సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

జమ్మూ కశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అధికారులను గవర్నెన్స్‌లో “హోల్ ఆఫ్ గవర్నమెంట్” విధానాన్ని అవలంబించాలని కోరిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


న్యూఢిల్లీలో నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ నిర్వహించిన జమ్ముకశ్మీర్‌ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అధికారుల కోసం ఏర్పాటు చేసిన 6వ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్‌లో ప్రసంగించిన డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రసంగించారు.

గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాలలో కూడా సాంకేతికత అందుబాటులో ఉండటం మరియు వనరుల ప్రజాస్వామ్యీకరణ కారణంగా కేంద్ర మరియు రాష్ట్ర పౌర సేవల జనాభాలో మార్పు ఉంది: డాక్టర్ జితేంద్ర సింగ్

జమ్ముకశ్మీర్‌లో కాల్ సెంటర్ విధానాన్ని అమలు చేస్తానని డాక్టర్ జితేంద్ర సింగ్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం కేంద్రంలో సిపిజిఆర్‌ఏఎంఎస్‌ ద్వారా అమలు చేయబడుతోంది. ఫిర్యాదులను పరిష్కరించిన వ్యక్తుల సంతృప్తి స్థాయిని వ్యక్తిగతంగా నిర్ధారించడం దీని ఉద్దేశం.

Posted On: 19 OCT 2023 1:27PM by PIB Hyderabad

కేంద్ర సైన్స్ & టెక్నాలజీ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత); ఎంఓఎస్‌ పిఎంఓ, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్స్, అటామిక్ ఎనర్జీ మరియు స్పేస్ డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు జమ్మూ కశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అధికారులను "హోల్ ఆఫ్ గవర్నమెంట్" విధానాన్ని అనుసరించాలని కోరారు.

ఉమ్మడిగా ఉన్న పథకాలను గుర్తించి మెరుగైన సామర్థ్యం మరియు ఫలితాల కోసం సామాన్యులకు ప్రయోజనం చేకూర్చేందుకు పథకాల అమలులో సమగ్ర విధానాన్ని అనుసరించాలని మంత్రి అధికారులను కోరారు.

జమ్మకశ్మీర్‌ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అధికారుల కోసం న్యూఢిల్లీలో నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ నిర్వహించిన 6వ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్‌లో డాక్టర్ జితేంద్ర సింగ్‌ ప్రసంగించారు.

 

image.png


డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాలలో కూడా సాంకేతికత అందుబాటులో ఉండటం మరియు వనరుల ప్రజాస్వామ్యీకరణ కారణంగా కేంద్ర మరియు రాష్ట్ర పౌర సేవల జనాభాలో మార్పు వస్తోందన్నారు. పైన పేర్కొన్న జంట కారకాల కారణంగా పంజాబ్, హర్యానా మరియు జమ్మూ కాశ్మీర్ వంటి రాష్ట్రాల నుండి సెంట్రల్ సివిల్ సర్వీసెస్‌లో టాపర్లు వస్తున్నారని ఆయన అన్నారు.

డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి పాలనా సంస్కరణల పట్ల ప్రత్యేక మక్కువ ఉందని మే, 2014లో బాధ్యతలు స్వీకరించిన వెంటనే పరిపాలనను మరింత పారదర్శకంగా, మరింత జవాబుదారీగా, పౌర కేంద్రీకృతంగా ఉండేలా క్రమబద్ధీకరించేందుకు అనేక చర్యలు చేపట్టామని చెప్పారు. .

ప్రస్తుతం మన దేశంలో ప్రభుత్వ విధానం ఆర్థిక సమాఖ్య విధానం, గ్రామీణ భారతాన్ని మార్చడం మరియు ప్రజా సేవల నాణ్యతను మెరుగుపరచడంపై దృష్టి సారించి పాలనలో మెరుగైన పారదర్శకత మరియు జవాబుదారీతనం లక్ష్యంగా ఉందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.

 

image.png


ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలను మన కాలానికి మరింత సందర్భోచితంగా ఉండేలా భారతదేశం మెరుగుపరిచిందని మరియు పరిపాలనా ప్రక్రియలను సరళీకృతం చేయడం మరియు సంస్థలను బలోపేతం చేయడం ద్వారా పరిపాలనా చట్టం నుండి ఉత్పన్నమయ్యే ఏదైనా అన్యాయాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించిందని మంత్రి చెప్పారు. ఈ క్రమంలోనే డిజిటల్ అడ్వాన్స్‌మెంట్ పౌరుల ఫిర్యాదుల పరిష్కారాన్ని ఎనేబుల్ చేసిందని చెప్పారు.

జమ్ముకశ్మీర్‌లో కాల్ సెంటర్ విధానాన్ని అమలు చేస్తానని కూడా డాక్టర్ జితేంద్ర సింగ్ హామీ ఇచ్చారు. ప్రస్తుతం కేంద్రంలో అమలులో ఉన్న  ఫిర్యాదులను పరిష్కరించిన వ్యక్తుల సంతృప్తి స్థాయిని వ్యక్తిగతంగా నిర్ధారించడానికి ఈ విధానం అమలు చేస్తున్నారు.

డాక్టర్ జితేంద్ర సింగ్ డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ..ఇది మూడు ప్రధాన విజన్ ప్రాంతాలపై కేంద్రీకృతమై ఉంది. అవి ప్రతి పౌరుడికి ప్రధాన ప్రయోజనంగా డిజిటల్ మౌలిక సదుపాయాల డిమాండ్‌పై పాలన మరియు సేవలు మరియు పౌరుల డిజిటల్ సాధికారత, డిజిటల్ టెక్నాలజీలు ప్రతి పౌరుడి జీవితాన్ని మెరుగుపరచడం, భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థను విస్తరించడం మరియు పెట్టుబడి మరియు ఉపాధి అవకాశాలను సృష్టించడం మరియు భారతదేశంలో డిజిటల్ సాంకేతిక సామర్థ్యాలను సృష్టించడం అనేది మొత్తం లక్ష్యం అని ఆయన అన్నారు.

ప్రభుత్వం మరియు పౌరుల మధ్య అంతరాన్ని డిజిటల్ ఇండియా గణనీయంగా తగ్గించిందని మరియు పారదర్శకంగా మరియు అవినీతి రహితంగా లబ్ధిదారులకు నేరుగా గణనీయమైన సేవలను అందించడంలో కూడా సహాయపడిందని మంత్రి అన్నారు. ఈ ప్రక్రియలో భారతదేశం తన పౌరుల జీవితాలను మార్చడానికి సాంకేతికతను ఉపయోగించే ప్రపంచంలోని ప్రముఖ దేశాలలో ఒకటిగా అవతరించిందని అన్నారాయన.

సివిల్ సర్వెంట్ల కొత్త యుగం యోగ్యత నైతికత మరియు జవాబుదారీతనంలో ఎంకరేజ్ చేయబడాలని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. భారత ప్రభుత్వం "అవినీతి పట్ల జీరో టోలరెన్స్ అప్రోచ్"ను నిర్వహిస్తోందని తెలిపారు. ప్రభుత్వ ప్రక్రియలకు మరింత పారదర్శకత, మెరుగైన పర్యవేక్షణ మరియు దుష్ప్రవర్తన రుజువైన సందర్భాలలో తీవ్రమైన జరిమానాలు ఉన్నాయి.సివిల్ సర్వెంట్లు వార్షిక ప్రాతిపదికన తప్పనిసరిగా ఆస్తులను ప్రకటించడం ద్వారా అవినీతిని ఎదుర్కోవడానికి భారతదేశం యొక్క శాసన మరియు రాజ్యాంగ ముసాయిదా బాగా బలపడిందని తద్వారా నివారణ అప్రమత్తతపై దృష్టి సారిస్తుందని మంత్రి తెలిపారు.

డిఎఆర్‌పిజి సెక్రటరీ శ్రీ వి.శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ శిక్షణ సామూహిక అభ్యాసానికి మరియు భాగస్వామ్యం మరియు జీవన నాణ్యతను మెరుగుపరచడానికి పని చేయడానికి ఒక వేదిక అని అన్నారు. స్థితిస్థాపకమైన వృద్ధికి వేగవంతమైన మరియు సమ్మిళిత అభివృద్ధి అవసరం అని ఆయన అన్నారు. పౌరుల జీవితాలను మార్చడంలో సాంకేతికత ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.

 

image.png


శ్రీ శ్రీనివాస్ మాట్లాడుతూ అధికారులు ప్రజల అవసరాలు మరియు అంచనాలకు అనుగుణంగా ఒక కాన్సెప్ట్ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాలని మరియు రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు.ఎన్‌సిజిజి ద్వారా కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ ప్లాట్‌ఫారమ్‌ను అందించింది. సామూహిక అభ్యాసం మరియు భాగస్వామ్యం కోసం తద్వారా జీవన నాణ్యతను మెరుగుపరచడానికి పని చేస్తుంది.

6వ సామర్థ్య నిర్మాణ కార్యక్రమం 9 అక్టోబర్, 2023 నుండి 20 అక్టోబర్, 2023 వరకు ఎన్‌సిజిజిలో నిర్వహించబడుతోంది. కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులు, అదనపు కార్యదర్శులు, సీఈవోలు, డైరెక్టర్లు, జాయింట్ కమిషనర్లు, మిషన్ డైరెక్టర్లు తదితర హోదాల్లో పనిచేస్తున్న జేకేఏఎస్‌లోని 37 మంది అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

ఈ కార్యక్రమంలో జమ్మూ & కాశ్మీర్‌లోని పౌర సేవకులు విభిన్న అంశాలపై డొమైన్ నిపుణులతో సంభాషించారు. కమ్యూనికేషన్ వ్యూహాలు, పేదరిక నిర్మూలన, గ్రామీణ గృహనిర్మాణం, నైపుణ్య భారత్, ప్రభుత్వంలో కృత్రిమ మేధస్సు, పర్యాటకం & సంస్కృతి, జల్ జీవన్ మిషన్, డిజిటల్ ఇండియా, 2030 నాటికి ఎస్‌డిజిల విధానం, ఆయుష్మాన్ భారత్, అవినీతి నిరోధక వ్యూహాలు, విజిలెన్స్ అడ్మినిస్ట్రేషన్, సర్క్యులర్ ఎకానమీ, నదుల పునరుజ్జీవనం, ఆవిష్కరణ & వ్యవస్థాపకత మొదలైనని ఇందులో ఉన్నాయి. భారత పార్లమెంట్‌కు ఎక్స్‌పోజర్ సందర్శనకు కూడా ప్రతినిధులువెళతారు.

జమ్మూ & కాశ్మీర్‌లోని పౌర సేవకులను ప్రజలకు దృఢమైన మరియు అవాంతరాలు లేని సేవలను అందించడానికి సన్నద్ధం చేసేందుకు సామర్థ్య నిర్మాణ కార్యక్రమం శాస్త్రీయంగా రూపొందించబడింది. ఈ కార్యక్రమంలో పొందిన అత్యాధునిక పరిజ్ఞానం మరియు కొత్త నైపుణ్యం ఈ పౌర సేవకులకు ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి సమర్థవంతమైన పబ్లిక్ సర్వీస్ డెలివరీలో సహాయపడతాయి. ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి మరియు అవకాశాలను సృష్టించడానికి ఒకే ఆలోచనతో పని చేసేలా అధికారులను మార్చడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం. జమ్మూకశ్మీర్‌లో సుపరిపాలన, పారదర్శకత మరియు సమర్ధవంతమైన సర్వీస్ డెలివరీ యొక్క ఈ పద్ధతులను అనుకరించడానికి అధికారులకు పాలనలో అత్యుత్తమ అభ్యాసాలను బహిర్గతం చేస్తారు. పాలన యొక్క ఆచరణాత్మక అంశాలను పంచుకోవడం, వేగం మరియు స్కేల్‌తో పని చేయడం మరియు పౌరులకు జవాబుదారీగా ఉండటం మరియు వారి సమస్యలను ముందస్తుగా పరిష్కరించాలని కార్యక్రమం లక్ష్యంగా పెట్టుకుంది.

image.png


డాక్టర్ దేశ్ రాజ్ భగత్, శ్రీ నిసార్ అహ్మద్ వానీ, శ్రీ జతీందర్ సింగ్, శ్రీమతి అనూ మల్హోత్రా, శ్రీ హకీమ్ తన్వీర్ అహ్మద్, శ్రీ రియాజ్ అహ్మద్ షా, శ్రీ ప్రేమ్ సింగ్, శ్రీ తేజ్ క్రిషన్ భట్, శ్రీ ఖ్వాజా నజీర్ అహ్మద్, డాక్టర్ భరత్ భూషణ్ , శ్రీ వసీం రాజా, శ్రీ అశోక్ కుమార్, శ్రీమతి ఇందు కన్వాల్ చిబ్, శ్రీ ఇమామ్ దిన్, శ్రీ షబీర్ హుస్సేన్ భట్, శ్రీ షామ్ లాల్, శ్రీ క్రిషన్ లాల్, డాక్టర్ రాజ్ కుమార్ థాపా, శ్రీ కుల్దీప్ క్రిషన్ సిధా, శ్రీ సుశీల్ కేసర్, శ్రీ అతుల్ గుప్తా , శ్రీ సురేందర్ మోహన్ శర్మ, శ్రీ తిలక్ రాజ్, శ్రీ రాజీవ్ మగోత్రా, శ్రీ దేవిందర్ సింగ్ కటోచ్, శ్రీ పర్వీజ్ సజాద్ గనై, శ్రీ షఫీక్ అహ్మద్, శ్రీ షానవాజ్ షా, శ్రీ జహంగీర్ హష్మీ, శ్రీ ధనంతర్ సింగ్, శ్రీ ఖాజీ ఇర్ఫాన్, శ్రీ రాకేష్ కుమార్, శ్రీ రోమిన్ అహ్మద్, శ్రీ సుదర్శన్ కుమార్, శ్రీ వెవైక్ పురి, శ్రీ సుభాష్ చందర్ డోగ్రా, శ్రీ ఆసిఫ్ హమీద్ ఖాన్ శిక్షణ కార్యక్రమంలో పాల్గొని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రసంగించిన ఇంటరాక్టివ్ సెషన్‌కు హాజరయ్యారు.
 

<><><>



(Release ID: 1969727) Visitor Counter : 52