సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర లబ్ధిదారులతో ప్రధాని సంభాషించారు


అస్సాంకు చెందిన లబ్ధిదారుడు తన విజయగాథను ప్రధానమంత్రితో పంచుకున్నారు

సామాజిక సేవ పట్ల తనకున్న ఉత్సాహంతో కళ్యాణి రాజ్‌బొంగ్షి ప్రధానమంత్రిని ఆకట్టుకున్నారు

అస్సాం నుండి ప్రధానమంత్రి కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించిన కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ మరియు కిరణ్ రిజిజు

Posted On: 16 DEC 2023 7:28PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర  లబ్దిదారులతో సంభాషించారు మరియు ప్రసంగించారు. ఈ యాత్రలో ఇది మూడవ పరస్పర చర్య. స‌మావేశాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, విబిఎస్‌వై  నెలరోజుల యాత్ర ప‌ర్య‌ట‌న‌లో వేలాది గ్రామాలతో పాటు 1500 చిన్న నగరాలు మరియు పట్టణాలతో నగరాలను సందర్శించిదని తెలియజేశారు.

 

విబిఎస్‌వై ప్రయాణ యాత్ర సందర్భంగా, ప్రధాన మంత్రి గ్రామీణ ప్రాంతాల ప్రజలతో సంభాషించారు, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, సహజ వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ యొక్క అంశాలు మరియు భారతదేశ గ్రామాలను అభివృద్ధి చేయడం గురించి మాట్లాడారు. నేటి కార్య‌క్ర‌మంలో ప‌ట్ట‌ణ ప్రాంతాల‌కు చెందిన ప్ర‌జ‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొనడాన్ని ప్ర‌స్తావిస్తూ, వర్తమాన దృష్టి ప‌ట్ట‌ణాభివృద్ధిపైనే ఉంటుంద‌ని ప్ర‌ధాన మంత్రి మోడీ అన్నారు.

 

అస్సాంతో సహా దేశవ్యాప్తంగా వేలాది మంది విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో చేరారు.

                                                          

గౌహతిలోని నూన్‌మతికి చెందిన శ్రీమతి కళ్యాణి రాజ్‌బోంగ్షి, తన అనుభవాన్ని ప్రధానమంత్రితో పంచుకున్నారు. డే నుల్మ్ , పీ ఎం ఎఫ్ ఎం ఈ  వంటి ప్రభుత్వ పథకాలు తన జీవితాన్ని గృహిణి నుండి స్వావలంబన కలిగిన మహిళగా ఎలా మార్చాయో వివరించింది. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలను పొందడం ద్వారా తన ప్రయాణాన్ని ప్రారంభించినట్లు ఆమె తెలియజేసింది. ఆమె మొదట రూ. 10,000 ల రివాల్వింగ్ ఫండ్‌తో పుట్టగొడుగుల యూనిట్‌ను ప్రారంభించారు.  ఆ తర్వాత ఆమె ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ప్రారంభించింది. దీని తరువాత,  200 మంది మహిళలతో ఏరియా స్థాయి సమాఖ్యను ఆమె స్థాపించింది. తన ప్రయాణం గురించి మరింత మాట్లాడుతూ, ఆమె తన ప్రాంతంలోని ఇతర మహిళలను ఎస్‌హెచ్‌జిలలో చేర్చడానికి మరియు వివిధ ప్రభుత్వ పథకాల కింద బ్యాంకు రుణాలు పొందడానికి తను ఎలా స్ఫూర్తి ప్రేరణ ఇచ్చిందో చెప్పారు.

 

పీ ఎం స్వానిధి పథకం నుండి లబ్ధి పొందేందుకు విక్రేతలకు అవగాహన కల్పించినందుకు ప్రతిష్టాత్మక అస్సాం రాష్ట్ర పౌర పురస్కారం 'అస్సాం గౌరవ్ అవార్డు' అందుకున్నట్లు శ్రీమతి రాజ్‌బొంగ్షి ప్రధానికి తెలియజేశారు.

 

వీబీఎస్‌వై ఐఈసీ వ్యాన్ గురించి తన అనుభవాన్ని పీఎం శ్రీ మోదీ అడిగినప్పుడు, తమ ప్రాంత ప్రజలు వ్యాన్‌ను ఉత్సాహంగా స్వాగతించారని, దాని వల్ల సమాచారాన్ని ప్రయోజనాలను పొందుతున్నారని ఆమె బదులిచ్చారు. ప్రధానమంత్రి ఆమెను ప్రశంసించారు మరియు ఆమె ఎస్ హెచ్ జీ ద్వారా స్వయం కృషి తో మంచి పని చేయడమే కాదు, ఆమె సమాజానికి కూడా సహాయం చేస్తుందనని  ప్రధానమంత్రి ఆమెను ప్రోత్సహించారు మరియు స్త్రీ ఆత్మనిర్భర్‌ను పొంది సమాజానికి ప్రయోజనం చేకూరుస్తుందనడానికి ఆమె ఒక ఉదాహరణ అని అన్నారు.

 

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక స్థాయి ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అస్సాంలోని పలు ప్రాంతాల్లో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని ఏర్పాటు చేశారు.

 

అస్సాంలో డిబ్రూఘర్ జిల్లాలో విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్రలో ప్రధానమంత్రి  కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూడటానికి  కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్ మరియు జలమార్గాలు మరియు ఆయుష్ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్  పాల్గొన్నారు . శ్రీ సర్బానంద సోనోవాల్ తన ప్రసంగంలో పథకాలు విజయవంతం కావడానికి అర్హులైన లబ్ధిదారులందరికీ చేరవేయడమే వీబీఎస్‌వై లక్ష్యం అని అన్నారు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమర్ధవంతమైన నాయకత్వంలో దేశం నేడు మరింత శక్తిమంతమైన దేశంగా అభివృద్ధి చెందుతోందని ఆయన అన్నారు. “మోడీ కి గ్యారెంటీ” ఐ ఈ సీ వాన్ గురించి మంత్రి మాట్లాడుతూ, దేశంలోని ప్రతి మూలలో ఉన్న ప్రతి లబ్ధిదారుడు ఈ పథకం యొక్క ప్రయోజనాలను పొందేలా వ్యాన్ నిర్ధారిస్తుంది. ప్రతి వ్యక్తి సాధికారత సాధించేందుకు ఈ ప్రభుత్వం గత తొమ్మిదిన్నరేళ్లలో అన్ని కార్యక్రమాలు చేపట్టిందన్నారు. గోలాఘాట్ నుండి ప్రధానమంత్రి  ప్రత్యక్ష ప్రదర్శనలో కేంద్ర భూ శాస్త్రాల మంత్రి శ్రీ కిరెన్ రిజిజు కూడా పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో రాజ‌స్థాన్, మ‌ధ్య‌ప్ర‌దేశ్, చ‌త్తీస్‌గ‌ఢ్, తెలంగాణ మరియు మిజోరాంలో విక్షిత్ భార‌త్ సంక‌ల్ప్ యాత్ర‌ను కూడా ప్ర‌ధాన మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ పథకాల ప్రయోజనాలు నిర్దేశిత లబ్ధిదారులందరికీ సమయానుకూలంగా చేరేలా చూడడం ద్వారా ప్రభుత్వ ఫ్లాగ్‌షిప్ స్కీమ్‌ల సంతృప్తతను సాధించాలనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర చేపట్టబడుతోంది. కేవలం ఒక నెల స్వల్ప వ్యవధిలో, యాత్ర దేశంలోని 68,000 గ్రామ పంచాయతీలలో 2.50 కోట్లకు పైగా పౌరులను చేరుకుంది. ఇంకా, దాదాపు 2 కోట్ల మంది వ్యక్తులు విక్షిత్ భారత్ సంకల్ప్ తీసుకున్నారు మరియు 2 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు ‘మేరీ కహానీ మేరీ జుబానీ’ కార్యక్రమం కింద తమ అనుభవాలను పంచుకున్నారు.

 

***


(Release ID: 1987435)
Read this release in: English , Urdu , Hindi , Assamese