మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

తీర ప్రాంత మత్స్య సంపదను పునరుజ్జీవింపజేసేందుకు సముద్రతలంలో కృత్రిమ గుట్టల(ఏ ఆర్) ను పీ ఎం ఎం ఎస్ వై పథకం కింద మత్స్యశాఖ ప్రోత్సహిస్తోంది.


126 కోట్ల రూపాయల పెట్టుబడితో 10 తీరప్రాంత రాష్ట్రాలకు 732 కృత్రిమ రీఫ్ యూనిట్లను డీ ఓ ఎఫ్ మంజూరు చేసింది.

Posted On: 22 SEP 2023 6:12PM by PIB Hyderabad

తీర ప్రాంత మత్స్య సంపదను పునరుజ్జీవింపజేసే సుస్థిర పద్ధతులను ప్రోత్సహించేందుకు, ప్రధాన మంత్రికి చెందిన కేంద్ర ప్రాయోజిత పథకం (సి ఎస్ ఎస్)లో "సమీకృత ఆధునిక తీర మత్స్యకార గ్రామాలు" కింద ఉప-కార్యకలాపంగా మొత్తం రూ.126 కోట్ల పెట్టుబడితో 10 తీరప్రాంత రాష్ట్రాలకు 732 కృత్రిమ రీఫ్ యూనిట్లను మత్స్యశాఖ మంజూరు చేసింది. మత్స్య సంపద యోజన (పీ ఎం ఎం ఎస్ వై) ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియా (ఎఫ్ ఎస్ ఐ) మరియు ఐసీఏఆర్-సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సి ఎం ఎఫ్ ఆర్ ఐ ) సాంకేతిక సహకారంతో ఈ ప్రాజెక్టులు అమలు చేయబడుతున్నాయి. అన్ని రాష్ట్రాలు తమ స్థల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయగా, కేరళ మరియు మహారాష్ట్ర రాష్ట్రాలు పనుల అమలు కోసం టెండర్ ప్రక్రియను పూర్తి చేశాయి. ఈ విధంగా అన్ని ప్రాజెక్టులు జనవరి 2024 నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు.

 

తీరప్రాంత జలాల్లో కృత్రిమ దిబ్బలను ఏర్పాటు చేయడం మరియు అన్ని తీరప్రాంత రాష్ట్రాలలో సముద్ర గడ్డిబీడు కార్యక్రమాలను చేపట్టడం ద్వారా తీర ప్రాంత మత్స్య సంపదను పునరుజ్జీవింపజేసి, చేపల నిల్వలను పునరుద్ధరించాలనే వ్యూహం రూపొందిస్తున్నారు.

 

కృత్రిమ దిబ్బలు అనేవి సహజ ఆవాసాలను పునరుద్ధరించడానికి, మెరుగుపరచడానికి, ఉత్పాదకతను పెంచడానికి మరియు మత్స్య సంపద అధిక నివాసత (ఎఫ్ ఏ ఓ, 2015)తో సహా జల వనరులను నిర్వహించడానికి ఉపయోగించే ఇంజనీరింగ్ సాంకేతిక జోక్యాలు. కృత్రిమ దిబ్బల ఏర్పాటు ఈ క్రింది అనేక రూపాల్లో ప్రయోజనకరంగా ఉంటుంది:

 

సహజ రీఫ్‌ల మాదిరిగానే, ఏ ఆర్ లు చేపలను సమగ్రపరచడానికి మరియు చేపలు నివసించడానికి మరియు పెరగడానికి నివాసతను అందిస్తాయి, తీరప్రాంతాలలో అలల తాకిడి తగ్గిస్తాయి, సముద్ర పర్యావరణ వ్యవస్థ పునరుత్పత్తికి సహాయపడతాయి మరియు కార్బన్ సింక్‌గా పనిచేస్తాయి. సి ఎం ఎఫ్ ఆర్ ఐ ప్రకారం, చేపల పట్టుబడి రేట్లు మరియు సామర్థ్యాన్ని రెండు నుండి మూడు రెట్లు పెంచవచ్చు, తద్వారా ఇంధనం మరియు శక్తి ఖర్చులను ఆదా చేయడం వలన ఆదాయం పెరుగుతుంది.

పగడాలు, శైవలాలు మరియు పాచి వంటి సముద్ర జీవులకు అతుక్కొని పెరగడానికి గట్టి ఉపరితలాన్ని అందిస్తాయి. ఇవి సముద్రపు గడ్డిబీడులకు అనుకూలమైన పరిస్థితులను అందిస్తాయి మరియు చేపల పెంపకం మరియు నర్సరీలకు మైదానాలుగా పనిచేస్తాయి.

అలంకార చేపల పెంపకం, స్నార్కెలింగ్, ఎకో-టూరిజం, డైవింగ్ కోసం అనువైన ప్రాంతాలను సృష్టించడం మరియు సంఘర్షణను తగ్గించడం లో కృత్రిమ రీఫ్ లు సహాయపడతాయి.

కృత్రిమ రీఫ్ నిర్మాణాలు సమీప తీర ప్రాంతాలలో దిగువ ట్రాలింగ్‌ను నియంత్రిస్తాయి, తద్వారా సముద్ర పర్యావరణం పునరుత్పత్తికి మరియు చిన్న-స్థాయి మత్స్యకారులు అధిక చేపల పట్టుబడి పొందడంలో సహాయపడుతుంది.

ఒక  300 ఎం 3 కృత్రిమ రీఫ్ 25-30 నాన్-మెకనైజ్డ్ బోట్‌లకు (సి ఎం ఎఫ్ ఆర్ ఐ) చేపల పట్టుబడికి సమానమని భావిస్తున్నారు.

 

మత్స్యరంగంలో సుస్థిరమైన మరియు బాధ్యతాయుతమైన తీరప్రాంత అభివృద్ధి ద్వారా నీలి విప్లవాన్ని తీసుకురావడానికి  రూ. 20,050 కోట్ల అత్యధిక పెట్టుబడి తో మే 2020లో పీ ఎం ఎస్ ఎస్ వై ని ప్రారంభించింది. సంవత్సరాలుగా పెరిగిన చేపల వేట కార్యకలాపాలు తీరప్రాంత మత్స్య సంపద నుండి తలసరి దిగుబడిని తగ్గించాయి, దీనితో భారీ చేపల వేట కోసం ఒత్తిడికి దారితీసింది, దిగువ ట్రాలింగ్ కారణంగా చేపలు పట్టే స్థలాలను కోల్పోవడం మొదలైనవాటి ఫలితంగా ఆదాయం తగ్గింది మరియు మత్స్యకారులు లోతైన జలాలకు వెళ్లవలసి వచ్చింది.

***



(Release ID: 1959842) Visitor Counter : 153


Read this release in: English , Urdu , Marathi , Hindi