మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

మత్స్య సంపద, ఆక్వాకల్చర్ స్థిరమైన వృద్ధికి అంతర్జాతీయ సహకారం కోసం పిలుపునిచ్చిన రౌండ్ టేబుల్ సదస్సు

Posted On: 21 NOV 2023 8:50PM by PIB Hyderabad

గ్లోబల్ ఫిషరీస్ కాన్ఫరెన్స్ ఇండియా 2023లో కేంద్ర ఫిషరీస్ మంత్రి శ్రీ పర్షోత్తమ్ రూపాల నేతృత్వంలోని అంతర్జాతీయ రౌండ్ టేబుల్ సమావేశం మత్స్య మరియు ఆక్వాకల్చర్ రంగం యొక్క స్థిరమైన వృద్ధికి దేశాల మధ్య సహకారం కోసం పిలుపునిచ్చింది.

 

image.png


సాంకేతికత మరియు ఆక్వాకల్చర్‌లో అధునాతన సాంకేతికతలు మరియు నైపుణ్యం కలిగిన ఇతర దేశాలు మరియు సంస్థలతో భాగస్వామ్యం చేయడం భారత మత్స్య రంగాన్ని మెరుగుపరచడానికి గొప్పగా సహాయపడుతుందని సమావేశం సూచించింది.

సదస్సులో కేంద్ర మంత్రి శ్రీ పర్షోత్తమ్ రూపాలా మాట్లాడుతూ ప్రపంచ నైపుణ్యం మరియు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని మత్స్యకారులకు జిపిఎస్ సిస్టమ్‌ను యూజర్ ఫ్రెండ్లీగా మార్చాలని అన్నారు. సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులకు సముద్ర నావిగేషన్ నిజంగా ప్రయోజనకరంగా ఉండాలంటే తక్కువఖర్చుతో కూడుకున్న మరియు నమ్మదగిన సాంకేతికతలు అవసరమని మంత్రి చెప్పారు.

 

image.png


“డేటా సేకరణ మరియు డేటా షేరింగ్‌లో గ్లోబల్ ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌లు మత్స్య రంగాన్ని మెరుగుపరచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని శ్రీ రూపాలా చెప్పారు. సహకారం మరియు పరిజ్ఞాన మార్పిడిని పెంపొందించడం ద్వారా ఈ ప్రోగ్రామ్‌లు ఉత్తమ అభ్యాసాలను స్వీకరించడానికి, స్థిరమైన వనరుల నిర్వహణను ప్రోత్సహించడానికి మరియు వాతావరణ మార్పులకు ప్రతిస్పందనగా సమర్థవంతమైన ఉపశమన వ్యూహాలను అభివృద్ధి చేయగలవని తెలిపారు. ఈ సామూహిక విధానం వాతావరణ మార్పులతో తీవ్ర ప్రభావాలకు గురవుతున్న సాంప్రదాయ మత్స్యకారుల జీవనోపాధిని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు.

గ్లోబల్ డేటా ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్‌లు ఫిషరీస్ డేటా యొక్క నాణ్యత మరియు లభ్యతను గణనీయంగా పెంచుతాయి, చేపల నిల్వలు, వలసల నమూనాలు మరియు పర్యావరణ వ్యవస్థ గతిశీలతపై సమగ్ర అవగాహనను అందిస్తాయి” అని కేంద్ర మంత్రి చెప్పారు.

గ్రీస్ రాయబారి శ్రీ డిమిట్రియస్ ఐయోనౌ..తన ప్రసంగంలో పర్యావరణ సుస్థిరతతో చేపలు పట్టడం మరియు ఆక్వాకల్చర్ పద్ధతులను సమన్వయం చేయవలసిన కీలకమైన అవసరాన్ని నొక్కి చెప్పారు. దేశీయ మరియు అంతర్జాతీయ వ్యూహాలను కలిగి ఉన్న బహుముఖ విధానాన్ని తెలిపారు.

 

image.png


ఈ అత్యున్నత స్థాయి సదస్సులో మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ సహాయ మంత్రి సంజీవ్‌కుమార్‌ బల్యాన్‌, డాక్టర్ ఎల్‌ మురుగన్‌, కేంద్ర మత్స్యశాఖ కార్యదర్శి డాక్టర్‌ అభిలాక్ష్‌ లిఖి, గ్రీస్‌, అంగోలా రాయబారులు, ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, ఫ్రాన్స్‌, నార్వే, రష్యా, జింబాబ్వే  దౌత్య ప్రతినిధులు  మరియు ఉత్తర ప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్ మరియు త్రిపుర రాష్ట్ర మత్స్య శాఖ మంత్రులు; యునైటెడ్ నేషన్స్ యొక్క ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఏఓ), బెంగాల్ బే ప్రోగ్రామ్ ఇంటర్-గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ (బిఓబిపి-ఐజీఓ),జీఐజడ్‌ వంటి అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు; ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడిబి);  భారత ప్రభుత్వ ఫిషరీస్ శాఖ సీనియర్ అధికారులు, రాష్ట్ర మత్స్య శాఖల సీనియర్ అధికారులు మరియు వివిధ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థల అధిపతులు పాల్గొన్నారు. వీరికి కేంద్ర మత్స్యశాఖ కార్యదర్శి డాక్టర్ అభిలాక్ష్ లిఖి స్వాగతం పలికారు.

భారతదేశంలో అన్వేషించబడని లోతైన సముద్ర వనరులను ఉపయోగించుకోవడానికి తగిన సాంకేతిక నైపుణ్యాన్ని మార్పిడి చేసుకోవాల్సిన అవసరాన్ని ఫోరమ్ నొక్కి చెప్పింది. దేశం విస్తృతంగా అన్వేషించబడని లోతైన సముద్ర వనరులను కలిగి ఉంది మరియు మత్స్యకారులను మరియు ఓడలను తగిన సాంకేతికతలు మరియు శిక్షణతో సన్నద్ధం చేయడం వలన ఈ ఉపయోగించని వనరులను ఉపయోగించుకోవచ్చు.

రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు అంతర్జాతీయ సహకారం అవసరమయ్యే నాలుగు ప్రధాన రంగాలను గుర్తించారు. అవి ఆహారం మరియు పోషకాహార భద్రతను లక్ష్యంగా చేసుకుని మత్స్య ఉత్పత్తిని పెంచడం, ప్రజల ఆకలిని ఎదుర్కోవడానికి ఆక్వాకల్చర్‌ను బలోపేతం చేయడం, మత్స్య రంగంలోని వనరుల స్థిరమైన వినియోగం మరియు లోతైన సముద్రపు చేపల వేటను అభివృద్ధి చేయడం వంటివి ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మరియు మత్స్యశాఖ మంత్రి శ్రీ సంజయ్ కుమార్ నిషాద్ చేపల ఉత్పత్తిని పెంచడానికి మరియు మత్స్యకారులు మరియు ఆక్వా రైతుల జీవనోపాధికి భద్రత కల్పించడానికి సమిష్టి కృషి మరియు అధునాతన సాంకేతికతల ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.

హర్యానా పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మరియు మత్స్యశాఖ మంత్రి  శ్రీ జై ప్రకాష్ దలాల్ మత్స్యరంగంలో వృద్ధికి గల అవకాశాలను వివరించారు. అలాగే ఆక్వా పార్క్ కోసం ప్రణాళికలను ప్రకటించారు. ఈ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని ఆయన పెట్టుబడిదారులను ఆహ్వానించారు.

ఈ సదస్సులో హిమాచల్ ప్రదేశ్ వ్యవసాయ మరియు పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీ చందర్ కుమార్, మేఘాలయ ఫిషరీస్ మంత్రి శ్రీ ఎ ఎల్ హెక్, నాగాలాండ్ ఫిషరీస్ మంత్రి శ్రీ పాంగ్‌జుంగ్ జామీ, త్రిపుర ఫిషరీస్, జంతు వనరుల అభివృద్ధి మంత్రి శ్రీ సుధాంగ్షు దాస్,  గోవా మత్స్యశాఖ మంత్రి  శ్రీ నీల్కాంత్ హలంకర్ కూడా మాట్లాడారు.

విదేశీ దౌత్య ప్రతినిధులు పరిశోధన, డేటా సేకరణ, వనరుల పర్యవేక్షణ మరియు సాంకేతికత బ్యాక్‌స్టాపింగ్‌తో సహా పలు కీలక రంగాలలో భారతదేశంతో సహకారాన్ని పెంపొందించుకోవడంలో తమ ఆసక్తిని వ్యక్తం చేశారు.

భారతీయ మత్స్య ఉత్పత్తులకు మార్కెట్ యాక్సెస్‌ను విస్తరించడం, స్థిరమైన ఫిషింగ్ పద్ధతులు, ఆక్వాకల్చర్ టెక్నాలజీలు మరియు వనరుల నిర్వహణపై పరిశోధనలు చేసేందుకు పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాలు మరియు అంతర్జాతీయ సంస్థలతో సహకరించడంపై కూడా చర్చలు జరిగాయి.

***



(Release ID: 1978930) Visitor Counter : 54


Read this release in: English , Urdu , Hindi , Gujarati