వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

13వ బ్రిక్స్ వాణిజ్య మంత్రుల సమావేశంలో పాల్గొన్న కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్


డబ్ల్యూ టి ఒ , సప్లై చైన్, డిజిటలైజేషన్, ఎంఎస్ఎంఇ లు, మిస్ ప్రైసింగ్, అండర్ ఇన్వాయిసింగ్ తదితర
అంశాలను ప్రస్తావించిన పీయూష్ గోయల్

సమానత్వం, బాహాటం, సమ్మిళితత్వం, ఏకాభిప్రాయం, పరస్పర గౌరవం అవగాహన వంటి బ్రిక్స్ స్ఫూర్తికి బలమైన మద్దతు ప్రకటించిన శ్రీ పీయూష్ గోయల్

Posted On: 08 AUG 2023 3:28PM by PIB Hyderabad

బ్రిక్స్ దక్షిణాఫ్రికా ప్రెసిడెన్సీ కింద నిన్న జరిగిన 13వ బ్రిక్స్ వాణిజ్య మంత్రుల సమావేశానికి కేంద్ర వాణిజ్య, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ, జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ వర్చువల్ గా హాజరయ్యారు. ఈ శ్రీఘ్ర అభివృద్ధి, సుస్థిర అభివృద్ధి, సమ్మిళిత  కోసం, ఏడాది బ్రిక్స్ థీమ్ 'బ్రిక్స్ అండ్ ఆఫ్రికా: పరస్పర భాగస్వామ్యం ఫర్ మ్యూచువల్ యాక్సిలరేటెడ్ గ్రోత్, సుస్థిర అభివృద్ధి, సమ్మిళిత బహుళ పాక్షికత్వం.‘‘ ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటిఒ), సప్లై చైన్, డిజిటలైజేషన్,ఎంఎస్ఎఇలకు సంబంధించిన అంశాలను పీయూష్ గోయల్ ఈ సమావేశంలో ప్రస్తావించారు.

కాంటాక్ట్ గ్రూప్ ఆన్ ఎకనామిక్ అండ్ ట్రేడ్ ఇష్యూస్ (సిజిఇటిఐ) కింద ప్రతిష్టాత్మక ఎజెండాను కలిగి ఉండి, ఫలితాల ఆధారిత కార్యకలాపాలను విజయవంతంగా పూర్తి చేసినందుకు దక్షిణాఫ్రికా ప్రెసిడెన్సీని కేంద్ర మంత్రి ప్రశంసించారు. సమానత్వం, పారదర్శకత, సమ్మిళితత్వం, ఏకాభిప్రాయం, పరస్పర గౌరవం, అవగాహన వంటి బ్రిక్స్ స్ఫూర్తికి ఆయన గట్టి మద్దతు ప్రకటించారు. 

 

ఒకరి పట్ల. ఒకరు పరస్పర విశ్వాసాన్ని పెంపొందించుకోవాలని శ్రీ పీయూష్ గోయల్ స్పష్టం చేశారు. డబ్ల్యుటిఒ సంస్కరణ దిశగా చిన్న, సాధించదగిన, పెరుగుతున్న చర్యలపై బలమైన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ప్రపంచ వాణిజ్య సంస్థ మూడు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారత్ నూతనోత్సాహం, మెరుగైన, సమ్మిళిత ప్రపంచ వాణిజ్య సంస్థను చూడాలని కోరుకుంటోందని, '30కి 30' గురించి మాట్లాడుతూ, ప్రపంచ వాణిజ్య సంస్థ 30 సంవత్సరాలు పూర్తి కావడానికి ముందు, అంటే 2025 జనవరి 1 నాటికి కనీసం 30 కార్యాచరణ మెరుగుదలలను తీసుకురావడానికి ఇది ఒక ప్రయత్నం అని ఆయన అన్నారు.

 

వాతావరణ సంబంధిత సవాళ్లతో పోరాడేందుకు ప్రపంచ ప్రయత్నాల పట్ల తన కట్టుబాట్లను నెరవేర్చడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలను ప్రతిబింబిస్తూ, జర్మన్ వాచ్ ప్రచురించిన వాతావరణ మార్పుల పనితీరు సూచిక ప్రకారం భారతదేశం సాధించిన విజయాలు , ఇటీవలి ర్యాంకింగ్ 5వ స్థానం గురించి మంత్రి బ్రిక్స్ సభ్య దేశాలకు వివరించారు. ఈ నేపథ్యంలో టాప్ 10 ర్యాంక్‌లో భారత్‌ ఒక్కటే జి20 దేశమని కూడా ప్రస్తావించారు. బ్రిక్స్ సభ్యులు కూడా జి 20 లో భాగమైనందున, భారతదేశం అధ్యక్షతన జి 20 l 'ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ వర్కింగ్ గ్రూప్' కింద గణనీయమైన ఫలితాల కోసం సహకారాన్ని ఆయన కోరారు.

 

బ్రిక్స్ దేశాల మధ్య సమిష్టి కృషి కోసం, పారదర్శకత , సమాచారాన్ని పంచుకోవడం ద్వారా ట్రస్ట్ ఆధారిత బహిరంగ వాతావరణంలో పనిచేయడం అత్యంత ముఖ్యమైన అంశమని శ్రీ గోయల్ స్పష్టం చేశారు. బ్రిక్స్ సభ్యత్వంలో కూడా కొందరు సభ్యులు పారదర్శకతపై ఆందోళన వ్యక్తం చేయడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వాణిజ్యం కోసం సహకార ప్రయత్నాలకు మూలమైన బ్రిక్స్ దేశాల సమిష్టి ప్రయత్నాలను ఆపడానికి నాన్ సైన్స్ ఆధారిత శానిటరీ,  ఫైటో-శానిటరీ చర్యలను ఉపయోగించడం ద్వారా సుంకం లేని అడ్డంకులను తీసుకురావడానికి సమిష్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాణిజ్య, పెట్టుబడుల కార్యకలాపాలు పారదర్శకంగా జరిగితే తప్ప ఆశించిన ఫలితాలు రావని స్పష్టం చేశారు.

సప్లై చైన్స్ గురించి శ్రీ గోయల్ మాట్లాడుతూ, భద్రత , వైవిధ్యీకరణతో పాటు విశ్వాసం ,  పారదర్శకత సూత్రాలు స్థితిస్థాపక , బలమైన సరఫరా గొలుసులకు అత్యంత ముఖ్యమైన కారకాలు అని నొక్కి చెప్పారు. కోవిడ్-19 సమయంలో ఎదురైన విస్తృత అంతరాయాలను నివారించడంలో కీలక పాత్ర పోషించిన బ్రిక్స్ దేశాల మధ్య ముందస్తు హెచ్చరిక వ్యవస్థకు ఇది పునాది అవుతుంది.

 

డిజిటల్ ఎకానమీపై, సాంకేతిక పరిజ్ఞానం ఒక గొప్ప ఈక్వలైజర్ , విభజనకు మూలం కాదని అంగీకరిస్తూనే, వర్చువల్ ప్లాట్ఫామ్ లు, , టెలీ మెడిసిన్, దూర విద్య , ఇ-చెల్లింపులకు ప్రాప్యత లేకపోవడంపై మంత్రి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం, మెరుగైన ప్రజాసేవలకు సంబంధించి భారతదేశం తీసుకున్న క్రియాశీలక చర్యలు, సమిష్టి నిర్ణయాలను ఆయన ప్రస్తావించారు. ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సమర్ధవంతమైన నాయకత్వంలో భారతదేశం ఖర్చుతో కూడుకున్న సాంకేతికత ఆధారిత పరిష్కారాలను ఉపయోగించడం ద్వారా డిజిటల్ విభజనను తగ్గించే లక్ష్యంతో చేపట్టిన కార్యక్రమాలను శ్రీ గోయల్ ప్రస్తావించారు, 

 

బ్రిక్స్ సభ్యదేశాల్లో ఎంఎస్ఎంఇలు అంతర్భాగం కాబట్టి, ఎంఎస్ఎంఈలకు సహకారం, సమిష్టి కృషి ప్రాముఖ్యతను పీయూష్ గోయల్ తెరపైకి తెచ్చారు. పరిశోధన, అభివృద్ధి, సాంకేతిక బదిలీలు, జాయింట్ వెంచర్ల రూపంలో సహకారాన్ని అన్వేషించడం, భవిష్యత్తులో భాగస్వామ్యాల కోసం వ్యాపార అభివృద్ధి అవకాశాలను అన్వేషించడం వంటి కీలక అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని ఆయన వ్యక్తం చేశారు.

 

తప్పుడు ధరలపై, తక్కువ ఇన్వాయిసింగ్ గురించి మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు, వాణిజ్య తప్పుడు ధర , తక్కువ ఇన్వాయిసింగ్ ఆర్థిక వ్యవస్థలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 2021లో భారతదేశం తన ప్రెసిడెన్సీ కింద దాని ప్రాముఖ్యతను గుర్తించిందని, కెపాసిటీ బిల్డింగ్ వర్క్ షాప్ ద్వారా దానిని ఒక ఫలితంగా చేర్చిందని ఆయన పేర్కొన్నారు. భారతదేశం తీసుకున్న చొరవకు కొనసాగింపుగా వర్క్ షాప్ నిర్వహించినందుకు దక్షిణాఫ్రికా ప్రెసిడెన్సీ చేసిన ప్రయత్నాలను ఆయన అభినందించారు.

 

ఉమ్మడి ఉజ్వల భవిష్యత్తు కోసం కరుణ, సహానుభూతి , అవగాహన సూత్రాల కింద సవాళ్లను ఎదుర్కోవటానికి స్థితిస్థాపకత, ఐక్యత ,పారదర్శకతతో పాటు సహకార ప్రయత్నాలు ,నిబద్ధత ప్రాముఖ్యతను మంత్రి నొక్కి చెప్పారు.

 

 

***


(Release ID: 1946871) Visitor Counter : 125