సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

ఖాదీ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు 3 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసిన ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్


డిడి న్యూస్ మరియు డిడి ఇంటర్నేషనల్‌ ఛానళ్లలోని యాంకర్లు ఖాదీ దుస్తులే ధరించాలి

కెవిఐసీ కోసం దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి ఎన్‌బిసిసి (ఇండియా) లిమిటెడ్

ఖాదీకి ఐటీ సంబంధిత పరిష్కారాలను అందించడానికి డిజిటల్ ఇండియా కార్పొరేషన్

పిఎంఈజిపి కింద రూ.150 కోట్ల మార్జిన్ మనీ సబ్సిడీ పంపిణీ

Posted On: 18 SEP 2023 6:10PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన 'లోకల్ ఫర్ వోకల్' మరియు 'ఆత్మనిర్భర్ భారత్' మంత్రం మేరకు ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కెవిఐసి), సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ మూడు వేర్వేరు అవగాహన ఒప్పందాలను కుదుర్చుకుంది. తద్వారా స్వతంత్ర భారతదేశంలోని అమృతకల్‌లో ఈ రోజు ఇక్కడ 'న్యూ ఇండియా యొక్క ఆధునిక ఖాదీ'కి శ్రీకారం చుట్టింది.

 

image.png


ఖాదీ & విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ చైర్మన్ శ్రీ మనోజ్ కుమార్ సమక్షంలో ప్రసార భారతి, ఎన్‌బిసిసి (ఇండియా) లిమిటెడ్ మరియు డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌తో ఈ ఒప్పందాలు జరిగాయి. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ విజన్‌కు అనుగుణంగా ఖాదీ మరియు విలేజ్ ఇండ‌స్ట్రీస్ క‌మీష‌న్‌ను ఆధునీకరించడం మరియు యువతలో దాని ఉత్పత్తులను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయడం ఈ అవగాహన ఒప్పందాల లక్ష్యం. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం కింద లబ్ధిదారులకు రూ.150 కోట్ల మార్జిన్‌ మనీ సబ్సిడీని శ్రీ కుమార్‌ పంపిణీ చేశారు.

 

image.png


ప్రసార భారతితో కుదుర్చుకున్న ఎంఓయూ ప్రకారం త్వరలో డిడి న్యూస్ మరియు డిడి ఇంటర్నేషనల్ ఛానెల్‌ల యాంకర్లు ఖాదీ దుస్తులలో కనిపిస్తారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో ఖాదీ ఇప్పుడు గుర్తింపు స్వావలంబన భారతదేశంగా మారిందని శ్రీ కుమార్ పునరుద్ఘాటించారు.ఈ నేపథ్యంలో ప్రసార భారతితో ఈ ఒప్పందం యువతలో ఖాదీని ప్రాచుర్యం పొందడంలో ఒక మైలురాయిగా నిలవనుంది. దీనితో పాటు ఎన్‌బిసిసి (ఇండియా) లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ కోసం కొత్త ఆధునిక మౌలిక సదుపాయాలను నిర్మిస్తుంది మరియు కెవిఐసిని సరికొత్త సాంకేతికతతో తాజాగా ఉంచడంపై దృష్టి పెట్టడానికి డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌తో కెవిఐసి చేతులు కలిపింది.

ఎంఓయూలపై ప్రసార భారతి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శ్రీ సంజయ్ ప్రసాద్ మరియు కెవిఐసి పబ్లిసిటీ డైరెక్టర్ శ్రీ సంజీవ్ పోస్వాల్, ఎన్‌బిసిసి(ఇండియా) లిమిటెడ్ చీఫ్ జనరల్ మేనేజర్ శ్రీ ప్రదీప్ శర్మ, కెవిఐసి ఎస్టేట్ & సర్వీసెస్ డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ రాజన్ బాబు మరియు డిప్యూటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ శ్రీ దేబరత్ నాయక్,  డిజిటల్ ఇండియా కార్పొరేషన్ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్  శ్రీ రాజన్ బాబు ఒప్పందంపై సంతకాలు చేశారు.

 

image.png


డ్యాష్‌బోర్డ్‌తో పాటు ఏటీఆర్‌ పోర్టల్‌ను కూడా శ్రీ కుమార్  ప్రారంభించారు. కమిషన్ నిర్వహించే పథకాలను పర్యవేక్షించడానికి డ్యాష్‌బోర్డ్ ఛైర్మన్‌కు సహాయం చేస్తుంది మరియు ఏటిఆర్ పోర్టల్ కమిషన్ నిర్ణయంపై తీసుకున్న చర్యలను సమర్థవంతంగా ట్రాక్ చేయడానికి వీలు కల్పిస్తుంది.

 

image.png


ఈ కార్య‌క్ర‌మంలో కెవిఐసి చైర్మ‌న్ మాట్లాడుతూ..ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గడచిన 9 సంవ‌త్స‌రాల‌లో ప్ర‌పంచంలోని ప్ర‌తి వేదిక‌పై భార‌త జాతీయ వారసత్వ ఖాదీని ప్ర‌చారం చేశారని అన్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన జి-20 శిఖరాగ్ర సదస్సులో ప్రపంచ నాయకులకు ఖాదీ బహుమతులను అందించడం ద్వారా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఖాదీకి గ్లోబల్ బ్రాండింగ్ చేసిన తీరు ఖాదీకి కొత్త ప్రపంచ గుర్తింపు తెచ్చిపెట్టిందని చెప్పారు.

image.png

 

image.png

 

భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో జాతిపిత మహాత్మా గాంధీ స్వదేశీ ఉద్యమానికి ఖాదీని కీలకమైన ఆయుధంగా చేశారని.. గత 9 సంవత్సరాలలో  ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కూడా అదే ఖాదీని అద్భుతంగా ఉపయోగించారని అన్నారు. పేదరిక నిర్మూలన, హస్తకళాకారుల సాధికారత, ఆహార భద్రత, మహిళా సాధికారత మరియు నిరుద్యోగాన్ని నిర్మూలించడానికి అత్యంత శక్తివంతమైన, సమర్థవంతమైన మరియు విజయవంతమైన సాధనం మరియు ఆయుధాన్ని సృష్టించిందని చెప్పారు. ప్రధానమంత్రి నాయకత్వంలో గత ఆర్థిక సంవత్సరంలో చరిత్ర సృష్టిస్తూ ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమ ఉత్పత్తుల వ్యాపారం రూ.1.34 లక్షల కోట్లు దాటగా 9.54 లక్షల కొత్త ఉద్యోగాలు సృష్టించబడ్డాయి. కార్యక్రమంలో కెవిఐసి అధికారులతో పాటు ఉద్యోగులు పాల్గొన్నారు.
 

***



(Release ID: 1958762) Visitor Counter : 110


Read this release in: English , Urdu , Marathi , Hindi