వ్యవసాయ మంత్రిత్వ శాఖ

2023-24 రబీ ప్రచారం కోసం జాతీయ సదస్సును నిర్వహించిన వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ


వ్యవసాయంపై జాతీయ సదస్సు ద్వారా 2023-24 రబీ ప్రచారాన్ని ప్రారంభించిన వ్యవసాయం & రైతుల సంక్షేమశాఖ కార్యదర్శి

2023లో రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాలు, పప్పుధాన్యాలు మరియు నూనె గింజలు వరుసగా 3305, 275 మరియు 410 లక్షల టన్నులు ఉత్పత్తి చేయనున్న దేశం

గత 3 సంవత్సరాలుగా అమలు చేయబడిన ఆవాలు మిషన్ రాప్‌సీడ్ మరియు ఆవాల ఉత్పత్తిని 37% పెంచి 91.2 నుండి 124.94 లక్షల టన్నులకు చేర్చింది

దేశంలో వ్యవసాయ-పర్యావరణ అనుకూలమైన మరియు అవసరమైన పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహించాలి

Posted On: 26 SEP 2023 5:32PM by PIB Hyderabad

2015-16 నుండి దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తిలో పెరుగుతున్న ధోరణి కనిపిస్తోంది. ఈ రోజు ఇక్కడ రబీ ప్రచారం 2023-24 కోసం వ్యవసాయంపై జాతీయ సదస్సును ప్రారంభించిన సందర్భంగా కార్యదర్శి (వ్యవసాయం మరియు రైతు సంక్షేమం) శ్రీ మనోజ్ అహుజా ఈ విషయాన్ని తెలిపారు. శ్రీ మనోజ్ అహుజా తన ప్రసంగంలో 3వ అడ్వాన్స్ అంచనాల (2022-23) ప్రకారం దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి 3305 లక్షల టన్నులుగా అంచనా వేయబడిందని తెలిపారు. ఇది 2021-22లో ఆహార ధాన్యాల ఉత్పత్తి కంటే 149 లక్షల టన్నులు ఎక్కువ. వరి, మొక్కజొన్న, శనగలు, పప్పుధాన్యాలు, రాప్‌సీడ్ మరియు ఆవాలు, నూనెగింజలు మరియు చెరకు రికార్డు ఉత్పత్తి అంచనా వేయబడింది. 2022-23లో మొత్తం పప్పుధాన్యాలు మరియు నూనెగింజల ఉత్పత్తి వరుసగా రికార్డు స్థాయిలో 275 మరియు 410 లక్షల టన్నులుగా అంచనా వేయబడింది.

 

image.png


గత 8 సంవత్సరాలలో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 251.54 నుండి 330.54 మిలియన్ టన్నులకు అంటే 31% పెరిగిందని కార్యదర్శి (డిఏ&ఎఫ్‌డబ్ల్యూ) తెలిపారు. నూనెగింజలు మరియు పప్పుధాన్యాలు వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల (సముద్ర మరియు తోటల ఉత్పత్తులతో సహా) 2022-23 సంవత్సరానికి యూఎస్‌డి 53.145 బిలియన్‌లను అధిగమించాయి. వ్యవసాయ ఎగుమతుల కోసం సాధించిన అత్యధిక స్థాయి ఇది. రైతుల ఆదాయాన్ని మెరుగుపరచాలనే ప్రధాన మంత్రి దార్శనికతను సాకారం చేయడంలో గత రెండేళ్లుగా సాధించిన ఈ ఘనత ఎంతగానో తోడ్పడుతుంది.

 

image.png


ఈ కాన్ఫరెన్స్ లక్ష్యం ఏమిటంటే మునుపటి పంట సీజన్‌లలో పంటల పనితీరును సమీక్షించడం మరియు అంచనా వేయడం మరియు రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి రబీ సీజన్‌లో పంటల వారీగా లక్ష్యాలను నిర్ణయించడం, కీలకమైన ఇన్‌పుట్‌ల సరఫరాను నిర్ధారించడం మరియు ఉత్పత్తిని పెంపొందించే ఉద్దేశ్యంతో వినూత్న సాంకేతికతలను అనుసరించడం మరియు పంటల ఉత్పాదకత పెంపొందించడం. ప్రభుత్వ  ప్రాధాన్యత వ్యవసాయ-పర్యావరణ ఆధారిత పంట ప్రణాళిక, బియ్యం మరియు గోధుమ వంటి అదనపు వస్తువుల నుండి నూనె గింజలు మరియు పప్పుధాన్యాలు మరియు అధిక విలువ కలిగిన ఎగుమతి సంపాదించే పంటల వంటి లోటు వస్తువులకు భూమిని మళ్లించడం. ప్రధానమంత్రి అధ్యక్షతన ధర్మశాలలో జరిగిన 1వ జాతీయ ప్రధాన కార్యదర్శుల సమావేశం రాష్ట్రాలతో సంప్రదింపులతో పంటల వైవిధ్యం మరియు పప్పుధాన్యాలు మరియు నూనెగింజలలో స్వయం సమృద్ధి కోసం ఎజెండాను నిర్దేశించింది. ఈ సమావేశం ఎజెండాను తార్కిక ముగింపు దిశగా తీసుకువెళుతుంది.

 

image.png


ఐవైఎం 2023 ద్వారా మీటింగ్‌లలో గిఫ్ట్ హాంపర్లు, ఎగ్జిబిషన్‌లు మరియు మీల్స్‌లో భాగంగా భారతదేశం యొక్క జీ20 ప్రెసిడెన్సీ సమయంలో మిల్లెట్ చురుకైన అంశం. ప్రత్యక్ష వంట వంటకాలు కేంద్ర దృష్టిని ఆకర్షించాయి.

2023-24 సంవత్సరానికి మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి కోసం జాతీయ లక్ష్యాలు 3320 లక్షల టన్నులుగా నిర్ణయించబడ్డాయి, రబీ సీజన్‌లో ఇందులో 1612 లక్షల టన్నులు అందించబడతాయి. అదే విధంగా రబీ పంటల వాటా 292 లక్షల టన్నులలో 181 పప్పుధాన్యాలు మరియు 440 లక్షల టన్నులలో నూనె గింజల కోసం 145 ఉంటుంది. అంతర పంటల ద్వారా విస్తీర్ణాన్ని పెంచడం మరియు తక్కువ దిగుబడినిచ్చే ప్రాంతాల్లో హెచ్‌వైవిలను ప్రవేశపెట్టడం మరియు తగిన వ్యవసాయ పద్ధతులను అవలంబించడం ద్వారా ఉత్పాదకత పెంపుదల మరియు పంటల వైవిధ్యం ద్వారా విస్తీర్ణాన్ని పెంచడం ఈ వ్యూహం.

 

image.png


గత 3 సంవత్సరాలలో ఆవాల ఉత్పత్తి 91.24 నుండి 124.94 లక్షల టన్నులకు 37% పెరిగింది. ఉత్పాదకత హెక్టారుకు 1331 నుండి 1419 కిలోలకు 7% పెరిగింది. రాప్‌సీడ్ & ఆవాలు సాగు విస్తీర్ణం 2019-20లో 68.56 నుండి 2022-23లో 88.06 లక్షల హెక్టార్లకు పెరిగింది. ఈ ప్రశంసనీయ విజయానికి రైతు సంఘం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రశంసలు అర్హమైనవి. పెరిగిన ఆవాల ఉత్పత్తి పామ్ మరియు సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులలో ఎదుర్కొంటున్న కొంత సంక్షోభాన్ని అధిగమించడానికి సహాయపడుతుంది.

రబీ సీజన్‌కు సంబంధించిన అన్ని సాంకేతిక మరియు ఇన్‌పుట్ సంబంధిత సమస్యలు వివరంగా చర్చించబడ్డాయి. ఎరువులు సకాలంలో సరఫరా చేయాలని ఫెర్టిలైజర్స్ కార్యదర్శి శ్రీ రజత్ కుమార్ మిశ్రా స్పష్టం చేశారు. సకాలంలో ఎరువులు సరఫరా చేసేందుకు ఎరువుల శాఖ చేపట్టిన పలు చర్యలను ఆయన వివరించారు. సెక్రటరీ (డెర్‌) మరియు డిజి, ఐకార్‌ డాక్టర్ హిమాన్షు పాఠక్ వాతావరణాన్ని తట్టుకునే పద్ధతులను అవలంబించవలసిన అవసరాన్ని హైలైట్ చేశారు. వాతావరణ మార్పులపై ప్రపంచ దృక్పథాన్ని మరియు అమలులో ఉన్న అనుసరణ వ్యూహాలను ప్రదర్శించారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో భారతీయ అనుభవాన్ని ఎన్‌ఐసిఆర్‌ఏ బృందం పంచుకుంది. ఎన్‌ఐసిఆర్‌ఏ ప్రాజెక్ట్ కింద నిర్వహించిన పెద్ద సంఖ్యలో అధ్యయనాలు వివిధ వ్యవసాయ-పర్యావరణ ప్రాంతాలకు వాతావరణాన్ని తట్టుకునే సాంకేతికతలను గుర్తించాయి.

 

image.png


మెరుగైన సాంకేతికతలతో పోలిస్తే రైతుల అభ్యాసంతో పంటల ఉత్పత్తిలో పెద్ద దిగుబడి అంతరాలపై సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. జేఎస్‌ (పంటలు & నూనెగింజలు) శ్రీమతి. శుభా ఠాకూర్ ఈ వస్తువులలో దేశం స్వయం సమృద్ధి సాధించడానికి రాబోయే 5 సంవత్సరాలలో పప్పుధాన్యాలు మరియు నూనె గింజల కోసం దృష్టి పెట్టాలన్నారు. పప్పుధాన్యాల కోసం 2025 నాటికి 325.47 లక్షల టన్నుల లక్ష్యాన్ని సాధించాలని ప్రతిపాదించబడింది. అంతర్ పంటలు, వరి పంటలను లక్ష్యంగా చేసుకోవడం, అధిక సంభావ్య జిల్లాలు మరియు సాంప్రదాయేతర ప్రాంతాలలో విస్తరణ వంటి ప్రత్యేక ప్రాజెక్టులు నూనెగింజల క్రింద అదనపు విస్తీర్ణాన్ని తీసుకువస్తాయి. ఇవన్నీ 2025-26 చివరి నాటికి వార్షిక ఆహార నూనె గింజల ఉత్పత్తిని ప్రస్తుత స్థాయి 362 నుండి 541 లక్షల టన్నులకు మరియు వంటనూనెల ఉత్పత్తిని 85 నుండి 136 లక్షల టన్నులకు పెంచుతాయి. తదుపరి 5 సంవత్సరాలలో దిగుమతి ఆధారపడటాన్ని 56% నుండి 36%కి తగ్గించడంలో పునరుద్ధరించబడిన దృష్టి సాయపడుతుంది. అదనపు కార్యదర్శి (వ్యవసాయం) మరియు డిఎ&ఎఫ్‌డబ్ల్యూతో పాటు ఐకార్‌ నుండి సీనియర్ అధికారులు మరియు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు ఈ జాతీయ సదస్సులో
పాల్గొన్నారు.

 

 

***



(Release ID: 1961136) Visitor Counter : 266


Read this release in: English , Urdu , Hindi , Marathi