వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
ఆగస్టు 20 (ఆదివారం) నుండి కిలో రూ.40 రిటైల్ ధరకు టమోటాల విక్రయం
- ఎన్.సి.సి.ఎఫ్, నాఫెడ్ ద్వారా తక్కువ ధరకు అమ్మకాలు
నాడు పోస్టు చేయడమైనది:
18 AUG 2023 5:41PM by PIB Hyderabad
టోకో, రిటైల్ మార్కెట్లలో టమోటా ధరలు తగ్గుముఖం పట్టిన దృష్ట్యా 2023 ఆగస్టు 20 నుండి కిలో టమోటా రూ.40/- రిటైల్ ధరకు విక్రయించాలని వినియోగదారుల వ్యవహారాల శాఖ ఎన్.సి.సి.ఎఫ్, నాఫెడ్ సంస్థలను ఆదేశించింది. ఢిల్లీ-ఎన్సీఆర్లో టమోటాల రిటైల్ విక్రయం జూలై 14, 2023 నుండి ప్రారంభమైంది. ఈ రోజు వరకు దేశంలోని ప్రధాన వినియోగ కేంద్రాల్లోని రిటైల్ వినియోగదారులకు నిరంతరం పంపిణీ చేయబడే రెండు ఏజెన్సీల ద్వారా 15 లక్షల కిలోల టమోటాలు కొనుగోలు చేయబడ్డాయి. ఢిల్లీ-ఎన్సీఆర్, రాజస్థాన్ (జైపూర్, కోటా), ఉత్తరప్రదేశ్ (లక్నో, కాన్పూర్, వారణాసి, ప్రయాగ్రాజ్), బీహార్ (పాట్నా, ముజఫర్పూర్, అర్రా, బక్సర్) తదితర ప్రాంతాలలో రిటైల్ టొమాటో విక్రయాలు జరిగాయి. ఎన్.సి.సి.ఎఫ్ మరియు నాఫెడ్ ద్వారా సేకరించిన టమోటాల రిటైల్ ధర మొదట్లో కిలోకు రూ.90/-గా నిర్ణయించబడింది, ఇది వినియోగదారులకు ప్రయోజనం కలిగించే విధంగా ధరల తగ్గుదలకు అనుగుణంగా వరుసగా మరింతగా తగ్గించబడింది. చివరిగా 15.08.2023న కిలో టమోటా ధరను రూ.50/-కి తగ్గించడం జరిగింది, ఇది 20.08.2023 నుంచి కిలోకు రూ.40/-కి తగ్గనుంది. వినియోగదారుల వ్యవహారాల శాఖ ఆదేశాల మేరకు, ఎన్సిసిఎఫ్ మరియు నాఫెడ్ గత నెలలో రిటైల్ ధరలు గరిష్ఠంగా పెరిగిన ప్రధాన వినియోగ కేంద్రాలలో ఏకకాలంలో చేరవేడయడానికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు మహారాష్ట్రలోని మండీల నుండి టమోటా సేకరణను ప్రారంభించిన విషయం గుర్తుండే ఉంటుంది.
******
(రిలీజ్ ఐడి: 1950378)
సందర్శకుల సూచీ సంఖ్య : : 198