గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీలోని శివాజీ స్టేడియంలో "శ్రమదాన్ - స్వచ్ఛతా హి సేవా" కార్యక్రమాన్ని నిర్వహించిన భూ వనరుల శాఖ
డిఓఎల్ఆర్ అధికారులు/సిబ్బంది మాత్రమే కాకుండా స్థానిక ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా ఈ పరిశుభ్రత కార్యక్రమాల్లో పాల్గొన్నారు
స్వచ్ఛ భారత్ మిషన్లో ఈ దశ వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ, వ్యర్థాల నుండి సంపద మరియు వృత్తాకార ఆర్థిక వ్యవస్థపై దృష్టి సారించి ప్రధాన మంత్రి దార్శనికత మేరకు చెత్త రహిత భారతదేశం హైలైట్ చేయబడింది.
Posted On:
01 OCT 2023 12:30PM by PIB Hyderabad
డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ (డిఓఎల్ఆర్), గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ స్వచ్ఛతపఖ్వాడా - స్వచ్ఛతా హి సేవ (ఎస్హెచ్ఎస్) - 2023లో భాగంగా "శ్రమదాన్ - స్వచ్ఛతా హి సేవా" అనే పరిశుభ్రత కార్యక్రమాన్ని న్యూఢిల్లీలోని శివాజీ స్టేడియం బస్ టెర్మినల్ (ఎన్డిఎంసి ఏరియా)లో నిర్వహించింది. 2023 అక్టోబర్ 2న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఆయనకు ఈ కార్యక్రమం ద్వారా నివాళులర్పించారు.

స్వచ్ఛ భారత్ మిషన్లో ఈ దశ వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ, వ్యర్థాల నుండి సంపద మరియు వృత్తాకార ఆర్థిక వ్యవస్థపై దృష్టి సారించి ప్రధానమంత్రి పిలుపుమేరకు చెత్త రహిత భారతదేశ సాకారం హైలైట్ చేయబడింది. ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా డిఒఎల్ఆర్ కార్యదర్శి శ్రీ అజయ్ టిర్కీ నేతృత్వంలోని డిపార్ట్మెంట్ అధికారులు/ప్రతినిధుల క్రియాశీల భాగస్వామ్యంతో డిఒఎల్ఆర్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో డిఒఎల్ఆర్ అధికారులు/ప్రతినిధులు మాత్రమే కాకుండా స్థానిక ప్రజానీకం కూడా ఉత్సాహంగా తరలివచ్చి పరిశుభ్రత కార్యక్రమాలలో పాల్గొన్నారు. కార్యకలాపాలు చాలా క్రమబద్ధంగా మరియు పద్దతిలో నిర్వహించబడ్డాయి. ఆ ప్రాంతంలోని నాలుగు వేర్వేరు విభాగాలను కవర్ చేయడానికి నాలుగు బృందాలు ఏర్పాటు చేయబడ్డాయి.

స్వచ్ఛత కోసం ఫలవంతమైన శ్రమదాన్ చేయడం ద్వారా స్వచ్ఛతా హి సేవా ప్రచారం యొక్క లక్ష్యాల గురించి డిపార్ట్మెంట్ అధికారులు/ప్రతినిధులతో పాటు సామాన్య ప్రజలపై ప్రభావం చూపే విషయంలో ఈ కార్యక్రమం భారీ విజయాన్ని సాధించింది.

శ్రమదాన్ (స్వచ్ఛందవాదం) మరియు జన్ భగీదారి (సమాజం భాగస్వామ్యం) ద్వారా పరిశుభ్రత యొక్క అధిక క్రమాన్ని నిర్ధారించడానికి మొత్తం ప్రభుత్వ విధానాన్ని అవలంబించడం భారత ప్రభుత్వం యొక్క స్వచ్ఛతా హి సేవా ప్రచారం లక్ష్యం. 2021లో ఎస్బిఎం 2.0ని ప్రారంభించడం ద్వారా చారిత్రాత్మక స్వచ్ఛ భారత్ మిషన్ (ఎస్బిఎం)లో గొప్ప పురోగతిని ఊహించారు. మిషన్ యొక్క ఈ దశ ప్రజల భాగస్వామ్యంపై ఆధారపడి ఉంటుంది. 2023 అక్టోబరు 1వ తేదీ ఉదయం 10 గంటలకు స్వచ్ఛత కోసం 1 గంట శ్రమదాన్ కోసం పౌరులందరూ సమిష్టిగా పిలుపునిచ్చారు. ఇది బాపు జయంతి సందర్భంగా ఆయనకు “స్వచ్ఛాంజలి” అవుతుంది.
***
(Release ID: 1962946)