పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

పర్యావరణ ప్రతికూల ప్రభావాన్ని తగ్గించే విషయమై భారత నిబద్ధతను పునరుద్ఘాటించిన శ్రీ భూపేందర్ యాదవ్


- రసాయనాలు, వ్యర్థాల నిర్వహణ మానవ ఆరోగ్యంపై ప్రభావం తగ్గించేలా చర్యలకై నిబద్ధత చూపిన మంత్రి

- రసాయనాలు మరియు సుస్థిరత కాలుష్య రహిత గ్రహం వైపు పరివర్తన విషయమై 2వ బెర్లిన్ ఫోరమ్‌ ఏర్పాటు చేసిన ‘హై లెవల్ డైలాగ్ ఆన్ హ్యూమన్ హెల్త్ అండ్ ఎన్విరాన్‌మెంట్’ సదస్సులో పాల్గొన్న శ్రీ యాదవ్

Posted On: 06 SEP 2023 2:44PM by PIB Hyderabad

కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ 2023 సెప్టెంబర్ 04న రసాయనాలు మరియు సుస్థిరతపై 2వ బెర్లిన్ ఫోరమ్‌లో సమావేశమైన వర్చువల్ ‘హై లెవల్ డైలాగ్ ఆన్ హ్యూమన్ హెల్త్ అండ్ ఎన్విరాన్‌మెంట్’లో పాల్గొన్నారు. రసాయనాలు మరియు సుస్థిరతపై బెర్లిన్ ఫోరమ్ - కాలుష్య రహిత గ్రహం వైపు కేవలం పరివర్తన సదస్సులో పాల్గొన్నారు.  ఈ సమస్యపై ఉమ్మడి అవగాహనను ఏర్పరచుకోవడానికి, రసాయనాలు మరియు వ్యర్థాల నిర్వహణకు సంబంధించి కీలక అంతర్జాతీయ అంశాలు మరియు ప్రాధాన్యతలపై ఉన్నత స్థాయి రాజకీయ మార్గదర్శకత్వ చర్యలు మరింతగా ఊపందుకునేలా చూసేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. కెమికల్స్ మేనేజ్‌మెంట్‌పై అంతర్జాతీయ సమావేశం (ఐసీసీఎం5) యొక్క రాబోయే 5వ సమావేశంలో 'ఎస్.ఎ.ఐ.సి.ఎం బియాండ్ 2020' యొక్క ఉన్నత స్థాయి ఆశయాన్ని పొందడం, మద్దతు పొందడం కూడా దీని లక్ష్యం. కార్యక్రమంలో శ్రీ యాదవ్ మాట్లాడుతూ, రసాయనాల తయారీ రంగం యొక్క ప్రాముఖ్యతను, ముఖ్యంగా భారతదేశంలో మరియు అనేక దేశాలు ఎదుర్కొంటున్న సామర్థ్య పరిమితుల కారణంగా వాటి ప్రతికూల ప్రభావాల యొక్క సంభావ్య పరిణామాలను ఈ సందర్భంగా ప్రధానంగా ప్రస్తావించారు. బహుళ పక్ష పర్యావరణ ఒప్పందాల లక్ష్యాల నెరవేర్పుకు అందించిన సహకారాన్ని ఆయన హైలైట్ చేశారు. విస్తారిత ఉత్పత్తిదారుల బాధ్యత ఫ్రేమ్‌వర్క్ ప్రక్రియలో వ్యర్థాల నిర్వహణ సాధనంగా ఇప్పటికే అమలు చేయబడిందని, దాని దేశీయ నిబంధనలను సమలేఖనం చేయడంలో భారతదేశం లక్షిత రేఖ కంటే ముందుందని కేంద్ర మంత్రి చెప్పారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో.. 'మానవ ఆరోగ్యం మరియు పర్యావరణ పరిరక్షణ' ప్రధానాంశంగా స్థిరమైన మరియు సమతుల్య అభివృద్ధిని సాధించేందుకు చర్యలు తీసుకున్నట్లు శ్రీ యాదవ్ పేర్కొన్నారు. రసాయన రంగం యొక్క పెరుగుతున్న అవసరాలను పరిష్కరించడానికి, నియంత్రణ సవాళ్లను పరిష్కరించడానికి వాణిజ్య ఉపయోగంలో వాటి వినియోగానాకి ముందు, రసాయనాల రిజిస్ట్రేషన్, వినిమయ అధికారం, రసాయన ప్రమాద వర్గీకరణ, లేబులింగ్ కోసం ఒక ప్రక్రియను ఏర్పాటు చేయడం జరుగుతోందని కేంద్ర మంత్రి హైలైట్ చేశారు. పెరుగుతున్న అవసరాలను పరిష్కరించడానికి, రసాయన రంగం యొక్క పెరుగుతున్న అవసరాలను పరిష్కరించడానికి, నియంత్రణ సవాళ్లను ఎదుర్కొనడానికి గాను నూతన ఆవిష్కరణలతో ముందుకు సాగాల్సి ఉందని మంత్రి పేర్కొన్నారు.

 

****



(Release ID: 1955311) Visitor Counter : 130


Read this release in: English , Urdu , Hindi , Tamil