మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

పశు సంవర్ధక, పాడి పరిశ్రమ రైతులలో కిసాన్ క్రెడిట్ కార్డ్(కెసిసి) ) సంతృప్తతను పెంచడానికి ముంబైలో జరిగిన జాతీయ కె సి సి సమావేశానికి అధ్యక్షత వహించిన కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పురుషోత్తం రూపాల

Posted On: 12 SEP 2023 4:31PM by PIB Hyderabad

కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పురుషోత్తం రూపాలా అధ్యక్షతన పశుసంవర్ధక, పాడిరైతులలో కిసాన్ క్రెడిట్ కార్డు (కెసిసి) సంతృప్తతను పెంపొందించడానికి అన్ని భాగస్వాములతో 2023 సెప్టెంబర్ 4 ముంబైలో జాతీయ కెసిసి కాన్ఫరెన్స్ జరిగింది. దేశవ్యాప్తంగా 1000 కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా 50,000 మందికి పైగా పశుసంవర్థక రైతులు వర్చువల్ గా హాజరయ్యారు.

రంగం ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం 2018-19 లో మత్స్యపశుసంవర్ధక రైతులకు వారి మూలధన అవసరాలను తీర్చడంలో సహాయపడటానికి కిసాన్ క్రెడిట్ కార్డు (కెసిసి) సౌకర్యాన్ని విస్తరించింది. మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ మంత్రిత్వ శాఖ ఆర్థిక సేవల విభాగంతో కలిసి అర్హులైన పశుసంవర్ధక, మత్స్య రైతులందరికీ కిసాన్ క్రెడిట్ కార్డు సౌకర్యాలను అందించడానికి 2020 జూన్ నుండి వివిధ ప్రచారాలను నిర్వహిస్తోంది.

దేశవ్యాప్తంగా మరింత సంతృప్తతను సాధించడానికి, హెచ్ డి ఎఫ్ కెసిసి ప్రచారాన్ని 31.03.2024 వరకు పొడిగించారు. ఫలితంగా పశుసంవర్థక, పాడి రైతులకు ఇప్పటివరకు 28.90 లక్షలకు పైగా కొత్త కెసిసి మంజూరు చేశారు. తద్వారా వారి వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను తీర్చడానికి సంస్థాగత రుణ సదుపాయాన్ని అందిస్తోంది. మంత్రిత్వ శాఖ నిరంతర కృషి కారణంగా, మొదటిసారిగా 2022-23 లో టర్మ్ లోన్ టార్గెట్ తో పాటు పశుసంవర్ధక , మత్స్య రంగానికి వర్కింగ్ క్యాపిటల్ రుణ లక్ష్యాలను నిర్ణయించారు. 2023-24 సంవత్సరానికి పశుసంవర్ధక, పాడి పరిశ్రమకు రూ.2,68,000 కోట్ల క్షేత్ర స్థాయి పరపతి లక్ష్యాన్ని నిర్దేశించారు.

భారత ఆర్థిక వ్యవస్థలో పశుసంవర్ధక రంగం వ్యవసాయంలో ఒక ముఖ్యమైన ఉప విభాగం. 2014–15 నుంచి 2021–22 వరకు (స్థిర ధరల వద్ద) 7.67 శాతం సీఏజీఆర్ తో వృద్ధి చెందింది. 6.3%  నమోదు తో తయారీ రంగం, 2.14% తో వ్యవసాయ (పంట) రంగం , అదే కాలానికి 5.32% నమోదు చేసిన సేవల రంగం వంటి ఇతర రంగాల కంటే సిఎజిఆర్ ఎక్కువ. 536.76 మిలియన్లతో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద పశుసంపద యజమానిగా ఉంది. 100.8 మిలియన్ల కుటుంబాలు, కనీసం ఒక పశుసంపద లేదా పౌల్ట్రీ ఉన్న గృహ సంస్థలు ఉన్నాయి. మొత్తం వ్యవసాయం , అనుబంధ రంగం జివిఎ (స్థిర ధరల వద్ద) లో పశు సంవర్థక రంగం వాటా 24.38 శాతం (2014–15) నుండి 30.19 శాతానికి (2021-22) పెరిగింది. మొత్తం జివిఎ లో పశుసంవర్ధక రంగం వాటా 2014–15లో 4.02 శాతం నుంచి 2021–22లో 4.75 శాతానికి పెరిగింది.

***



(Release ID: 1956841) Visitor Counter : 107


Read this release in: English , Urdu , Hindi