రైల్వే మంత్రిత్వ శాఖ

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ముఖ్య లక్షణాలు


వందే భారత్ రైళ్ల తయారీకి రూ. 1343.72 కోట్ల నిధుల వినియోగం

Posted On: 02 AUG 2023 4:58PM by PIB Hyderabad

ప్రయాణీకులకు మెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో, భారతీయ రైల్వేలు ఈ క్రింది మెరుగైన భద్రతా లక్షణాలు మరియు సౌకర్యాలతో ఆధునిక కోచ్‌లతో వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది:

 1. ప్రమాదాల నివరాణకు వీలుగా కవాచ్‌ రక్షణ అమర్చబడింది.

2. వేగవంతమైన త్వరణం మరియు గంటకు 160 కి.మీ. వరకు సెమీ హై స్పీడ్ ఆపరేషన్

3. మెరుగ్గా ప్రయాణీకుల కదలిక కోసం పూర్తిగా మూసివేసిన గ్యాంగ్‌వే

4. ఆటోమేటిక్ ప్లగ్ డోర్స్

5 రిక్లైనింగ్ ఎర్గోనామిక్ సీట్లు మరియు ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో రివాల్వింగ్ సీట్లతో సౌకర్యవంతమైన సీటింగ్.

6. మెరుగైన ప్రయాణ సౌకర్యం.

7. ప్రతి సీటుకు మొబైల్ ఛార్జింగ్ సాకెట్లు.

8. హాట్ కేస్, బాటిల్ కూలర్, డీప్ ఫ్రీజర్ & హాట్ వాటర్ బాయిలర్‌తో కూడిన మినీ ప్యాంట్రీ

9. డైరెక్ట్ మరియు డిఫ్యూజ్డ్ లైటింగ్.

10. దివ్యాంగజన ప్రయాణీకుల కోసం డీటీసీలో ప్రత్యేక లావెటరీ.

11. ప్రతి కోచ్‌లో అత్యవసర పరిస్థితులలో తెరవగలిగే విండోస్ మరియు మంటలను ఆర్పే పరికరం

12. అన్ని కోచ్‌లలో సీసీటీవీలు

13. అన్ని కోచ్‌లలో ఎమర్జెన్సీ అలారం పుష్ బటన్‌లు మరియు టాక్ బ్యాక్ యూనిట్‌లు.

14. మెరుగైన అగ్ని భద్రత - ఎలక్ట్రికల్ క్యాబినెట్‌లు మరియు లావేటరీలలో ఏరోసోల్ ఆధారిత ఫైర్ డిటెక్షన్ మరియు సప్రెషన్ సిస్టమ్

15. వాయిస్ రికార్డింగ్ సదుపాయం & క్రాష్ హార్డ్‌డెడ్ మెమరీతో డ్రైవర్-గార్డ్ కమ్యూనికేషన్

16. రిమోట్ మానిటరింగ్‌తో కూడిన కోచ్ కండిషన్ మానిటరింగ్ సిస్టమ్ (సీసీఎంఎస్) డిస్‌ప్లే

17. డిజాస్టర్ లైట్లు - అత్యవసర పరిస్థితుల్లో ఒక్కో కోచ్‌లో 4 నంబర్లు

18. కోచ్ వెలుపల వెనుక వీక్షణ కెమెరాలతో సహా 4 ప్లాట్‌ఫారమ్ సైడ్ కెమెరాలు.

వందే భారత్ రైళ్ల తయారీకి వినియోగించిన మొత్తం నిధులు రూ. 1343.72 కోట్లు. 28 జూలై, 2023 నాటికి, భారతీయ రైల్వేలలో 50 వందే-భారత్ రైలు సర్వీసులు నడుస్తున్నాయి, బోర్డ్ గేజ్ (బీజీ) విద్యుదీకరించబడిన నెట్‌వర్క్ ఉన్న రాష్ట్రాలను కలుపుతోంది. వందే భారత్ సేవలతో సహా రైళ్ల పరిచయం, కార్యాచరణ సాధ్యత, ట్రాఫిక్ సమర్థన మొదలైన వాటికి లోబడి భారతీయ రైల్వేలో కొనసాగుతున్న ప్రక్రియ. భారతదేశం యొక్క మొట్టమొదటి దేశీయంగా రూపొందించబడిన మరియు తయారు చేయబడిన సెమీ-హై స్పీడ్ వందే భారత్ రైళ్లు ప్రయాణీకులకు ఆధునిక మరియు సౌకర్యవంతమైన రైలు ప్రయాణ అనుభవాన్ని అందించాయి. అధిక వేగం, మెరుగైన భద్రతా ప్రమాణాలు మరియు ప్రపంచ స్థాయి సర్వీస్ ఈ రైలు యొక్క ముఖ్యాంశాలు. రైల్వేలు, కమ్యూనికేషన్లు మరియు ఎలక్ట్రానిక్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ ఈరోజు లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారాన్ని అందించారు.

***



(Release ID: 1945223) Visitor Counter : 132


Read this release in: English , Urdu , Tamil