జల శక్తి మంత్రిత్వ శాఖ
మురుగు నిర్వహణ కోసం ట్రీట్మెంట్ ప్లాంట్లు
Posted On:
18 DEC 2023 1:52PM by PIB Hyderabad
కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డ్ (సి.పి.సి.బి.) అందించిన సమాచారం మేరకు మొత్తం 67,988 పరిశ్రమలు ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు (ఈటీపీలు) అవసరమయ్యే పరిశ్రమలలో.. 66,053 పరిశ్రమలకు ఫంక్షనల్ ఈటీపీలు పని చేస్తున్నాయి. సంబంధిత అధికారుల సమాచారం మేరకు.. 1,935 పరిశ్రమలు ఈటీపీలు లేకుండా పనిచేస్తున్నట్లు గుర్తించబడ్డాయి. ప్రస్తుతం, దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాలు/యుటీలలో మొత్తం 201 సీఈటీపీలు పనిచేస్తున్నాయి, వీటి డిజైన్ సామర్థ్యం 1917 ఎంఎల్డీ మరియు కార్యాచరణ సామర్థ్యం 1137 ఎంఎల్డీ. సీపీసీబీ /పీసీసీలు మరియు స్థానిక సంస్థల సహాయంతో ఎప్పటికప్పుడు దేశంలో అందుబాటులో ఉన్న మురుగు ఉత్పత్తి మరియు దాని శుద్ధి వ్యవస్థను కూడా సీపీసీబీ అంచనా వేస్తోంది. హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ (ఎం.ఎ.హెచ్.యు.ఎ.), దాని జాతీయ మిషన్లు అంటే.. అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ (అమృత్) & అమృత్ 2.0 ద్వారా మురుగునీటి నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలకు మద్దతునిస్తోంది. అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ (అమృత్) పథకం జూన్ 2015లో దేశంలోని 500 నగరాల్లో నీటి సరఫరా, మురుగునీరు & సెప్టేజీ నిర్వహణ, తుఫాను నీటి పారుదల, మోటారు అవాంతరాలు లేని పట్టణ రవాణా మరియు గ్రీన్ స్పేస్ & పార్కుల ప్రాథమిక మౌలిక సదుపాయాలను అందించడానికి ప్రారంభించబడింది. మురుగునీటి పారుదల మరియు సెప్టేజీ నిర్వహణ రంగం అమృత్ కింద మిషన్ భాగాలలో ఒకటి. ఇప్పటివరకు, రూ. 34,303 కోట్ల విలువైన 865 ప్రాజెక్టులు అందుబాటులోకి తేబడ్డాయి, ఇందులో రూ.16,257 కోట్ల విలువైన 637 పూర్తయిన ప్రాజెక్టులు ఉన్నాయి. ఇంకా, ఎస్.టి.పి.ల కెపాసిటీ 3,685 ఎంఎల్డీ సృష్టించబడింది, మరో 2,546 ఎంఎల్డీ సామర్థ్యం గల ఎస్టీపీల ఏర్పాటు పురోగతిలో ఉంది. అమృత్ 2.0 కింద, 1 అక్టోబర్ 2021న దేశంలోని అన్ని చట్టబద్ధమైన పట్టణాలను కవర్ చేస్తూ, నీటి సరఫరా యొక్క సార్వత్రిక కవరేజీని నిర్ధారించడానికి & నగరాలను ‘వాటర్ సురక్షిత’గా మార్చడానికి, 500 అమృత్ నగరాల్లో మురుగునీరు & సెప్టేజీ నిర్వహణ యొక్క సార్వత్రిక కవరేజీని నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటివరకు, ఆమోదించబడిన ప్రాజెక్టుల ద్వారా 4,814 ఎంఎల్డీ ఎస్టీపీ సామర్థ్యాన్ని ప్రతిపాదించారు. సీపీసీబీ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది మరియు ఎఫ్ల్యూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లు (ఈటీపీలు) అవసరమయ్యే పరిశ్రమలు ఫంక్షనల్ ఈటీపీలను కలిగి ఉంటేనే వాటిని నిర్వహించడానికి అనుమతించాలని ఎస్.పి.సి.బిలు/పీసీసీలను ఆదేశించింది. ఈ ప్రయోజనం కోసం (i) ఫంక్షనల్ ఈటీపీలు లేకుండా పనిచేస్తున్న అటువంటి పరిశ్రమలను ఎస్.పి.సి.బిలు/పీసీసీలను వేంటనే మూసివేస్తాయి. (ii) అటువంటి డిఫాల్ట్ పరిశ్రమల యొక్క విద్యుత్ మరియు నీటి సరఫరా అవసరమైతే, డిస్కనెక్ట్ చేయబడుతుంది. సి.పి.సి.బి. వారి సంబంధిత రాష్ట్రాలు/యుటీలలో మురుగునీటి నిర్వహణ కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళికల రూపకల్పన చేయాలని పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలకు తెలియజేసింది. ఈ విషయాన్ని జలశక్తి శాఖ సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ ఈరోజు రాజ్యసభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాచారంలో తెలిపారు.
***
(Release ID: 1987863)