చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ

ఇంటర్ మినిస్ట్రీ బార్ & బెంచ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ రెండవ ఎడిషన్‌ను ప్రారంభించిన కేంద్ర న్యాయ మరియు న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్


ఔత్సాహికుల భాగస్వామ్యానికి సాక్ష్యంగా నిలిచిన ఈవెంట్
అక్టోబరు నుండి దేశవ్యాప్తంగా జరగనున్న ఛాంపియన్‌షిప్ పోటీలు

Posted On: 05 AUG 2023 7:39PM by PIB Hyderabad

ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే లక్ష్యంతో పాటుగా, ఫిట్ ఇండియా మిషన్, న్యాయ మరియు న్యాయ మంత్రిత్వ శాఖతో కలిసి ఈరోజు త్యాగరాజ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఇంటర్- మినిస్ట్రీ బార్ & బెంచ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ రెండవ ఎడిషన్‌ను నిర్వహించింది. ఈ టోర్నమెంట్‌లో న్యాయమూర్తులు, న్యాయవాదులు మరియు భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల అధికారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని కేంద్ర న్యాయ, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రారంభించారు. సంప్రదాయ దుస్తుల్లో ఈ ఈవెంట్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న మంత్రి.. తన స్ట్రోక్ మేకింగ్ తో చిన్నపాటి ఎగ్జిబిషన్ మ్యాచ్ను గుర్తుకుతెచ్చారు. ఈ సందర్భంగా మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఫిట్గా ఉండేందుకు ఏదో ఒక ఆట ఆడాలని సూచించారు. గౌరవనీయులైన న్యాయమూర్తులు, న్యాయవాదులు ఈ క్రీడల్లో పాల్గొనడం ద్వారా తాము ఫిట్గా ఉన్నామని చాటిచెప్పారని,  అందరూ ఫిట్గా ఉంటేనే భారత్ కూడా ఫిట్గా ఉంటుందన్నారు.

"భారతదేశంలో మన సాధువులు మరియు ఋషులు ఆరోగ్యకరమైన జీవనశైలి గురించి బోధించి,  నడిపించే సంప్రదాయం మనకుంది. క్రీడల ద్వారా మనం ఫిట్‌గా ఉండగలమని ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది. అది గ్రామీణ ప్రాంతమైనా లేదా పట్టణ ప్రాంతంలో అయినా, మీరు దేశంలో ఎక్కడికి వెళ్లినా మీరు ప్రతిచోటా జరిగే క్రీడలను చూడవచ్చు’’

"నేను రాజస్థాన్‌లోని బికనీర్ నుండి వచ్చాను. మా ప్రాంతంలో కబడ్డీ మరియు ఖో-ఖో బాగా ప్రాచుర్యం పొందాయి. ఆ సమయంలో బ్యాడ్మింటన్‌ను అర్బన్ లేదా సెమీ అర్బన్ క్రీడగా చూసేవారు. నేడు బ్యాడ్మింటన్ మిమ్మల్ని ఫిట్‌గా ఉంచడమే కాకుండా బాగా పేరుగాంచింది. అంతేకాదు.. బృంద స్ఫూర్తి, సమన్వయం మరియు సానుకూల దృక్పథాన్ని పెంపొందించడానికి దోహదపడుతుంది.   ఈ క్రీడా వేడుకలో పాల్గొనేవారికి, నిర్వాహకుల అద్భుతమైన చొరవను నేను అభినందిస్తున్నాను.

ఈ కార్యక్రమంలో సుప్రీంకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షుడు జస్టిస్ విక్రమ్ నాథ్, సుప్రీంకోర్టు న్యాయవాదులు వికాస్ సింగ్, ప్రదీప్ రాయ్ తదితరులు పాల్గొన్నారు.

“సుప్రీం కోర్ట్ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్‌తో సహా సుప్రీంకోర్టు బార్ సభ్యుల మద్దతుతో ఇంటర్ మినిస్ట్రీ టోర్నమెంట్ నిర్వహించడం ఇది రెండోసారి. ఇందులో న్యాయమూర్తులు, పలువురు సీనియర్ న్యాయవాదులు, లూమినేర్లు, యువ న్యాయవాదులు మరియు అన్ని వయసుల వర్గాల నుండి కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డుతో సహా మంత్రిత్వ శాఖ అధికారులు పాల్గొంటారు. కాబట్టి ఇది ఒక గొప్ప కార్యక్రమం మరియు ఈ రకమైన టోర్నమెంట్‌ను క్రమం తప్పకుండా నిర్వహించాలి.  ఉద్యోగాలలో నిమగ్నమై ఉన్న వ్యక్తులు,  చాలా ఒత్తిడికి గురవుతారు. అటువంటివారు ఇటువంటి ఈవెంట్లతో  మంచి ప్రయోజనం పొందుతారు ”అని ఇండియా లీగల్ ఎయిడ్ సెంటర్ చైర్మన్ కూడా అయిన రాయ్ అన్నారు. .

 
టోర్నమెంట్‌లో 128 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. పురుషుల మరియు మహిళల డబుల్స్ విభాగాల్లో 64 జట్లు పోటీ పడ్డాయి.   న్యాయ మంత్రిత్వ శాఖ మరియు ఫిట్ ఇండియా మిషన్ భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ టోర్నమెంట్ను  మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అబాంతికా డేకా ప్రారంభించారు.

 “ప్రారంభ కార్యక్రమం విజయవంతం అయిన తర్వాత, ఇంటర్ మినిస్ట్రీ బార్ మరియు బెంచ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ యొక్క రెండవ ఎడిషన్ కోసం అటువంటి ప్రోత్సాహకరమైన భాగస్వామ్యాన్ని చూసేందుకు మేము సంతోషిస్తున్నాము. పాల్గొనేవారి ఉత్సాహం మరియు శక్తి స్థాయిలు, వారి వయస్సు లేదా వృత్తితో సంబంధం లేకుండా ఒకరి నుంచి మరొకరు ఈ స్ఫూర్తి పొందాలని " అని డేకా చెప్పారు. అక్టోబరు నుంచి దేశవ్యాప్తంగా ఛాంపియన్‌షిప్‌ను నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు.

“ఈ సంవత్సరం అక్టోబర్ నుండి దేశవ్యాప్తంగా ఇంటర్ మినిస్ట్రీ బార్ మరియు బెంచ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ను నిర్వహించేందుకు ఇది మాకు స్ఫూర్తినిచ్చింది. అదనంగా, నేను అనేక ఇతర మంత్రిత్వ శాఖలకు సంబంధించిన ఈవెంట్‌లను కూడా నిర్వహిస్తాను. ఉద్యోగులకు ఆరోగ్యకరమైన మరియు యోగ్యమైన జీవనశైలిని ప్రోత్సహించడానికి ప్రభుత్వ మంత్రిత్వ శాఖలలో ఇటువంటి క్రీడా కార్యక్రమాలను నిర్వహించడానికి చాలా ఉత్సాహం ఉంది.’’

“మాతో సహకరించినందుకు ఫిట్ ఇండియా మిషన్‌కి నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఫిట్ ఇండియా అనేది ఒక అద్భుతమైన చొరవ. అంతేకాదు.. ఫిట్‌నెస్ ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యతనివ్వాలనే నా మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తుంది. జాతీయ స్థాయిలో బ్యాడ్మింటన్ ఆడినందున, ఒకరి జీవితంలో సానుకూల మార్పులను తీసుకురావడంలో మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని నడిపించడంలో క్రీడలు ఎలా దోహదపతాయో నేను అర్థం చేసుకున్నాను. గౌరవనీయమైన కేంద్ర న్యాయ మంత్రి ఈ కార్యక్రమానికి హాజరు కావడమే కాకుండా ఆనందం మరియు ఉత్సాహంతో కూడా పాల్గొనడం ఎంతో హృద్యంగా ఉంది’ అని డేకా అన్నారు.

పౌరులలో శారీరక దృఢత్వం మరియు ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు గౌరవప్రదమైన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 29, 2019న ఫిట్ ఇండియా మిషన్‌ను ప్రారంభించారు. మన దైనందిన జీవితంలో రోజుకు కనీసం 30 నిమిషాల పాటు ఏదైనా క్రీడ లేదా ఫిట్‌నెస్ కార్యకలాపాలను చేపట్టడాన్ని ప్రచారం చేయడం ఈ ఉద్యమం లక్ష్యం. ఈత, బ్యాడ్మింటన్, సైక్లింగ్ లేదా మెట్లు ఎక్కడం లేదా డ్యాన్స్ వంటి ఏదైనా ప్రాథమిక ఫిట్‌నెస్ యాక్టివిటీ -- ఇది నిశ్చల జీవనశైలిని తొలగిస్తుంది.

***



(Release ID: 1946842) Visitor Counter : 58


Read this release in: English , Urdu , Hindi , Tamil