కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

“5జీ పర్యావరణ వ్యవస్థ ద్వారా డిజిటల్ పరివర్తన”పై ట్రాయ్‌ విడుదల చేసిన సంప్రదింపుల పత్రంపై వ్యాఖ్యలు & ప్రతివ్యాఖ్యలు స్వీకరించడానికి చివరి తేదీలు పొడిగింపు

Posted On: 30 OCT 2023 2:49PM by PIB Hyderabad

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్‌), 29 సెప్టెంబర్ 2023న, “5జీ పర్యావరణ వ్యవస్థ ద్వారా డిజిటల్ పరివర్తన”పై ఒక సంప్రదింపుల పత్రం విడుదల చేసింది. దానిపై వాటాదార్ల నుంచి వ్యాఖ్యలు & ప్రతివ్యాఖ్యలను కోరింది. వ్యాఖ్యలు & ప్రతివ్యాఖ్యలను స్వీకరించడానికి చివరి తేదీలుగా, వరుసగా అక్టోబర్ 30, నవంబర్ 13, 2023ను నిర్ణయించింది.

అవసరమైన సమాచారాన్ని సేకరించడంలో పండుగల కారణంగా ఇబ్బంది వంటి వివిధ కారణాలతో, వ్యాఖ్యలు సమర్పించడానికి మరికొంత సమయం కోరుతూ పరిశ్రమ సంఘాల నుంచి అభ్యర్థనలు వచ్చాయి. కొత్త సాంకేతికతలను వేగంగా స్వీకరించడం & సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలో విధాన పరమైన సవాళ్లు, విధివిధానాల రూపకల్పన వంటివి సంప్రదింపుల పత్రం పరిధిలోకి వస్తాయి కాబట్టి, ప్రతిస్పందించే ముందు అంతర్గతంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉందని కూడా పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.

వాటాదార్ల అభ్యర్థనలను దృష్టిలో ఉంచుకుని, రాతపూర్వక వ్యాఖ్యలు సమర్పించడానికి చివరి తేదీని నవంబర్ 27, 2023 వరకు, ప్రతివ్యాఖ్యల కోసం చివరి తేదీని డిసెంబర్ 11, 2023 వరకు ట్రాయ్‌ పొడిగించింది.

వాటాదారులు తమ వ్యాఖ్యలను ఎలక్ట్రానిక్ రూపంలో advadmn@trai.gov.inకు ఇ-మెయిల్ చేయాలి. మరొక కాపీని vibhatomar@trai.gov.inకి సమర్పించాలి. మరింత స్పష్టత/సమాచారం కోసం, వందన సేథి, సలహాదారు (అడ్మిన్ & ఐఆర్‌)ను +91-11-23221509 నంబర్‌లో ఫోన్‌ ద్వారా సంప్రదించవచ్చు.

 

***



(Release ID: 1973218) Visitor Counter : 32