పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

‘75@75 రామ్‌సర్ సైట్‌లు’పై పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సమావేశం

Posted On: 02 AUG 2023 5:30PM by PIB Hyderabad

పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (ఎంఒఈఎఫ్&సిసి)కి అనుబంధంగా ఉన్న పార్లమెంటు సభ్యుల సంప్రదింపుల కమిటీ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ అధ్యక్షత వహించారు.

శ్రీ అశ్విని కుమార్ చౌబే, పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ సహాయ మంత్రి, కుమారి అగాథ సంగ్మా, పార్లమెంటు సభ్యురాలు (లోక్ సభ), శ్రీ గణేష్ సింగ్, పార్లమెంటు సభ్యుడు (లోక్ సభ), శ్రీ సునీల్ కుమార్ సోనీ, పార్లమెంటు సభ్యుడు (లోక్ సభ), శ్రీ అయోధ్యరామి రెడ్డి, పార్లమెంటు సభ్యుడు (రాజ్యసభ), శ్రీరాములు పోతుగంటి, పార్లమెంటు సభ్యుడు (లోక్ సభ), డాక్టర్ కిరోడి లాల్, పార్లమెంటు సభ్యుడు (రాజ్యసభ), శ్రీ జనార్దన్ మిశ్రా, పార్లమెంటు సభ్యుడు (లోక్ సభ), శ్రీ కోటగిరి శ్రీధర్, పార్లమెంటు సభ్యుడు (లోక్ సభ), శ్రీ మహేష్ సాహూ, పార్లమెంటు సభ్యుడు (లోక్ సభ), శ్రీ అమర్ పట్నాయక్, పార్లమెంటు సభ్యుడు (రాజ్యసభ), శ్రీ బినోయ్ విశ్వం, పార్లమెంటు సభ్యుడు (రాజ్యసభ) మరియు పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.

 

image.png


ఈ సమావేశంలో రామ్‌సర్ కన్వెన్షన్ యొక్క అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలల జాబితాకు 75 చిత్తడి నేలలను ప్రకటించడం ద్వారా 75వ స్వాతంత్ర్య సంవత్సరంలో భారతదేశం యొక్క ముఖ్యమైన మైలురాయిని హైలైట్ చేశారు. భారతీయ రామ్‌సర్ సైట్‌ల నెట్‌వర్క్ సుమారుగా 1.33 మిలియన్ హెక్టార్లను కవర్ చేస్తుంది. దేశంలోని తెలిసిన చిత్తడి నేల విస్తీర్ణంలో 8% పైగా ఆసియాలో రెండవ అతిపెద్దది మరియు మొత్తం నియమించబడిన రామ్‌సర్ సైట్‌ల సంఖ్య ప్రకారం ప్రపంచంలో ఐదవది. 75 చిత్తడి నేలలను రామ్‌సర్ సైట్‌లుగా గుర్తించేందుకు ఎంఒఈఎఫ్&సిసి చేస్తున్న కృషిని కమిటీ సభ్యులు అభినందించారు.

 

image.png


ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎంఒఈఎఫ్&సిసి ద్వారా 2023 జూన్ 5న ఇటీవల ప్రకటించిన అమృత్ ధరోహర్ కార్యక్రమం గురించి కూడా కమిటీ సభ్యులు అంచనా వేశారు. అమృత్ ధరోహర్ అనేది జాతీయ మరియు అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన ఇతర చిత్తడి నేలలపై ప్రదర్శన, ప్రతిరూపం మరియు ఉన్నత స్థాయి ప్రభావాన్ని సృష్టించేందుకు రామ్‌సార్ సైట్‌ల పరిరక్షణ విలువలను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకున్న ఒక కార్యక్రమం. జీవ వైవిధ్యం, సాంస్కృతిక వారసత్వం, ఆహారం, నీరు మరియు వాతావరణ భద్రత, స్థిరమైన జీవనోపాధి అవకాశాలు మరియు సామాజిక శ్రేయస్సును పరిరక్షించడం మరియు పెంపొందించడం కోసం రామ్‌సర్ సైట్‌లను పరిరక్షించడం మరియు తెలివిగా ఉపయోగించడం అనే లక్ష్యంతో ఈ పథకాన్ని రాబోయే మూడేళ్లలో అమలు చేయనున్నారు. మిషన్ లైఫ్ మరియు సహభగీత విధానం ద్వారా మార్గనిర్దేశం చేయబడిన, అమృత్ ధరోహర్ యొక్క అమలు వ్యూహంలో జాతులు మరియు నివాస సంరక్షణ, ప్రకృతి పర్యాటకం, చిత్తడి నేలలు జీవనోపాధి, చిత్తడి నేలలు కార్బన్ వంటి నాలుగు కీలక భాగాలు ఉన్నాయి. అమృత్ ధరోహర్ అమలు వ్యూహం యొక్క సమగ్ర విధానాన్ని కమిటీ ప్రశంసించింది.

చిత్తడి నేలల పరిరక్షణ సమస్యలను సమగ్ర పద్ధతిలో మరియు ఎన్‌జీఓలు, పంచాయతీలు మరియు స్థానిక సంఘాలతో కూడిన రాష్ట్ర మరియు కేంద్రపాలిత ప్రభుత్వాల సమన్వయంతో చేపట్టాలని అంగీకరించారు.

శ్రీ భూపేందర్ యాదవ్ చిత్తడి నేలల ప్రాముఖ్యతను వివరిస్తూ చిత్తడి నేలల రక్షణ మరియు పరిరక్షణ కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్రం తీసుకున్న చర్యలను వివరించారు. స్వాతంత్ర్యం వచ్చిన 75 సంవత్సరాలలో 75 ప్రదేశాలను రామ్‌సర్ సైట్‌లుగా గుర్తించడం ద్వారా భారతదేశం సాధించిన ఘనత గురించి కూడా ఆయన చర్చించారు మరియు చిత్తడి నేలలను తెలివిగా ఉపయోగించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.

శ్రీ అశ్విని కుమార్ చౌబే చిత్తడి నేలల సంరక్షణ మరియు నిర్వహణలో పంచాయితీలు మరియు యువతను భాగస్వామ్యం చేయడం యొక్క ప్రాముఖ్యతపై హైలైట్ చేశారు.

image.pngimage.png

 

 

****



(Release ID: 1945218) Visitor Counter : 170


Read this release in: English , Hindi , Urdu