విద్యుత్తు మంత్రిత్వ శాఖ
సుస్థిరమైన ప్రగతి పథం లో రాష్ట్ర-నిర్దిష్ట విద్యుత్ శక్తి పరివర్తన లక్ష్యాలను సాధించడానికి రాష్ట్ర స్థాయి విద్యుత్ శక్తి పరివర్తన కమిటీలు
Posted On:
15 DEC 2023 1:16PM by PIB Hyderabad
ఇంధన పరివర్తనపై ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ (SLSC) ఏర్పాటు కోసం మే 2022లో భారత ప్రభుత్వం, విద్యుత్ మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలను అభ్యర్థించినట్లు కేంద్ర విద్యుత్ మరియు నూతన మరియు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి తెలియజేశారు. విద్యుత్తు, నూతన మరియు పునరుత్పాదక ఇంధనం, గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి, పరిశ్రమలు, రవాణా, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, పర్యావరణం, పీ డబ్ల్యూ డీ మొదలైన శాఖలకు సంబంధించిన కార్యదర్శులతో, రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలలో ఇంధన పరివర్తన చర్యలను నిర్వహించడానికి కమిటీ సభ్యులుగా ఉంటారు.
విద్యుత్ శక్తి పరివర్తన కోసం రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ యొక్క లక్ష్యాలు క్రింది విధంగా ఉన్నాయి:
రాష్ట్ర స్థాయిలో విద్యుత్ శక్తి పరివర్తన యొక్క కీలక అంశాల గుర్తింపు
విద్యుత్ శక్తి పరివర్తన కోసం వ్యూహాత్మక దిశా నిర్దేశం
ఆర్థికాభివృద్ధి, ఉద్యోగాల కల్పన
సంబంధిత రాష్ట్రాల్లో అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులు మరియు పెట్టుబడి అవకాశాలు
నవంబర్ 2023 నాటికి, 23 రాష్ట్రాలు/యుటిలు తమ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఇంధన పరివర్తనపై రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీలను ఏర్పాటు చేశాయి. ఇంధన పరివర్తనపై రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేయడంలో రాష్ట్రాలు ఎటువంటి సవాళ్లను నివేదించలేదు.
విద్యుత్ శక్తి పరివర్తన కోసం రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ యొక్క పాత్రలు మరియు బాధ్యతలు విస్తృతంగా క్రింది విధంగా ఉంటాయి:
రాష్ట్ర-నిర్దిష్ట విద్యుత్ శక్తి పరివర్తన లక్ష్యాలను సాధించడానికి విధాన మార్గదర్శకత్వం మరియు సిఫార్సులను అందించడం.
సుస్థిరమైన వృద్ధిని ప్రారంభించడానికి వ్యూహాత్మక దిశను అందించడం.
పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యాలు మరియు ఇతర మార్గాల ద్వారా సహకారాన్ని సులభతరం చేయడానికి వాటాదారులకు సమావేశ వేదికగా వ్యవహరించడం.
విద్యుత్ శక్తి పరివర్తనకు సంబంధించిన నైపుణ్యాలు మరియు పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి సామర్థ్య పెంపు మరియు పరిశోధనలను కోసం.
స్థానిక సరఫరా గొలుసుల అభివృద్ధిని ప్రోత్సహించడం ద్వారా స్వచ్ఛ విద్యుత్ ప్రాజెక్టులతో అనుబంధించబడిన అనుబంధ పరిశ్రమల వృద్ధిని ప్రోత్సహించడం.
విద్యుత్ శక్తి పరివర్తన కార్యక్రమాల పురోగతిని ట్రాక్ చేయడానికి పర్యవేక్షణ మరియు మూల్యాంకన విధానాలను ఏర్పాటు చేయడం.
ఇంధన పరివర్తన కోసం రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీలు సజావుగా మరియు ప్రభావవంతమైన పనితీరును ప్రారంభించడానికి, కమిటీకి సంబంధించిన నమూనా నిబంధనలని విద్యుత్ మంత్రిత్వ శాఖ వారి సూచనలు అన్ని రాష్ట్రాలు/యూ టీ లకు అందజేసింది.
డిసెంబర్ 14, 2023న లోక్సభలో ఒక ప్రశ్నకు వ్రాతపూర్వక సమాధానంలో కేంద్ర విద్యుత్ మరియు నూతన మరియు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ఆర్.కె.సింగ్ ఈ సమాచారాన్ని అందించారు.
***
(Release ID: 1986981)