పర్యటక మంత్రిత్వ శాఖ

విజయవాడలో ‘కృష్ణవేణి సంగీత నీరాజనం’ను ప్రారంభించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్


మూడు రోజుల శాస్త్రీయ సంగీత మహోత్సవంలో ప్రఖ్యాత సంగీతకారుల శాస్త్రీయ సంగీత ప్రదర్శనలు, ప్రాంతీయ వంటకాల ప్రదర్శన మరియు విక్రయాలు, స్థానిక హస్తకళలు మరియు చేనేత వస్త్రాలు వంటి విభిన్న కార్యకలాపాలు

Posted On: 10 DEC 2023 5:47PM by PIB Hyderabad

కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాలశాఖ మంత్రి శ్రీమతి  నిర్మలా సీతారామన్ ఈ రోజు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో కృష్ణవేణి సంగీత నీరాజనాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్  పర్యాటక శాఖ మంత్రి శ్రీమతి ఆర్కే రోజా, ఏపీ ఆర్థిక శాఖ మంత్రి శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్, పర్యాటక శాఖ కార్యదర్శి శ్రీమతి వి విద్యావతి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రి మాట్లాడుతూ..తెలుగు సంస్కృతి యొక్క అద్భుతమైన వారసత్వాన్ని మరియు అనాదిగా స్వరకల్పనల యొక్క అద్భుతమైన కచేరీలను రూపొందించడంలో  తెలుగు భాష అందించిన విశేషమైన సహకారాన్ని గుర్తుచేసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటిసారిగా గ్రాండ్ మ్యూజిక్ ఫెస్టివల్‌ను నిర్వహించేందుకు తీసుకున్న విశేషమైన కృషికి ఆమె ప్రశంసలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ “ త్యాగరాజు మరియు శ్యామా శాస్త్రి కృతులు వినడం ద్వారా నేను తెలుగు యొక్క అందాన్ని నేర్చుకోవడం మరియు అర్థం చేసుకోవడం ప్రారంభించాను. తెలుగు భాష అందం మెచ్చుకోదగ్గ విషయం. ఈ ప్రాంతంలోని పట్టణాలు మరియు సంస్థానాలు శాస్త్రీయ సంగీతానికి ఎంతో దోహదపడ్డాయి. ఆ అద్భుతమైన సంప్రదాయాలను సజీవంగా మరియు యువ తరానికి తీసుకురావాల్సిన సమయం ఇది. ఇది వార్షిక లక్షణంగా మారాలి. అలాగే రాజమండ్రి, విశాఖపట్నం వంటి ప్రముఖ పట్టణాల్లో కూడా నిర్వహించాలి" అని సూచించారు.

 

image.png

 

image.png

 

కృష్ణవేణి సంగీత నీరాజనం ప్రారంభ ఎడిషన్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు తీసుకువచ్చినందుకు భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ మరియు సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యాటక శాఖ మంత్రి శ్రీమతి ఆర్‌.కె.రోజా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సంగీతం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. యువత శాస్త్రీయ సంగీతాన్ని అభ్యసించాలని కోరారు. కర్ణాటక సంగీతాన్ని ప్రోత్సహించడంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలుగు భాషల సహకారాన్ని కూడా ఆమె హైలైట్ చేశారు.

భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ కార్యదర్శి తన స్వాగత ప్రసంగంలో శాస్త్రీయ సంగీతాన్ని ప్రోత్సహించడంలో తెలుగు భాష సేవలను స్మరించుకోవడానికి ఈ కార్యక్రమం ప్రయత్నిస్తుందని మరియు స్థానిక సంప్రదాయాలను ప్రదర్శించడం మరియు స్థానిక కళాకారులు, చేతిపనులు మరియు వంటకాలను ప్రచారం చేయడం ద్వారా ఈ ప్రాంతానికి సాంస్కృతిక గుర్తింపును నెలకొల్పడం ఈ పండుగ లక్ష్యం అని తెలిపారు.

ఈ మూడు రోజుల శాస్త్రీయ సంగీత మహోత్సవంలో దేశంలోని ప్రఖ్యాత సంగీతకారుల శాస్త్రీయ సంగీత ప్రదర్శనలు మరియు ప్రాంతీయ వంటకాలు, స్థానిక హస్తకళలు మరియు చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు విక్రయాలతో సహా అనేక రకాల కార్యకలాపాలు ఉంటాయి.

ఈ కార్యక్రమంలో అద్భుతమైన భారతీయ శాస్త్రీయ సంగీత వారసత్వం మంత్రముగ్ధులను చేస్తుంది అలాగే నిష్ణాతులైన సంగీత విద్వాంసుల ప్రదర్శనలు కూడా ఉన్నాయి. మొదటి రోజు ఉదయం జరిగిన కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన గోనుగుంటల బ్రదర్స్, శ్రీ జి నాగరాజు మరియు శ్రీ సాయిబాబుల నాగస్వరం నుంచి జాలువారిన  మధురమైన స్వరాలు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రఖ్యాత ద్వయం దెందుకూరి సదాశివఘనపతి మరియు దెందుకూరి కాశీ విశ్వనాథ శర్మలచే వేదపారాయణం మంత్ర ముగ్దులను చేసింది. అలాగే తమిళనాడుకు చెందిన శ్రీ ఉమయాళపురం కె శివరామన్‌చే తాళ వాద్య కచేరి మరియు తమిళనాడుకు చెందిన శ్రీ ఎన్ విజయ్ శివచే ఆకర్షణీయమైన కర్నాటక సంగీత ప్రదర్శన ప్రేక్షకులను అలరించాయి.

 

image.png


మధ్యాహ్నం సెషన్‌లో నిర్వహించిన సంగీత ప్రదర్శనలు చెన్నైకి చెందిన ప్రముఖ కళాకారిణి రాధా భాస్కర్ శ్రీ త్యాగరాజు తెలుగు స్వరకల్పనలో కృతులపై దృష్టి సారించే కృత్తిక ఉపన్యాసాలు, కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాల విద్యార్థులచే త్యాగరాజ స్వామి దివ్యనామసంకీర్తనల బృందం ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కేరళ నుండి వచ్చిన డాక్టర్. అశ్వతి మరియు సజన సుధీర్ నేతృత్వంలో మరియు తిరుపతికి చెందిన ముప్పవరపు సింహాచల శాస్త్రిచే మనోహరమైన హరికథా ప్రదర్శన ఆకట్టుకున్నాయి.

 

image.png


సాయంత్రం జరిగిన కార్యక్రమంలో కర్ణాటక సంగీత విభావరి గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, పంతుల రామ, రామకృష్ణ మూర్తి వంటి ప్రముఖ సంగీత విద్వాంసుల ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించారు. శ్రీ పేరి త్యాగరాజు మరియు కళాకారుల బృందం నేతృత్వంలో వీణా వేణువు వయోలిన్‌తో మొదటి రోజు ముగిసింది.

 

image.png


తుమ్మలపల్లి కళాక్షేత్రంలోని పురాతన సంగీత వాయిద్యాల ప్రదర్శన ఈ ఈవెంట్ యొక్క మరొక ప్రత్యేక ఆకర్షణ. ఇది సంగీత విద్వాంసుడు చేసిన ప్రత్యేక చొరవ నుండి సేకరించిన ఖచ్చితమైన సంరక్షించబడిన మరియు పునరుద్ధరించబడిన సంగీత వాయిద్యాల సేకరణను ప్రదర్శిస్తుంది. ఇది పురాతన సంగీత వాయిద్యాలను పునర్నిర్మించడం మరియు పునరుద్ధరించడంపై దృష్టి పెట్టింది.

కార్యక్రమంలో ఏపీ ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ మరియు విజయవాడ సెంట్రల్‌ ఎమ్మెల్యే శ్రీ మల్లాది విష్ణు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, సంగీత నాటక అకాడమీ చైర్మన్ శ్రీమతి సంధ్యా పురేచా, మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

 

***



(Release ID: 1986114) Visitor Counter : 60