భట్ మాట్లాడుతూ,  కుటుంబ స్నేహపూర్వక పని ప్రదేశాలను పెంపొందించాల్సిన అవసరాన్ని, దేశ నిర్మాణంలో మహిళల భాగస్వామ్యాన్ని సులభతరం చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

ఈ సందర్భంగా పథకం సారాంశాన్ని, దాని విశేషాలను తెలిపే లఘు చిత్రాన్ని ప్రదర్శించారు. అంగన్ వాడీ కమ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ ఒ పి)ని కూడా శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ విడుదల చేశారు. ఎస్ ఒ పి పథకం నిర్వహణ,   అమలు కోసం ఒక సమగ్ర ఫ్రేమ్వర్క్ ను వివరిస్తుంది, ఇందులో పరిపాలనా శ్రేణి, కార్మికుల పాత్రలు, బాధ్యతలు , మానిటరింగ్ చెక్ లిస్టు ఉన్నాయి. అంగన్ వాడీ కమ్ క్రెచ్ లు విజయవంతంగా ,  సమర్థవంతంగా పనిచేయడానికి, కమ్యూనిటీ మొత్తం శ్రేయస్సుకు దోహదపడటానికి ఎస్ ఒ పి S ఒక ముఖ్యమైన సాధనంగా పనిచేస్తుంది.

డాక్టర్ ముంజ్పారా మహేంద్రభాయ్ మహిళల ఆర్థిక సాధికారతను సులభతరం చేయడంలో మంత్రిత్వ శాఖ వివిధ ప్రయత్నాలను వివరించారు.. 17000 క్రెచ్ లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, అందులో ఇప్పటి వరకు 5222 క్రెచ్ లకు ఆమోదం లభించిందని తెలిపారు. మహిళల్లో శ్రామికశక్తి భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో అంగన్ వాడీ కమ్ క్రెచ్ కీలక పాత్ర పోషిస్తుందని, తద్వారా భారత్ ఆర్థికాభివృద్ధిపై గణనీయమైన ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు.

 

కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ మాట్లాడుతూ, మహిళలకు నాణ్యమైన శిశు సంరక్షణ ఆవశ్యకతను నొక్కిచెప్పారు, "జీవనోపాధిని సంపాదించే మహిళ, తన సొంత ఇంటిని వదిలి వేరొక చోట పనిచేయడం, వ్యవసాయ కూలీగా పనిచేసే మహిళ, భవన నిర్మాణ కార్మికురాలిగా పనిచేసే మహిళలకు పల్నా కింద , ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొనే అవకాశాన్నికల్పించడం తమ తొలి ప్రాధాన్యమ ని తద్వారా ఆమె తన జీవనోపాధితో పాటు తన పిల్లలకు సురక్షితమైన,  భద్రత కలిగిన  వాతావరణాన్ని అందించ గలుగుతుందని చెప్పారు. ప్రతిపాదిత 17000 శిశుగృహాలను పరిమితిగా పరిగణించవద్దని ఆమె రాష్ట్ర / జిల్లా అధికారులకు, సిఎస్ఒ ఆలోచనా నాయకులకు విజ్ఞప్తి చేశారు. ప్రతిపాదిత అంగన్ వాడీ కేంద్రాల సంఖ్య కంటే ఎక్కువ తెరవాలనుకునే రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందన్నారు. ఆయా ప్రాంతాల్లోని నిర్మాణ స్థలాలపై  మదింపు నిర్వహించాలని, సంఘటిత, అసంఘటిత రంగంలో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉన్న పట్టణ, నగర శివారు  ప్రాంతాలను మ్యాపింగ్ చేయాలని, తద్వారా శిశుగృహాల నిర్మాణానికి అనువైన స్థలాలను గుర్తించాలని ఆమె రాష్ట్రాలను ఆదేశించారు.

ప్రైవేటు హోదాలో ఈ రంగంలో సేవలందించాలనుకునే వారి ద్వారా పిల్లల భద్రత, ఆరోగ్య అవసరాలు, పౌష్టికాహారాన్ని నిర్ధారించే ఈ కార్యక్రమం కోసం రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి మంత్రిత్వ శాఖ ఒక ఫ్రేమ్ వర్క్ ను అందిస్తుందని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ప్రతిపాదించారు. మహిళలకు ఆర్థిక అవకాశాలు కల్పించడంలో చైల్డ్ కేర్ రంగం సామర్థ్యాన్ని ఆమె నొక్కి చెప్పారు. పిల్లలను దోపిడీ/ఉల్లంఘనలకు గురిచేసే లెక్కలు చూపని, నమోదు కాని సంస్థలను మూసివేయడానికి ప్రధాని చేస్తున్న ప్రయత్నాలను ఆమె వివరించారు. అటువంటి సంస్థలు ఉనికిలో ఉండవని నిర్ధారించడానికి, అటువంటి సంస్థలలో పనిచేసే పురుషులకే కాకుండా మహిళలకు కూడా పోలీసు ధృవీకరణ తప్పనిసరి అని ఆమె తెలిపారు.

ఈ కార్యక్రమం రెండవ భాగంలో రెండు ప్యానెల్ చర్చలు జరిగాయి. 'కేర్ ఎకానమీ: కేర్ టు ఎంపవర్మెంట్' అనే అంశంపై జరిగిన ప్యానెల్ డిస్కషన్  పరివర్తనాత్మక సంరక్షణ విధానాలు పిల్లలు, వృద్ధులు, వికలాంగులకు సానుకూల ఆరోగ్య, ఆర్థిక, లింగ సమానత్వ ఫలితాలను ఇవ్వగలవని ప్రముఖంగా చాటింది. ఇది మహిళల ఉపాధికి మార్గం సుగమం చేస్తుంది . కుటుంబంలో పురుషులకు సంరక్షణ పాత్రలను పెంచుతుంది. కేర్ ఎకానమీని బలోపేతం చేయడానికి దేశంలో కేర్ వర్క్ పై నైపుణ్యాలు,  కోర్సులను అందించాల్సిన ఆవశ్యకతపై ప్యానెల్ చర్చించింది. సంరక్షణ పని పై అవగాహన , సంరక్షణ పనితో సంబంధం ఉన్న ఆర్థిక అవకాశాలను ఏకీకృతం చేసే లింగ సున్నితమైన విధాన సాధనాల అవసరాన్ని కూడా ఈ చర్చ స్పష్టంగా చెప్పింది. శ్రామిక శక్తిలోకి మహిళల ప్రవేశాన్ని సులభతరం చేయడానికి, వేతనం లేని సంరక్షణ , ఇంటి పనిభారాన్ని తగ్గించడానికి, వారి సంపూర్ణ శ్రేయస్సును రక్షించడానికి సమర్థవంతమైన సంరక్షణ-పని పర్యావరణ వ్యవస్థను సృష్టించడం చాలా ముఖ్యం. వేతనం లేని సంరక్షణ పని వల్ల ప్రబలమైన భారాన్ని ఎదుర్కోవటానికి సరసమైన, సులభంగా అందుబాటులో ఉన్న శిశు సంరక్షణ , వృద్ధుల సంరక్షణ సౌకర్యాలలో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇవ్వడం ఈ సూచనలో ఉంది. మహిళా శిశు సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి, ఆర్థిక సలహాదారు నితీశ్వర్ కుమార్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కార్యదర్శి ప్రొఫెసర్ మనీష్ ఆర్ జోషి, భారత్ లోని ఐక్యరాజ్యసమితి మహిళా కార్యాలయం డిప్యూటీ కంట్రీ రిప్రజెంటేటివ్ శ్రీమతి కాంత సింగ్,  జెండర్ మెయిన్ స్ట్రీమింగ్ లో ఆర్థికవేత్త శ్రీమతి మిథాలీ నికోర్,  భారత పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) చైర్ పర్సన్ రుమ్జుమ్ ఛటర్జీ,   ఫిక్కీ అదనపు సెక్రటరీ జనరల్ శ్రీమతి జ్యోతి విజ్ ప్యానెల్ డిస్కషన్ కు ప్యానలిస్టులుగా వ్యవహరించారు.

రెండో విడత ప్యానెల్ డిస్కషన్ లో 'డే కేర్ సెంటర్లు, శిశుగృహాల అమలులో జోక్యం' అనే అంశంపై చర్చించారు. ప్రభుత్వ పథకాల అభివృద్ధి ప్రక్రియ, ప్రభుత్వ కార్యక్రమాల్లో డే కేర్ సెంటర్ల సంస్థాగతీకరణ దిశగా చర్చ జరిగింది. పెద్ద ఆడపిల్లలకు  ముఖ్యంగా కుమార్తెలకు విద్యలో కొనసాగింపును నిర్ధారించడానికి పాఠశాల ప్రాంగణాలకు ఆనుకొని ఉన్న శిశుగృహాలు వంటి కమ్యూనిటీ చైల్డ్ కేర్ నమూనాలపై వివిధ రాష్ట్రాల ఉత్తమ పద్ధతులను ప్యానెల్ వివరించింది. అధికారిక ఉపాధి అవకాశాల కల్పనకు కేర్ ఎకానమీ రంగంలో వృద్ధి ప్రాముఖ్యతను, అలాగే పాఠ్యప్రణాళిక, నైపుణ్య పురోగతి, ఉద్యోగ కల్పనతో సహా సహాయక మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాముఖ్యతను ప్యానలిస్ట్ నొక్కి చెప్పారు. నిబంధనలకు అనుగుణంగా సురక్షితమైన ప్రదేశాలను ఎంచుకోవడం పిల్లల భద్రతకు మరింత భరోసా ఇస్తుంది. అదనంగా, మానసిక లేదా శారీరక వైకల్యాలు ఉన్న పిల్లల కోసం ప్రత్యేక సంరక్షణ పథకాలను ప్రతిపాదించడం ఈ సంరక్షణ వాతావరణంలో సమ్మిళితను నిర్ధారిస్తుంది. మహిళా శిశు సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ ప్రీతం బి.యశ్వంత్, హర్యానా ప్రభుత్వ మహిళా శిశు సంక్షేమ శాఖ కమిషనర్ అండ్ సెక్రటరీ శ్రీమతి అమ్నీత్ పి కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, మొబైల్ క్రెచెస్ సుమిత్రా మిశ్రా, సోషల్ పాలసీ స్పెషలిస్ట్, భారతదేశానికి యునిసెఫ్ ప్రతినిధి శ్రీమతి వీణా బందోపాధ్యాయ, బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ ఇండియా కంట్రీ ఆఫీస్ డైరెక్టర్ సాచి భల్లా తదితరులు డే కేర్ సెంటర్లు/క్రెచ్ ల అమలులో జోక్యంపై జరిగిన ప్యానెల్ డిస్కషన్ లో పాల్గొన్నారు.

న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో అంగన్ వాడీ - కమ్ - క్రెచ్ (మిషన్ శక్తి) పై జాతీయ కార్యక్రమంలో గౌరవ మంత్రి @smritiirani.



(Release ID: 1989767) Visitor Counter : 105