వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

అమృత్ కాల్‌లో భారతదేశం అపూర్వమైన స్థాయిలో ఎదగాలని కోరుకుంటోంది: కేంద్ర వాణిజ్య & పరిశ్రమల మంత్రి శ్రీ పీయూష్ గోయల్


న్యూఢిల్లీలో నిర్వహించిన జీ20 సమ్మిట్ 2023 ప్రాముఖ్యతను శ్రీ గోయల్ హైలైట్ చేశారు మరియు భారతదేశ జీ20 ప్రెసిడెన్సీలో స్టార్టప్20 సంస్థను అభినందించారు

భారతదేశం మరియు సౌదీ అరేబియా మధ్య వాణిజ్యం $200 బిలియన్ల వరకు చేరవచ్చు: శ్రీ గోయల్

గుజరాత్‌లోని గిఫ్ట్‌ని సందర్శించాల్సిందిగా సావరిన్ వెల్త్ ఫండ్‌లను ఆహ్వానించిన శ్రీ గోయల్

Posted On: 11 SEP 2023 7:32PM by PIB Hyderabad

కేంద్ర వాణిజ్యం మరియు పరిశ్రమలు, ఆహారం మరియు ప్రజాపంపిణీ మరియు జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ సౌదీ అరేబియా పెట్టుబడి మంత్రి ఖలీద్ ఎ. అల్-ఫాలిహ్‌తో మాట్లాడుతూ 2047 అమృత్ కాల్‌లో భారతదేశం ఒక అపూర్వమైన స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. న్యూఢిల్లీలో నిర్వహించిన జీ20 సమ్మిట్ 2023 ప్రాముఖ్యతను శ్రీ గోయల్ హైలైట్ చేశారు మరియు భారతదేశ జీ20 ప్రెసిడెన్సీలో స్టార్టప్20 సంస్థను కూడా ప్రశంసించారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పరంగా ప్రపంచ బ్యాంక్ ర్యాంకింగ్‌లో సౌదీ అరేబియా 62వ స్థానంలోనూ, భారత్ 63వ స్థానంలోనూ ఉన్నాయని, రెండు దేశాలు నేడు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రెండు ఆర్థిక వ్యవస్థలుగా ఉన్నాయని ఆయన అన్నారు. అయితే 2020 నుండి ర్యాంకింగ్‌ విధానం నిలిపివేయబడింది.

ప్రస్తుతం 52 బిలియన్ డాలర్లుగా ఉన్న రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని రెట్టింపు చేయడంతోపాటు 200 బిలియన్ డాలర్లకు పెంచడం గురించి కూడా శ్రీ గోయల్ మాట్లాడారు. ఈ విషయంలో గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్-టెక్ సిటీని సందర్శించి, ఆపై పెట్టుబడులు తీసుకురావాలని సౌదీ పెట్టుబడిదారులను కేంద్ర మంత్రి ఆహ్వానించారు.

భారతదేశ నియంత్రణ యంత్రాంగాన్ని సరళీకృతం చేయడాన్ని పెట్టుబడిదారులు అభినందిస్తారని ఆయన అన్నారు. అలాగే, అన్ని నిబంధనలకు ఒకే ఒక నియంత్రకం ఉంది. అంతేకాకుండా, భారతదేశం పన్ను రాయితీలను తీసుకువచ్చింది మరియు గిఫ్ట్ సిటీలోకి మరియు వెలుపలకు నిధుల ప్రవాహాన్ని ప్రభుత్వం  సులభతరం చేసింది.

భారత ప్రభుత్వం మరియు ఇన్వెస్ట్ ఇండియాతో పాటు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ & ఇండస్ట్రీ (ఫిక్కి) సౌదీ అరేబియాలోని రియాద్‌లో ఇన్వెస్ట్‌మెంట్ మరియు ట్రేడ్ ప్రమోషన్ కార్యాలయాన్ని ప్రారంభించవచ్చని శ్రీ గోయల్ సూచించారు. ఫిక్కీ ప్రతినిధులతో పాటు భారత ప్రభుత్వ అధికారులు స్టార్టప్‌లను ప్రోత్సహిస్తారని ఆయన ఉద్ఘాటించారు.

సౌదీ అరేబియాకు భారతదేశం  ఆహార భద్రతను అందించగల అవకాశాల గురించి శ్రీ గోయల్ మాట్లాడారు. అదే సమయంలో భారతదేశానికి ఇంధనం, చమురు మరియు ఎరువులు అందించవచ్చని తద్వారా సమతుల్య వాణిజ్యం సాధించవచ్చని నొక్కి చెప్పారు.

కేంద్ర మంత్రి నియోమ్ సిటీ గురించి కూడా మాట్లాడారు. సౌదీ అరేబియా ప్రభుత్వం $0.5 ట్రిలియన్ డాలర్ల వ్యయంతో దీనిని ఏర్పాటు చేస్తోందని మరియు మొత్తం నగరంలో 100% క్లీన్ ఎనర్జీని కలిగి ఉండాలనే భావనతో  భారీ భూభాగ తీరప్రాంతంలో చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉండేలా రూపొందించబడిందని తెలిపారు.

శ్రీ గోయల్ మాట్లాడుతూ "ఇది భారతదేశం గణనీయంగా దోహదపడే ప్రాంతం అని నేను భావిస్తున్నాను. డిజైన్, నిర్మాణం, నిర్వహణ మరియు వ్యాపారాన్ని అభివృద్ధి చేయడం వంటి రంగాలలో భారతదేశం సహాయకరంగా ఉండవచ్చు" అని హైలైట్ చేశారు. ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీల నుంచి ఇన్వెస్టర్లు పొందుతున్న రాబడుల గురించి ఇటీవలి అధ్యయనాన్ని ఆయన ఉటంకించారు. స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో జాబితా చేయబడిన మొదటి ఐదు కంపెనీల అధ్యయనంలో భారతీయ కంపెనీలు 20 సంవత్సరాల పెట్టుబడిపై 20% సిఏజీఆర్‌ రాబడిని ఇచ్చాయని ఆయన అన్నారు. భారతీయ కంపెనీల తర్వాత అమెరికా, చైనాలు ఉన్నాయని తెలిపారు.

సౌదీ అరేబియా నుంచి వచ్చే పెట్టుబడులను వేగవంతం చేయాల్సిన సమయం ఆసన్నమైందని కేంద్ర మంత్రి తెలిపారు. గత ఏడాది సౌదీ అరేబియా నుండి ఎఫ్‌డిఐ కేవలం 4 బిలియన్ డాలర్లు మాత్రమేనని, ఇది కోవిడ్ కాలంలో 2.8 బిలియన్ డాలర్లు అని ఆయన చెప్పారు.

భారతదేశ ప్రాసెసింగ్ పరిశ్రమలో సౌదీ అరేబియా పెట్టుబడులు వ్యవసాయం మరియు ఆహార భద్రతకు గొప్ప డ్రైవర్‌గా నిలుస్తాయని ఆయన అన్నారు. అదేవిధంగా, ఫార్మా రంగానికి అపారమైన సామర్థ్యం ఉందని శ్రీ గోయల్ తెలిపారు. సౌదీ అరేబియా మరియు భారతదేశ నియంత్రణ అధికారుల మధ్య మరింత అవగాహన ఫార్మా పరిశ్రమలకు సహాయపడుతుందని ఆయన అన్నారు. సౌదీలో నివసిస్తున్న వారు భారతీయ ఔషధాలను సులభంగా పొందాలని, ఇది సౌదీ అరేబియాలో పెట్టుబడులు పెట్టడానికి భారతీయ ఫార్మా కంపెనీలను ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు.

 

 

***



(Release ID: 1956512) Visitor Counter : 150


Read this release in: Urdu , English , Marathi , Hindi