భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఫేమ్ ఇండియా పథకం కింద ఈవీ ల కొనుగోలు

प्रविष्टि तिथि: 01 AUG 2023 2:18PM by PIB Hyderabad

భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఫేజ్ II (ఫేమ్ ఇండియా ఫేజ్ II) స్కీమ్‌లో  2019 ఏప్రిల్ ఒకటి నుండి ప్రారంభమయ్యే ఐదేళ్ల కాలానికి ఫాస్టర్ అడాప్షన్ మరియు ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీకి రూ. 10,000 కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ దశ ప్రధానంగా ప్రజా, భాగస్వామ్య రవాణా విద్యుదీకరణకు మద్దతు ఇవ్వడంపై దృష్టి పెడుతుంది.  డిమాండ్ ప్రోత్సాహక 7090 ఈ -బస్సులు, 5 లక్షల ఈ-త్రీ వీలర్లు, 55000 ఈ- ఫోర్ వీలర్ ప్యాసింజర్ కార్లు, 10 లక్షల ఈ-2 వీలర్ల ద్వారా మద్దతునివ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. అదనంగా, ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను సృష్టించడం కూడా పథకంలో భాగం.

ఫేమ్ ఇండియా పథకం రెండో దశ కింద, 8,47,578 ఎలక్ట్రిక్ వాహనాల మొత్తం రూ. 4157.00 కోట్లు (సుమారుగా) 28.07.2023 నాటికి వినియోగదారులకు ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థలు విక్రయించాయి.  (http://fame2.heavyindustries.gov.in/dashboard.aspx  ప్రకారం). కేటగిరీల వారీగా విక్రయించబడిన ఎలక్ట్రిక్ వాహనాల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి:

 

క్రమ సంఖ్య

వీలర్ రకం 

మొత్తం వాహనాలు 

1.

2 చక్రాలు 

7,53,140

2.

3 చక్రాలు 

85,168

3.

4 చక్రాలు 

9,270

మొత్తం 

8,47,578

 

ఇంకా, ఇంట్రాసిటీ లో కార్యకలాపాల కోసం ఎంహెచ్ఐ 65 నగరాలు/ఎస్టియులు/రాష్ట్ర ప్రభుత్వాలకు 6315 ఎలక్ట్రిక్ బస్సులను మంజూరు చేసింది.  
 

ఫేమ్-ఇండియా స్కీమ్ ఫేజ్-II కింద, ఈవీ తయారీదారులకు ఎలాంటి ప్రోత్సాహకం ఇవ్వరు. విస్తృత స్వీకరణను ప్రారంభించడానికి హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాలను ముందస్తుగా తగ్గించిన కొనుగోలు ధర రూపంలో వినియోగదారులకు (కొనుగోలుదారులు/ముగింపు వినియోగదారులు) ప్రోత్సాహకం/రాయితీ అందిస్తారు. ఇది కేంద్ర ప్రభుత్వం ద్వారా ఓఈఎం (ఈవీ తయారీదారులు)కి తిరిగి చెల్లిస్తారు. .భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ క్రిషన్ పాల్ గుర్జార్  లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం అందించారు.

****


(रिलीज़ आईडी: 1944890) आगंतुक पटल : 161
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi