పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

అతి ఎక్కువ ఆసియా ఏనుగుల సంఖ్య కారణంగా జాతుల దీర్ఘకాలిక పరిరక్షణకు భారతదేశం ప్రధాన ఆధారం అని తెలిపిన శ్రీ భూపేందర్ యాదవ్


ఏనుగుల సంరక్షణను కొత్త శిఖరాలకు చేర్చడంలో స్థానిక సంఘాలతో చురుగ్గా పాల్గొనడం కీలకమని చెప్పిన శ్రీ యాదవ్

Posted On: 12 AUG 2023 3:03PM by PIB Hyderabad

కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మరియు కార్మిక మరియు ఉపాధి మంత్రి శ్రీ.భూపేందర్ యాదవ్ పర్యావరణ శ్రేయస్సు మరియు సుస్థిరతను నిర్ధారించడానికి భారతదేశ ఆర్థిక అభివృద్ధిలో జీవవైవిధ్య పరిరక్షణను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలని  ఉద్ఘాటించారు. ఈ రోజు భువనేశ్వర్‌లో జరిగిన ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ ఆసియా ఏనుగుల్లో అత్యధిక జనాభా ఉన్నందున జాతుల దీర్ఘకాలిక పరిరక్షణకు భారతదేశం ప్రధాన ఆధారమని అన్నారు. ఏనుగుల సంరక్షణను కొత్త శిఖరాలకు చేర్చడంలో స్థానిక సంఘాలతో చురుకుగా పాల్గొనడం కీలకమని ఆయన నొక్కి చెప్పారు. మానవ సంక్షేమం మరియు ఏనుగుల సంరక్షణను సమన్వయం చేసేందుకు మంత్రిత్వ శాఖ కట్టుబడి ఉందని శ్రీ యాదవ్ చెప్పారు.

పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (ఎంఒఈఎఫ్‌సిసి), రైల్వే మంత్రిత్వ శాఖ, రాష్ట్ర అటవీ శాఖలు మరియు వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వంటి జాతీయ సంస్థలు రైల్వే సంబంధిత ఏనుగుల యొక్క క్లిష్టమైన సమస్యను పరిష్కరించడానికి తీసుకున్న సమిష్టి ప్రయత్నాలను మంత్రి హైలైట్ చేశారు. ఈ ప్రయత్నాలలో భాగంగా ఏనుగుల ఆవాసాల గుండా వెళుతున్న దేశంలోని రైల్వే నెట్‌వర్క్‌లో దాదాపు 110 క్లిష్టమైన స్ట్రెచ్‌లు గుర్తించబడ్డాయని చెప్పారు. శ్రీ యాదవ్ మాట్లాడుతూ ఈ క్లిష్టమైన విస్తీర్ణంలో రైల్వే సంబంధిత ఏనుగుల తాకిడిని తగ్గించడానికి బహుముఖ వ్యూహాలు ప్రణాళిక చేయబడ్డాయి. ఈ ప్రాంతాల్లో అండర్‌పాస్‌లు నిర్మించడం, లోకో పైలట్‌లు ఢీకొనకుండా చూసేందుకు ట్రాక్‌ల వెంబడి వృక్షసంపదను తొలగించడం, ర్యాంప్‌లను ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. దేశంలోని ఒడిశా మరియు ఇతర రాష్ట్రాల్లోని ట్రాక్‌ల వెంబడి సాంకేతికత ఆధారిత చొరబాట్లను గుర్తించే వ్యవస్థను పునరావృతం చేయడానికి రైల్వే మంత్రిత్వ శాఖ ఆలోచిస్తోందని మంత్రి పేర్కొన్నారు.

ఏనుగుల అక్రమ రవాణాను నిరోధించడానికి దేశంలోని అన్ని బందీ ఏనుగుల జన్యురూపాన్ని మ్యాప్ చేయడానికి మంత్రిత్వ శాఖ చేపట్టిన కొత్త చొరవను శ్రీ యాదవ్ హైలైట్ చేశారు.

మంత్రిత్వ శాఖ తొలిసారిగా దేశవ్యాప్తంగా ఎలిఫెంట్ రిజర్వ్‌ల నిర్వహణ సమర్థత మరియు మూల్యాంకనాన్ని చేపట్టడం ప్రారంభించిందని మంత్రి తెలిపారు. దేశంలోని నాలుగు ఏనుగుల సంఖ్య ఉన్న ప్రాంతాలలో నాలుగు ఏనుగు రిజర్వ్‌ల నిర్వహణ ప్రభావ మూల్యాంకన ప్రక్రియను ప్రయోగాత్మకంగా గుర్తించడం జరిగిందని ఆయన చెప్పారు. ఎలిఫెంట్ రిజర్వ్‌లలో ఉత్తమ పద్ధతులను ప్రామాణీకరించడంలో మరియు ప్రచారం చేయడంలో ఇది ఒక ప్రధాన ముందడుగు అని మంత్రి అన్నారు. దేశంలో ఎలిఫెంట్ రిజర్వ్ నెట్‌వర్క్ గత రెండేళ్లలో 33 ఎలిఫెంట్ రిజర్వ్‌లతో కూడిన 76,508 కిమీ2 నుండి 80,777 కిమీ 2కి పెరిగిందని ఆయన తెలిపారు.

ప్రధాన ప్రసంగం తరువాత శ్రీ యాదవ్ గజ్ సాథీ మరియు మానవ ఏనుగుల సంఘర్షణను నిర్వహించడంలో ముందున్న ఇతర ఫ్రంట్‌లైన్ సిబ్బందితో సంభాషించారు.

ప్రపంచ ఏనుగుల దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రాజెక్ట్ ఎలిఫెంట్ రూపొందించిన ఎలిఫెంట్ కారిడార్ ఆఫ్ ఇండియా నివేదికను మంత్రి విడుదల చేశారు. ఏనుగు శ్రేణి రాష్ట్రాలలోని రాష్ట్ర అటవీ శాఖల సమన్వయంతో భారతదేశంలోని అన్ని ఇండెంటిఫైడ్ ఏనుగు కారిడార్‌ల యొక్క భూధృవీకరణ యొక్క ఫలితం ఈ నివేదిక. ఈ నివేదికలో దాదాపు రెండేళ్లపాటు సమిష్టి కృషి ఉంది. భారతదేశం అంతటా ఉన్న 150 ఏనుగు కారిడార్‌లకు సంబంధించిన వివరాలను సంబంధిత మ్యాప్‌లు ఈ నివేదికలో ఉన్నాయి. ఈ నివేదిక భారతదేశంలోని ఏనుగు కారిడార్‌లకు ముఖ్యమైన సూచన మాన్యువల్‌గా ఉపయోగపడుతుంది. స్థానిక ప్రజలతో ప్రతికూల పరస్పర చర్యలను నివారించేందుకు ఏనుగుల సంచారానికి ఆటంకం లేకుండా ఈ కారిడార్‌లను నిర్వహించడానికి మరియు రక్షించడానికి తగిన చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదిక సహాయం చేస్తుంది. భారతదేశంలోని మొత్తం 33 ఎలిఫెంట్ రిజర్వ్‌ల గురించి ప్రాథమిక సమాచారాన్ని అందించడానికి రూపొందించిన అట్లాస్ ఆఫ్ ఎలిఫెంట్ రిజర్వ్స్ ఆఫ్ ఇండియాకు చెందిన రెండవ వెర్షన్‌ను కూడా శ్రీ యాదవ్ విడుదల చేశారు.

ఏనుగుల సంరక్షణ మరియు నిర్వహణ రంగంలో అత్యుత్తమ సేవలందించినందుకు గాను అవార్డు గ్రహీతలకు మంత్రి గజ్ గౌరవ్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రతిష్టాత్మక గజ్ గౌరవ్ అవార్డులు (1) అలెఫ్‌నగర్ జాయింట్ ఫారెస్ట్ మేనేజ్‌మెంట్ కమిటీ, పశ్చిమ బెంగాల్ (2) (లేట్) శ్రీ. బిశ్వర్రాజన్ పాణిగ్రాహి, (మాజీ) ఒడిశాలోని ధెంకనాల్ శ్రేణిలో అతని శ్రేష్టమైన సేవలకు రక్షణ దళం (3) శ్రీ. పీతాంబర గౌడ, వాచర్, ఒడిశాలోని కోరాపుట్ సర్కిల్‌లోని రాయగడ ఫారెస్ట్ డివిజన్‌కు చెందిన ఎలిఫెంట్ స్క్వాడ్, (4) శ్రీ. దీపక్ శర్మ, ఫారెస్ట్ గార్డ్, అసిస్టెంట్ గజ్ యాత్రా బృందం, మహాసముంద్ ఫారెస్ట్ డివిజన్, ఛత్తీస్‌గఢ్, మరియు (5) డాక్టర్.మీర్జా వసీం, వెటర్నరీ అధికారి, బందీపూర్ టైగర్ రిజర్వ్, కర్ణాటక అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీ.అశ్విని కుమార్ చౌబే, కేంద్ర సహాయ మంత్రి,  శ్రీ. ప్రదీప్ కుమార్ అమత్, ఒడిశా ఎఫ్‌ఈ మరియు సిసి మంత్రి, అటవీ శాఖ డైరెక్టర్ జనరల్ మరియు ప్రత్యేక కార్యదర్శి శ్రీ చంద్రప్రకాష్ గోయల్‌తో పాటు ఎంఒఈఎఫ్‌సిసి సీనియర్‌ అధికారులు  మరియు అదనపు డైరెక్టర్ జనరల్ (పిటి&ఈ) మరియు సభ్య కార్యదర్శి (ఎన్‌టిసిఏ) డాక్టర్ సత్య ప్రకాష్ యాదవ్ పాల్గొన్నారు. అలాగే ఒడిశా ప్రభుత్వ ఎఫ్‌ఈ&సిసి అదనపు ప్రధాన కార్యదర్శి  శ్రీ. సత్యబ్రత సాహు మరియు ఒడిశా చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ శ్రీ సుశీల్ కుమార్ పొప్లి మరియు రాష్ట్ర అటవీ శాఖ సీనియర్ అధికారులు, వివిధ ఏనుగుల శ్రేణి రాష్ట్రాలకు చెందిన చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్‌లు, ప్రఖ్యాత ఏనుగు నిపుణులు మరియు స్థానిక సంఘాల ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.  

ప్రపంచ ఏనుగుల దినోత్సవ వేడుకల అనంతరం శ్రీ యాదవ్ అధ్యక్షతన ప్రాజెక్ట్ ఎలిఫెంట్ యొక్క 19వ స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఏనుగుల సంరక్షణ మరియు నిర్వహణ ఎదుర్కొంటున్న ప్రస్తుత సమస్యలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.

భూమిపై అత్యంత ప్రసిద్ధ జాతులలో ఒకదానిని పరిరక్షించడంలో మానవజాతి యొక్క సామూహిక ప్రతిజ్ఞను పునరుద్ఘాటించడానికి ప్రతి సంవత్సరం 12 ఆగస్టు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ఏనుగు దినోత్సవంగా జరుపుకుంటారు. భారతదేశంలో ఏనుగులు జాతీయ వారసత్వ జంతువులుగా పరిగణించబడుతున్నాయి మరియు మన సంస్కృతిలో లోతుగా పాతుకుపోయాయి.

 

********



(Release ID: 1948317) Visitor Counter : 164